బడ్జెట్‌- 2025

New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
Union Budget 2025: బడ్జెట్ ఎఫెక్ట్, నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న బంగారం, ఆభరణాల ధరలు!
బడ్జెట్ ఎఫెక్ట్, నిర్మలమ్మ ప్రకటనతో దిగిరానున్న బంగారం, ఆభరణాల ధరలు!

మంత్రిత్వశాఖలకు కేటాయించిన బడ్జెట్ (₹ crore)

Ministry 2023-24 (in Lakh Cr) 2024-25 (in Lakh Cr) 2025-26 (in Lakh Cr) FY25 vs FY26 (%)
Defence 5.94 6.22 6.81 9.53
Road Transport And Highways 2.76 2.78 2.87 3.35
Home Affairs 2 2.19 2.33 6.17
Consumer Affairs, Food and Public Distribution 2.11 2.05 2.15 4.75
Education 1.13 1.21 1.29 6.6
Health 0.89 0.87 0.99 13.92

ఆదాయపు పన్ను స్లాబ్‌లు

Tax Rate Old Regime (Amount in Lakh) New Regime (FY26)
Nil upto 2.5 L upto 4 L
5% 2.5 L to 5 L 4 L to 8 L
10% - 8 L to 12 L
15% - 12 L to 16 L
20% 5 L to 10 L 16 L to 20 L
25% - 20 L to 24 L
30% Above 10 L Above 24 L
Advertisement
Budget 2024

LIVE UPDATES

Budget 2025 Live Updates: రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు
అన్వేషించండి

Sectorial Report

Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు
ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు
Income Tax Refund: మీ ఆదాయపు పన్ను రీఫండ్ రాలేదా? డబ్బులు ఎప్పటిలోగా వస్తాయి? స్టేటస్ చెక్ చేయండి
మీ ఆదాయపు పన్ను రీఫండ్ రాలేదా? డబ్బులు ఎప్పటిలోగా వస్తాయి? స్టేటస్ చెక్ చేయండి
No Income Tax: ఆ దేశాల్లో ఒక్క రూపాయి కూడా Tax కట్టనవసరం లేదు, ఓసారి లిస్ట్ చూడండి
ఆ దేశాల్లో ఒక్క రూపాయి కూడా Tax కట్టనవసరం లేదు, ఓసారి లిస్ట్ చూడండి
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు, చట్టం ఎంత పరిమితిని నిర్ణయించిందో తెలుసుకోండి?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు, చట్టం ఎంత పరిమితిని నిర్ణయించిందో తెలుసుకోండి?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Budget 2025 Agriculture Sector: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త, వ్యవసాయానికి నిర్మలమ్మ ఏం ఇచ్చిందంటే!
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త, వ్యవసాయానికి నిర్మలమ్మ ఏం ఇచ్చిందంటే!
Budget 2025 Expectations: పొలాల్లో బంగారం పండేలా కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు! - వ్యవసాయ బడ్జెట్‌ అంచనాలివి
పొలాల్లో బంగారం పండేలా కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు! - వ్యవసాయ బడ్జెట్‌ అంచనాలివి
Union Budget 2025 : రైతులకు గుడ్ న్యూస్ - ఈ సారి బడ్జెట్ లో పెరగనున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ - పెరగనున్న గ్రామీణ డిమాండ్..!
రైతులకు గుడ్ న్యూస్ - ఈ సారి బడ్జెట్ లో పెరగనున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ - పెరగనున్న గ్రామీణ డిమాండ్..!
Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Budget 2025 : బడ్జెట్ 2025 - రక్షణ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలకు ముందడుగు - R&D కోసం పెరగనున్న నిధులు
బడ్జెట్ 2025 - రక్షణ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలకు ముందడుగు - R&D కోసం పెరగనున్న నిధులు
Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025 - పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులపై నిపుణుల అంచనాలు
కేంద్ర బడ్జెట్ 2025 - పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులపై నిపుణుల అంచనాలు
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Railway Budget 2025 : బడ్జెట్‌లో రైల్వే రంగానికి ప్రాధాన్యం.. హైవేలతో సమానంగా కేటాయింపులు
బడ్జెట్‌లో రైల్వే రంగానికి ప్రాధాన్యం.. హైవేలతో సమానంగా కేటాయింపులు
Budget 2025 : ప్రయాణీకులకు సౌకర్యాలు, తయారీకి ప్రోత్సాహకాలు..  నేటి భారతీయ రైల్వేల అవసరాలు ఇవే
ప్రయాణీకులకు సౌకర్యాలు, తయారీకి ప్రోత్సాహకాలు.. నేటి భారతీయ రైల్వేల అవసరాలు ఇవే
Budget 2025 :  భద్రతపై దృష్టి , మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం.. రైల్వే బడ్జెట్ నుంచి ఆశించేది ఏంటంటే ?
భద్రతపై దృష్టి , మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం.. రైల్వే బడ్జెట్ నుంచి ఆశించేది ఏంటంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Budget 2025 And Stock Market : బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
Budget 2025 Expectations: బండి కదలాలంటే బడ్జెట్‌ బూస్ట్‌ కావాలి  - ఆటోమొబైల్‌ సెక్టార్‌ కోర్కెల లిస్ట్‌ ఇదీ
బండి కదలాలంటే బడ్జెట్‌ బూస్ట్‌ కావాలి - ఆటోమొబైల్‌ సెక్టార్‌ కోర్కెల లిస్ట్‌ ఇదీ
Budget 2025 : బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?
బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
Union Budget 2025: బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ రంగం.. ప్రభుత్వం ముందున్న డిమాండ్లు  ఇవే !
బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ రంగం.. ప్రభుత్వం ముందున్న డిమాండ్లు ఇవే !
Union Budget 2025:ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం హోదా పెరుగుతుందా.. అందుకు ఈ బడ్జెట్ సహకరిస్తుందా ?
ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం హోదా పెరుగుతుందా.. అందుకు ఈ బడ్జెట్ సహకరిస్తుందా ?
Union Budget 2025:సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..బడ్జెట్లో హోమ్ లోన్ వడ్డీపై పన్ను రాయితీ పెంచుతారా ?
సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..బడ్జెట్లో హోమ్ లోన్ వడ్డీపై పన్ను రాయితీ పెంచుతారా ?

Latest stories

కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌ల వల్ల సామాన్యుడికి ఎంత ప్రయోజనం లభిస్తుందో తెలుసా ?
బడ్జెట్‌లో ఈవీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థిక మంత్రి - ఇక చౌకగా ఎలక్ట్రిక్ వాహనాలు
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
నిర్మలమ్మ నోట 'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' - మహాకవి గురజాడ కవిత వెనుక కథ ఇదే!
ఖేలో ఇండియాకు భారీగా కేటాయింపులు.. గతేడాదితో పోలిస్తే క్రీడాలకు తోడ్పాటు.. ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా..
పాత పన్ను విధానానికి సమాధి- కొత్త విధానంలోకి అందర్నీ రప్పించేందుకు కేంద్రం ఎత్తుగడ

Budget Timeline

2025-26

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. దాంతో  వరుసగా 8 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఇందులో 7 వార్షిక బడ్జెట్‌లు, గత ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. దాంతో వరుసగా 8 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఇందులో 7 వార్షిక బడ్జెట్‌లు, గత ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

Read More

2024-25

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టారు. దాంతో వరుసగా 7 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలిచారు. ఇందులో 6 వార్షిక బడ్జెట్‌లు, ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టారు. దాంతో వరుసగా 7 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలిచారు. ఇందులో 6 వార్షిక బడ్జెట్‌లు, ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

Read More

2023-24

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ ‘అమృత్ కాల్’ వృద్ధిపై దృష్టి సారించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఈ బడ్జెట్ లో పలు అంశాలను పొందుపరిచారు. ఈ బడ్జెట్ కు ‘అభివృద్ధికి సప్తబుుషి’, లేదా ‘అభివృద్ధికి ఏడు స్తంభాలు’ అనే పేరు పెట్టారు. అందులో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిలో చివరి మైలుకు చేరుకోవడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి, హరిత వృద్ధి, యువశక్తి, పూర్తి స్థాయిలో సామర్థ్యాలను వాడుకోవడం వంటి వాటిని సూచిస్తుంది. అలాగే, ఈ బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో రూ.2.4 ట్రిలియన్ల బడ్జెట్ కేటాయింపులు చేశారు.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ ‘అమృత్ కాల్’ వృద్ధిపై దృష్టి సారించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఈ బడ్జెట్ లో పలు అంశాలను పొందుపరిచారు. ఈ బడ్జెట్ కు ‘అభివృద్ధికి సప్తబుుషి’, లేదా ‘అభివృద్ధికి ఏడు స్తంభాలు’ అనే పేరు పెట్టారు. అందులో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిలో చివరి మైలుకు చేరుకోవడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి, హరిత వృద్ధి, యువశక్తి, పూర్తి స్థాయిలో సామర్థ్యాలను వాడుకోవడం వంటి వాటిని సూచిస్తుంది. అలాగే, ఈ బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో రూ.2.4 ట్రిలియన్ల బడ్జెట్ కేటాయింపులు చేశారు.

Read More

2022-23

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో రూ.10 లక్షల కోట్ల మూలధన పెట్టుబడిని 33 శాతానికి పెంచారు. దీంతో వృద్ధి సామర్థ్యం, ఉద్యోగాల కల్పనను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, అలాగే గ్లోబల్ హెడ్ విండ్ లకు వ్యతిరేకంగా పరిపుష్టిని అందించడం వంటి వాటిపై దృష్టి సారించారు.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో రూ.10 లక్షల కోట్ల మూలధన పెట్టుబడిని 33 శాతానికి పెంచారు. దీంతో వృద్ధి సామర్థ్యం, ఉద్యోగాల కల్పనను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, అలాగే గ్లోబల్ హెడ్ విండ్ లకు వ్యతిరేకంగా పరిపుష్టిని అందించడం వంటి వాటిపై దృష్టి సారించారు.

Read More

2021-22

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ కొవిడ్ సంక్షోభం తర్వాత వచ్చింది. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం ఎక్కువగా ఇందులో దృష్టి సారించారు. టీకా కోసం నిధుల కేటాయింపులను రూ.35,000 కోట్లకు పెంచింది. బడ్జెట్ లో పెట్రోల్ పై లీటరుకు రూ.2.5 అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను, డీజిల్ పై రూ.4 విధించింది.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ కొవిడ్ సంక్షోభం తర్వాత వచ్చింది. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం ఎక్కువగా ఇందులో దృష్టి సారించారు. టీకా కోసం నిధుల కేటాయింపులను రూ.35,000 కోట్లకు పెంచింది. బడ్జెట్ లో పెట్రోల్ పై లీటరుకు రూ.2.5 అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను, డీజిల్ పై రూ.4 విధించింది.

Read More

2020-21

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ లో.. ఏడాదికి రూ.15 లక్షల వరకూ సంపాదిస్తున్న వారి కోసం కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రతిపాదించారు. అయితే, ఇది ఆప్షనల్. పన్ను చెల్లింపు దారులు వారికి ఇష్టం వచ్చిన ఎంపిక ప్రకారం పన్ను నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు. అలాగే, వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ లో.. ఏడాదికి రూ.15 లక్షల వరకూ సంపాదిస్తున్న వారి కోసం కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రతిపాదించారు. అయితే, ఇది ఆప్షనల్. పన్ను చెల్లింపు దారులు వారికి ఇష్టం వచ్చిన ఎంపిక ప్రకారం పన్ను నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు. అలాగే, వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

Read More

2019-20

ఈ ఏడాది బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపును అందించడం, విద్య, ఆరోగ్య సంరక్షణ MSMEలకు మద్దతు పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పాన్, ఆధార్ కార్డులను మార్చుకునేలా చేసింది.

నిర్మలా సీతారామన్

ఈ ఏడాది బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపును అందించడం, విద్య, ఆరోగ్య సంరక్షణ MSMEలకు మద్దతు పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పాన్, ఆధార్ కార్డులను మార్చుకునేలా చేసింది.

Read More

2019-20

ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన బడ్జెట్ లో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలతో తక్షణ ఉపశమనం అందించడంపై దృష్టి సారించారు. అలాగే, రైతులకు ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయానికి పూర్తి పన్ను రాయితీని వర్తింపచేశారు.

పీయూష్ గోయల్

ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన బడ్జెట్ లో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలతో తక్షణ ఉపశమనం అందించడంపై దృష్టి సారించారు. అలాగే, రైతులకు ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయానికి పూర్తి పన్ను రాయితీని వర్తింపచేశారు.

Read More

2018-19

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను సమర్పించారు. ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ బడ్జెట్ లో  ప్రారంభించారు. ఇందులో GST, పెద్ద నోట్ల రద్దు తర్వాత MSME పరిశ్రమలకు ఊతమిచ్చేలా ప్రతిపాదనలు చేర్చారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి 2022 నాటికి రూ.3,794 కోట్ల మూలధన మద్దతు, పరిశ్రమ సబ్సిడీని బడ్జెట్ లో కేటాయించారు.

అరుణ్ జైట్లీ

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను సమర్పించారు. ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ బడ్జెట్ లో ప్రారంభించారు. ఇందులో GST, పెద్ద నోట్ల రద్దు తర్వాత MSME పరిశ్రమలకు ఊతమిచ్చేలా ప్రతిపాదనలు చేర్చారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి 2022 నాటికి రూ.3,794 కోట్ల మూలధన మద్దతు, పరిశ్రమ సబ్సిడీని బడ్జెట్ లో కేటాయించారు.

Read More

2017-18

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 3 ప్రధాన సంస్కరణలతో కూడిన బడ్జెట్ ను సమర్పించారు. అవి బడ్జెట్ సమర్పించే తేదీ మార్చడం, రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో విలీనం చేయడం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల రద్దు.

అరుణ్ జైట్లీ

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 3 ప్రధాన సంస్కరణలతో కూడిన బడ్జెట్ ను సమర్పించారు. అవి బడ్జెట్ సమర్పించే తేదీ మార్చడం, రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో విలీనం చేయడం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల రద్దు.

Read More

2016-17

భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్ పేదలకు సహాయం చేసేందుకు 3 ప్రధాన పథకాలను హైలైట్ చేసింది. అవి ప్రధాన మంత్రి ఫసల్ యోజన, ఆరోగ్య బీమా పథకం, BPL (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) కుటుంబాలకు LPG కనెక్షన్స్ అందించేలా చొరవ చూపారు.

అరుణ్ జైట్లీ

భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్ పేదలకు సహాయం చేసేందుకు 3 ప్రధాన పథకాలను హైలైట్ చేసింది. అవి ప్రధాన మంత్రి ఫసల్ యోజన, ఆరోగ్య బీమా పథకం, BPL (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) కుటుంబాలకు LPG కనెక్షన్స్ అందించేలా చొరవ చూపారు.

Read More

2015-16

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించారు. ఇందులో రక్షణ, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు పెంచడానికి, ఆర్థిక ఏకీకరణ, ప్రణాళికేతర వ్యయాన్ని పెంచడం లక్ష్యంగా దృష్టి సారించారు.

అరుణ్ జైట్లీ

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించారు. ఇందులో రక్షణ, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు పెంచడానికి, ఆర్థిక ఏకీకరణ, ప్రణాళికేతర వ్యయాన్ని పెంచడం లక్ష్యంగా దృష్టి సారించారు.

Read More

2014-15

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సమర్పించారు. ఎన్నికల ఏడాదిలో ఆర్థిక స్థిరత్వం కొరకు ఉద్దేశించిన ఈ బడ్జెట్ లో ఎలాంటి పన్ను మార్పులు లేవు. అయితే, తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా ఎక్సైజ్ సుంకం కోతలను విధించారు.

పి.చిదంబరం

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సమర్పించారు. ఎన్నికల ఏడాదిలో ఆర్థిక స్థిరత్వం కొరకు ఉద్దేశించిన ఈ బడ్జెట్ లో ఎలాంటి పన్ను మార్పులు లేవు. అయితే, తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా ఎక్సైజ్ సుంకం కోతలను విధించారు.

Read More

2013-14

ధనవంతులు, పెద్ద కంపెనీలపై విధించిన కొత్త పన్నుల నుంచి అధిక రాబడితో నిధులను సమకూర్చుకునేలా, ఈ ఆర్థిక ఏడాదికి పెరిగిన ఖర్చులను చేర్చేలా ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక లోటు తగ్గించడం, దశాబ్దంలో దేశ ఆర్థిక మందగమనం నుంచి వృద్ధిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇందులో అంశాలను పొందుపరిచారు.

పి.చిదంబరం

ధనవంతులు, పెద్ద కంపెనీలపై విధించిన కొత్త పన్నుల నుంచి అధిక రాబడితో నిధులను సమకూర్చుకునేలా, ఈ ఆర్థిక ఏడాదికి పెరిగిన ఖర్చులను చేర్చేలా ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక లోటు తగ్గించడం, దశాబ్దంలో దేశ ఆర్థిక మందగమనం నుంచి వృద్ధిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇందులో అంశాలను పొందుపరిచారు.

Read More

2012-13

ఈ బడ్జెట్ ను ప్రణబ్ ముఖర్జీ సమర్పించారు. ఇది ప్రణాళికా వ్యయాన్ని పెంచడం సహా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచింది. ఇందులో సేవా పన్ను రేటును 10 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అలాగే, దేశీయ తయారీ, ఎగుమతులను పెంచేలా బడ్జెట్ లో అంశాలు పొందుపరిచారు.

ప్రణబ్ ముఖర్జీ

ఈ బడ్జెట్ ను ప్రణబ్ ముఖర్జీ సమర్పించారు. ఇది ప్రణాళికా వ్యయాన్ని పెంచడం సహా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచింది. ఇందులో సేవా పన్ను రేటును 10 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అలాగే, దేశీయ తయారీ, ఎగుమతులను పెంచేలా బడ్జెట్ లో అంశాలు పొందుపరిచారు.

Read More

2011-12

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన బడ్జెట్ ఆర్థిక స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. విద్యపై 24 శాతం, ఆరోగ్యంపై 20 శాతం వ్యయం పెరిగింది.

ప్రణబ్ ముఖర్జీ

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన బడ్జెట్ ఆర్థిక స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. విద్యపై 24 శాతం, ఆరోగ్యంపై 20 శాతం వ్యయం పెరిగింది.

Read More

2010-11

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ బడ్జెట్ సమర్పించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించడం, ఉద్యోగాలు సృష్టించడానికి, గ్రామీణుల జీవనోపాధి వృద్ధి చెందేలా కేటాయింపుల కోసం నొక్కి చెప్పారు. ఇది బాండ్లకు బదులుగా ఇంధనం, ఎరువులకు నగదు రాయితీలను అందించడం ద్వారా సరళీకృతం చేసింది.

ప్రణబ్ ముఖర్జీ

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ బడ్జెట్ సమర్పించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించడం, ఉద్యోగాలు సృష్టించడానికి, గ్రామీణుల జీవనోపాధి వృద్ధి చెందేలా కేటాయింపుల కోసం నొక్కి చెప్పారు. ఇది బాండ్లకు బదులుగా ఇంధనం, ఎరువులకు నగదు రాయితీలను అందించడం ద్వారా సరళీకృతం చేసింది.

Read More

2009-10

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన ఈ బడ్జెట్ ఆర్థిక సంక్షోభం సమయంలో దేశంలోని బలహీన వర్గాలను కాపాడుతూ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. విద్య, మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధిపై పెరిగిన వ్యయంతో వ్యాపారులు,వ్యక్తులకు సంబంధించి పన్ను తగ్గింపులను ఇందులో పొందుపరిచారు.

ప్రణబ్ ముఖర్జీ

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన ఈ బడ్జెట్ ఆర్థిక సంక్షోభం సమయంలో దేశంలోని బలహీన వర్గాలను కాపాడుతూ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. విద్య, మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధిపై పెరిగిన వ్యయంతో వ్యాపారులు,వ్యక్తులకు సంబంధించి పన్ను తగ్గింపులను ఇందులో పొందుపరిచారు.

Read More

2009-10

ఎన్నికలకు ముందు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రత్యేకంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికా వ్యయాన్ని పెంచింది. అలాగే, గృహ రుణాలు, విద్యలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపులను పెంచింది. ఇది మధ్య తరగతి వారికి మేలు చేకూర్చింది.

ప్రణబ్ ముఖర్జీ

ఎన్నికలకు ముందు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రత్యేకంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికా వ్యయాన్ని పెంచింది. అలాగే, గృహ రుణాలు, విద్యలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపులను పెంచింది. ఇది మధ్య తరగతి వారికి మేలు చేకూర్చింది.

Read More

2008-09

ఈ ఏడాది బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబర్ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాల మాఫీ, ఆదాయపు పన్ను మినహాయింపులు, కొత్త ఐఐటీలు, యూనివర్శిటీలపై దృష్టి సారించే బడ్జెట్ ను సమర్పించారు.

పి.చిదంబరం

ఈ ఏడాది బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబర్ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాల మాఫీ, ఆదాయపు పన్ను మినహాయింపులు, కొత్త ఐఐటీలు, యూనివర్శిటీలపై దృష్టి సారించే బడ్జెట్ ను సమర్పించారు.

Read More

2007-08

ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ ఏడాది సమర్పించిన బడ్జెట్ గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను మెరుగుపరిచింది. NREGA కవరేజీ, నీటి పారుదలకు సంబంధించి నిధుల కేటాయింపుతో అభివృద్ధి జరిగింది. ఇంకా విద్యపై కేటాయింపులు 34 శాతం పెరిగాయి.

పి.చిదంబరం

ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ ఏడాది సమర్పించిన బడ్జెట్ గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను మెరుగుపరిచింది. NREGA కవరేజీ, నీటి పారుదలకు సంబంధించి నిధుల కేటాయింపుతో అభివృద్ధి జరిగింది. ఇంకా విద్యపై కేటాయింపులు 34 శాతం పెరిగాయి.

Read More

2006-07

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించారు. ఇందులో ‘మౌలానా ఆజాద్ ఫౌండేషన్’కు రెట్టింపు నిధులతో విద్యపై దృష్టి సారించారు. అలాగే, మైనారిటీ పథకాలకు మద్దతు పెరిగింది. ఇక, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు సమకూరాయి.

పి.చిదంబరం

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించారు. ఇందులో ‘మౌలానా ఆజాద్ ఫౌండేషన్’కు రెట్టింపు నిధులతో విద్యపై దృష్టి సారించారు. అలాగే, మైనారిటీ పథకాలకు మద్దతు పెరిగింది. ఇక, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు సమకూరాయి.

Read More

2005-06

ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించిన ఈ బడ్జెట్ దేశీయ కంపెనీలు, వ్యక్తులకు పన్ను తగ్గింపులతో వృద్ధిని పెంచింది. అలాగే, పెట్టుబడులను సైతం ఆకర్షించింది. కస్టమ్ సుంకాలు కూడా తగ్గించబడ్డాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలపై బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.

పి.చిదంబరం

ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించిన ఈ బడ్జెట్ దేశీయ కంపెనీలు, వ్యక్తులకు పన్ను తగ్గింపులతో వృద్ధిని పెంచింది. అలాగే, పెట్టుబడులను సైతం ఆకర్షించింది. కస్టమ్ సుంకాలు కూడా తగ్గించబడ్డాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలపై బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.

Read More

2004-05

ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ సమర్పించిన మధ్యంతర బడ్జెట్ NDA ప్రభుత్వ ‘పాంచ్ ప్రాధాన్యతలు’ను ఉద్ఘాటించింది. అవి పేదరికం తగ్గింపు, వ్యవసాయ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణ, సమర్థవంతమైన ఉత్పాదకత ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది.

జశ్వంత్ సింగ్

ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ సమర్పించిన మధ్యంతర బడ్జెట్ NDA ప్రభుత్వ ‘పాంచ్ ప్రాధాన్యతలు’ను ఉద్ఘాటించింది. అవి పేదరికం తగ్గింపు, వ్యవసాయ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణ, సమర్థవంతమైన ఉత్పాదకత ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది.

Read More

2003-04

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ సమర్పించారు. ఇందులో కీలకమైన పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచడం సహా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే, టెక్స్ టైల్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు పాలిస్టర్ పై ఎక్సైజ్ సుంకం కోతలు విధించారు.

జశ్వంత్ సింగ్

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ సమర్పించారు. ఇందులో కీలకమైన పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచడం సహా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే, టెక్స్ టైల్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు పాలిస్టర్ పై ఎక్సైజ్ సుంకం కోతలు విధించారు.

Read More

2002-03

ఈ ఏడాది యశ్వంత్ సిన్హా సమర్పించిన బడ్జెట్ లో వ్యవసాయం, చక్కెర, ఔషధాలపై నియంత్రణ ఎత్తివేతపై ప్రస్తావించారు.

యశ్వంత్ సిన్హా

ఈ ఏడాది యశ్వంత్ సిన్హా సమర్పించిన బడ్జెట్ లో వ్యవసాయం, చక్కెర, ఔషధాలపై నియంత్రణ ఎత్తివేతపై ప్రస్తావించారు.

Read More

2001-02

యశ్వంత్ సిన్హా మౌలిక సదుపాయాలు, సాంకేతికత, గ్రామీణాభివృద్ధిని పెంచే లక్ష్యంతో ఈ బడ్జెట్ సమర్పించారు. ఇది కార్పొరేట్ పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడం సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.

యశ్వంత్ సిన్హా

యశ్వంత్ సిన్హా మౌలిక సదుపాయాలు, సాంకేతికత, గ్రామీణాభివృద్ధిని పెంచే లక్ష్యంతో ఈ బడ్జెట్ సమర్పించారు. ఇది కార్పొరేట్ పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడం సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.

Read More

2000-01

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సమర్పించిన ఈ మిలీనియం బడ్జెట్ ఆర్థిక నియంత్రణపై దృష్టి సారించింది. అలాగే, ఇ - గవర్నెన్స్, పన్ను మినహాయింపుల ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించింది.

యశ్వంత్ సిన్హా

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సమర్పించిన ఈ మిలీనియం బడ్జెట్ ఆర్థిక నియంత్రణపై దృష్టి సారించింది. అలాగే, ఇ - గవర్నెన్స్, పన్ను మినహాయింపుల ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించింది.

Read More

1999-2000

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1999 వరకు, ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్ ను సమర్పించేవారు. 1999లో ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ సమర్పించాలని సిన్హా ప్రతిపాదించారు.

యశ్వంత్ సిన్హా

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1999 వరకు, ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్ ను సమర్పించేవారు. 1999లో ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ సమర్పించాలని సిన్హా ప్రతిపాదించారు.

Read More

1998-99

ఎన్డీఏ నేతృత్వంలోని ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా.. 1998, జూన్ 1న సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

యశ్వంత్ సిన్హా

ఎన్డీఏ నేతృత్వంలోని ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా.. 1998, జూన్ 1న సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1997-98

ఈ బడ్జెట్ ను భారత మీడియా.. ‘డ్రీమ్ బడ్జెట్’ అని కూడా పిలుస్తుంది. 1997, ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి పి.చిదంబరం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను రేట్లు తగ్గించడం సహా, కార్పొరేట్ పన్నులపై సర్ ఛార్జీని తొలగించడం, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వంటి ఆర్థిక సంస్కరణలను ఈ బడ్జెట్ లో పొందుపరిచారు.

పి.చిదంబరం

ఈ బడ్జెట్ ను భారత మీడియా.. ‘డ్రీమ్ బడ్జెట్’ అని కూడా పిలుస్తుంది. 1997, ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి పి.చిదంబరం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను రేట్లు తగ్గించడం సహా, కార్పొరేట్ పన్నులపై సర్ ఛార్జీని తొలగించడం, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వంటి ఆర్థిక సంస్కరణలను ఈ బడ్జెట్ లో పొందుపరిచారు.

Read More

1996-97

1996, మార్చి 19న ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆ ఏడాది సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

పి.చిదంబరం

1996, మార్చి 19న ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆ ఏడాది సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1995-96

నరసింహారావు హయాంలో ఇదే చివరి సాధారణ బడ్జెట్. మన్మోహన్ సింగ్ 1995, మార్చి 15న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మన్మోహన్ సింగ్

నరసింహారావు హయాంలో ఇదే చివరి సాధారణ బడ్జెట్. మన్మోహన్ సింగ్ 1995, మార్చి 15న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Read More

1994-95

1994, ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కేంద్ర బడ్జెట్ సమర్పించారు.

మన్మోహన్ సింగ్

1994, ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కేంద్ర బడ్జెట్ సమర్పించారు.

Read More

1993-94

1993, ఫిబ్రవరి 27న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తన సాధారణ మూడో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

మన్మోహన్ సింగ్

1993, ఫిబ్రవరి 27న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తన సాధారణ మూడో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1992-93

1992, ఫిబ్రవరి 29న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తన రెండో బడ్జెట్ సమర్పించారు.

మన్మోహన్ సింగ్

1992, ఫిబ్రవరి 29న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తన రెండో బడ్జెట్ సమర్పించారు.

Read More

1991-92

1991, జులై 24న పీవీ నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ చరిత్రలో ‘ల్యాండ్ మార్క్’ బడ్జెట్ గా వర్ణించబడే దేశ తొలి బడ్జెట్ ను మన్మోహన్ సింగ్ సమర్పించారు. సంస్కరణల శ్రేణికి మాజీ ఆర్బీఐ గవర్నర్ నాంది పలికారు.

మన్మోహన్ సింగ్

1991, జులై 24న పీవీ నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ చరిత్రలో ‘ల్యాండ్ మార్క్’ బడ్జెట్ గా వర్ణించబడే దేశ తొలి బడ్జెట్ ను మన్మోహన్ సింగ్ సమర్పించారు. సంస్కరణల శ్రేణికి మాజీ ఆర్బీఐ గవర్నర్ నాంది పలికారు.

Read More

1990-91

1990, మార్చి 19న థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. అనంతరం ఎఫ్ఎం మధు దండావతే కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

మధు దండావతే

1990, మార్చి 19న థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. అనంతరం ఎఫ్ఎం మధు దండావతే కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1989-90

నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకర్రావ్ చవాన్ 1989, ఫిబ్రవరి 28న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు.

శంకర్రావ్ చవాన్

నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకర్రావ్ చవాన్ 1989, ఫిబ్రవరి 28న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు.

Read More

1988-89

1988, ఫిబ్రవరి 29న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఆర్థిక మంత్రి ఎన్.డీ.తివారీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే, ఆ ఏడాదికి మాత్రమే ఆయన బడ్జెట్ సమర్పించారు.

ఎన్.డీ.తివారీ

1988, ఫిబ్రవరి 29న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఆర్థిక మంత్రి ఎన్.డీ.తివారీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే, ఆ ఏడాదికి మాత్రమే ఆయన బడ్జెట్ సమర్పించారు.

Read More

1987-88

ఫిబ్రవరి 28, 1987న దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

రాజీవ్ గాంధీ

ఫిబ్రవరి 28, 1987న దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Read More

1986-87

1986, ఫిబ్రవరి 28న వీపీ మళ్లీ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

వీపీ సింగ్

1986, ఫిబ్రవరి 28న వీపీ మళ్లీ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1985-86

1985, మార్చి 16న అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

వీపీ సింగ్

1985, మార్చి 16న అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

Read More

1984-85

1984, ఫిబ్రవరి 29న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తన చివరి బడ్జెట్ సమర్పించారు.

ప్రణబ్ ముఖర్జీ

1984, ఫిబ్రవరి 29న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తన చివరి బడ్జెట్ సమర్పించారు.

Read More

1983-84

1983, ఫిబ్రవరి 28న ప్రణబ్ ముఖర్జీ భారతదేశ సాధారణ బడ్జెట్ సమర్పించారు.

ప్రణబ్ ముఖర్జీ

1983, ఫిబ్రవరి 28న ప్రణబ్ ముఖర్జీ భారతదేశ సాధారణ బడ్జెట్ సమర్పించారు.

Read More

1982-83

1982, ఫిబ్రవరి 27న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు.

ప్రణబ్ ముఖర్జీ

1982, ఫిబ్రవరి 27న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు.

Read More

1981-82

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 28, 1981న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.వెంకట్రామన్ పార్లమెంట్ లో సమర్పించారు.

ఆర్.వెంకట్రామన్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 28, 1981న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.వెంకట్రామన్ పార్లమెంట్ లో సమర్పించారు.

Read More

1980-81

ఈ ఏడాది సాధారణ కేంద్ర బడ్జెట్ ను అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్.వెంకట్రామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. భారత ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్నారు.

ఆర్.వెంకట్రామన్

ఈ ఏడాది సాధారణ కేంద్ర బడ్జెట్ ను అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్.వెంకట్రామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. భారత ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్నారు.

Read More

1979-80

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి చరణ్ సింగ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం 7వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించింది. యూనియన్ ఎక్సైజ్ ఛార్జీల్లో రాష్ట్రాల వాటా 20 నుంచి 40 శాతానికి రెట్టింపు కావడం, దాని వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేసింది.

చరణ్ సింగ్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి చరణ్ సింగ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం 7వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించింది. యూనియన్ ఎక్సైజ్ ఛార్జీల్లో రాష్ట్రాల వాటా 20 నుంచి 40 శాతానికి రెట్టింపు కావడం, దాని వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేసింది.

Read More

1978-79

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు.

ముఖ్యాంశం: దేశంలో అక్రమ కార్యకలాపాలు అరికట్టేందుకు 1978 జనవరి 16 నాటికి రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను తొలగించాలని జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించిన నెల లోపే ఈ బడ్జెట్ ను సమర్పించారు. దీన్ని పటిష్టంగా అమలు చేసేలా ఈ బడ్జెట్ ప్రసంగం సాగింది.

హిరుభాయ్ ఎం.పటేల్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు. ముఖ్యాంశం: దేశంలో అక్రమ కార్యకలాపాలు అరికట్టేందుకు 1978 జనవరి 16 నాటికి రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను తొలగించాలని జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించిన నెల లోపే ఈ బడ్జెట్ ను సమర్పించారు. దీన్ని పటిష్టంగా అమలు చేసేలా ఈ బడ్జెట్ ప్రసంగం సాగింది.

Read More

1977-78

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక విధానాలు, కార్యక్రమాల్లో ప్రాథమిక మార్పు ఆవశ్యకతపై ప్రస్తావించారు.

హిరుభాయ్ ఎం.పటేల్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక విధానాలు, కార్యక్రమాల్లో ప్రాథమిక మార్పు ఆవశ్యకతపై ప్రస్తావించారు.

Read More

1976-77

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో గతేడాదితో పోలిస్తే లోటు బడ్జెట్ రూ.490 కోట్లుగా అంచనా వేయబడింది. గతేడాది అంచనా లోటు రూ.247 కోట్లుగా ఉంది.

చిదంబరం సుబ్రమణ్యం

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో గతేడాదితో పోలిస్తే లోటు బడ్జెట్ రూ.490 కోట్లుగా అంచనా వేయబడింది. గతేడాది అంచనా లోటు రూ.247 కోట్లుగా ఉంది.

Read More

1975-76

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.10,521 కోట్లు, వ్యయం రూ.10,768 కోట్లుగా అంచనా వేయగా.. రూ.247 కోట్లు లోటును మిగిల్చింది.

చిదంబరం సుబ్రమణ్యం

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.10,521 కోట్లు, వ్యయం రూ.10,768 కోట్లుగా అంచనా వేయగా.. రూ.247 కోట్లు లోటును మిగిల్చింది.

Read More

1974-75

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ తో భారతదేశ ఆదాయపు పన్ను వ్యవస్థ పునర్నిర్మాణానికి వేదికను సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా, గరిష్ట ఉపాంత ఆదాయపు పన్ను రేటును 97.75 శాతం నుంచి 75 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ తో భారతదేశ ఆదాయపు పన్ను వ్యవస్థ పునర్నిర్మాణానికి వేదికను సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా, గరిష్ట ఉపాంత ఆదాయపు పన్ను రేటును 97.75 శాతం నుంచి 75 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More

1973-74

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ ఏడాది ఆర్థిక లోటు రూ.550 కోట్లుగా ఉండగా.. ఈ బడ్జెట్ ను ‘బ్లాక్ బడ్జెట్’ అని పిలుస్తారు. భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయం అది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ ఏడాది ఆర్థిక లోటు రూ.550 కోట్లుగా ఉండగా.. ఈ బడ్జెట్ ను ‘బ్లాక్ బడ్జెట్’ అని పిలుస్తారు. భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయం అది.

Read More

1972-73

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.
 
ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమాన్ని వేగవంతం చేసేలా కేంద్ర ప్రాయోజిత ప్రణాళికా పథకాలకు కేటాయింపులు పెంచింది. వీటికి రూ.1455 నుంచి రూ.1787కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమాన్ని వేగవంతం చేసేలా కేంద్ర ప్రాయోజిత ప్రణాళికా పథకాలకు కేటాయింపులు పెంచింది. వీటికి రూ.1455 నుంచి రూ.1787కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Read More

1971-72

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయల్లో కొనుగోలు చేసే అన్ని విమానయాన టికెట్లపై 20 శాతం అదనపు పన్ను రేటు విధించింది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయల్లో కొనుగోలు చేసే అన్ని విమానయాన టికెట్లపై 20 శాతం అదనపు పన్ను రేటు విధించింది.

Read More

1970-71

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన ఇందిరాగాంధీ సమర్పించారు.

ముఖ్యాంశం: స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా నేతగా (నిర్మలా సీతారామన్ 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు) ఖ్యాతి గాంచారు.

ఇందిరాగాంధీ

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన ఇందిరాగాంధీ సమర్పించారు. ముఖ్యాంశం: స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా నేతగా (నిర్మలా సీతారామన్ 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు) ఖ్యాతి గాంచారు.

Read More

1969-70

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్‌లో, కొత్త పారిశ్రామిక సంస్థలు, నౌకలకు పన్ను సెలవు రాయితీని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్‌లో, కొత్త పారిశ్రామిక సంస్థలు, నౌకలకు పన్ను సెలవు రాయితీని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read More

1968-69

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: పన్ను చెల్లింపుదారులు ‘స్పౌజ్ అలవెన్స్’ అనే విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఈ విధానాన్ని రద్దు చేసింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: పన్ను చెల్లింపుదారులు ‘స్పౌజ్ అలవెన్స్’ అనే విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఈ విధానాన్ని రద్దు చేసింది.

Read More

1967-68

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాదాపు రూ.68 కోట్ల లోటును అంచనా వేశారు.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాదాపు రూ.68 కోట్ల లోటును అంచనా వేశారు.

Read More

1966-67

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి సచింద్ర చౌదురి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ఖర్చు రూ.2,407 కోట్లు ఉండగా.. ఆదాయం రూ.2,617 కోట్లుగా ఉంది. రూ.210 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.

సచింద్ర చౌదురి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి సచింద్ర చౌదురి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ఖర్చు రూ.2,407 కోట్లు ఉండగా.. ఆదాయం రూ.2,617 కోట్లుగా ఉంది. రూ.210 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.

Read More

1965-66

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ప్రభుత్వం లెక్కల్లో లేని సంపద కోసం స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రారంభించింది. దేశంలో నల్లధనం, పన్ను ఎగవేత వంటి వాటిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం ఇదే.

టి.టి.కృష్ణమాచారి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ప్రభుత్వం లెక్కల్లో లేని సంపద కోసం స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రారంభించింది. దేశంలో నల్లధనం, పన్ను ఎగవేత వంటి వాటిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం ఇదే.

Read More

1964-65

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఏడాదికి రూ.36,000 కంటే ఎక్కువగా ఉన్న అన్ని ఖర్చులపైనా విధించే ప్రత్యక్ష పన్నుల విధానం కింద వ్యయ పన్నును ఉంచారు. అయితే, ఇది 1966-67 బడ్డెట్ సందర్భంగా కార్పొరేట్ల నుంచి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత రద్దు చేయబడింది.

టి.టి.కృష్ణమాచారి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఏడాదికి రూ.36,000 కంటే ఎక్కువగా ఉన్న అన్ని ఖర్చులపైనా విధించే ప్రత్యక్ష పన్నుల విధానం కింద వ్యయ పన్నును ఉంచారు. అయితే, ఇది 1966-67 బడ్డెట్ సందర్భంగా కార్పొరేట్ల నుంచి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత రద్దు చేయబడింది.

Read More

1963-64

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో అధిక లాభాల (సూపర్ ప్రాఫిట్ ట్యాక్స్) పన్నును ప్రవేశ పెట్టారు. దేశంలో అత్యంత సంపన్న వ్యక్తులు, లాభాలు ఆర్జించే పరిశ్రమలు, సంస్థలపై విధించే పన్నును ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో విస్తృత శ్రేణి పరిశ్రమల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో అధిక లాభాల (సూపర్ ప్రాఫిట్ ట్యాక్స్) పన్నును ప్రవేశ పెట్టారు. దేశంలో అత్యంత సంపన్న వ్యక్తులు, లాభాలు ఆర్జించే పరిశ్రమలు, సంస్థలపై విధించే పన్నును ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో విస్తృత శ్రేణి పరిశ్రమల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

Read More

1962-63

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.1,305 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.1369.33 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో రూ.63.46 కోట్ల లోటు ఏర్పడింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.1,305 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.1369.33 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో రూ.63.46 కోట్ల లోటు ఏర్పడింది.

Read More

1961-62

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం రూ.962.92 కోట్ల ఆదాయం, రూ.1023.52 కోట్ల వ్యయంతో రూ.60.60 కోట్ల లోటు మిగిల్చింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం రూ.962.92 కోట్ల ఆదాయం, రూ.1023.52 కోట్ల వ్యయంతో రూ.60.60 కోట్ల లోటు మిగిల్చింది.

Read More

1960-61

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో USAతో దిగుమతి ఒప్పందం అయిన ‘PL480’ కోసం ప్రభుత్వం అంచనాలను విడుదల చేసింది. 1959లో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం, ఆ సమయంలో రూ.122 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి US ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో USAతో దిగుమతి ఒప్పందం అయిన ‘PL480’ కోసం ప్రభుత్వం అంచనాలను విడుదల చేసింది. 1959లో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం, ఆ సమయంలో రూ.122 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి US ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Read More

1959-60

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం రూ.757.51 కోట్లు కాగా ఖర్చు రూ.839.18 కోట్లుగా ఉంది. రూ.81.67 కోట్ల లోటు మిగిల్చింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం రూ.757.51 కోట్లు కాగా ఖర్చు రూ.839.18 కోట్లుగా ఉంది. రూ.81.67 కోట్ల లోటు మిగిల్చింది.

Read More

1958-59

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ సమర్పించారు.

ముఖ్యాంశం: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఓ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాని బడ్జెట్ సమర్పించే బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నారు. ఈ బడ్జెట్ లోనే గిఫ్ట్ ట్యాక్స్ అనే కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టారు.

జవహర్ లాల్ నెహ్రూ

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ సమర్పించారు. ముఖ్యాంశం: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఓ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాని బడ్జెట్ సమర్పించే బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నారు. ఈ బడ్జెట్ లోనే గిఫ్ట్ ట్యాక్స్ అనే కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టారు.

Read More

1957-58

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వెల్త్ ట్యాక్స్ ఆవిష్కరించింది. ఇది ఓ కొత్త పన్నుల ప్రత్యక్ష విధానంగా కొనసాగింది.

టి.టి.కృష్ణమాచారి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వెల్త్ ట్యాక్స్ ఆవిష్కరించింది. ఇది ఓ కొత్త పన్నుల ప్రత్యక్ష విధానంగా కొనసాగింది.

Read More

1956-57

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ ఏడాది మొత్తం బడ్జెట్ రూ.545.43 కోట్లు ప్రతిపాదించగా.. రక్షణ సేవలకు రూ.203.97 కోట్లు, సివిల్ హెడ్ లకు రూ.341.46 కోట్లు కేటాయించారు.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ ఏడాది మొత్తం బడ్జెట్ రూ.545.43 కోట్లు ప్రతిపాదించగా.. రక్షణ సేవలకు రూ.203.97 కోట్లు, సివిల్ హెడ్ లకు రూ.341.46 కోట్లు కేటాయించారు.

Read More

1955-56

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వివాహం అయిన వారికి, వివాహం కాని వ్యక్తులకు వేర్వేరుగా పన్ను మినహాయింపు పరిమితులను ప్రతిపాదించింది. పెళ్లైన జంటలకు రూ.2,000, పెళ్లి కాని వ్యక్తులకు రూ.1,000 పరిమితిని కొనసాగించారు.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వివాహం అయిన వారికి, వివాహం కాని వ్యక్తులకు వేర్వేరుగా పన్ను మినహాయింపు పరిమితులను ప్రతిపాదించింది. పెళ్లైన జంటలకు రూ.2,000, పెళ్లి కాని వ్యక్తులకు రూ.1,000 పరిమితిని కొనసాగించారు.

Read More

1954-55

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: బడ్జెట్ అంచనా ఆదాయం రూ.441.03 కోట్లు కాగా ఖర్చు రూ.467.09 కోట్లుగా ఉంది. లోటు రూ.26.06 కోట్లుగా ఉంది.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: బడ్జెట్ అంచనా ఆదాయం రూ.441.03 కోట్లు కాగా ఖర్చు రూ.467.09 కోట్లుగా ఉంది. లోటు రూ.26.06 కోట్లుగా ఉంది.

Read More

1953-54

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కనీస ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని మునుపటి రూ.3,600 నుంచి రూ.4,200 (సుమారు 17 శాతం) వరకు పెంచారు.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కనీస ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని మునుపటి రూ.3,600 నుంచి రూ.4,200 (సుమారు 17 శాతం) వరకు పెంచారు.

Read More

1952-53

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ.3.23 కోట్లుగా ఉంది. మొత్తం లోటు రూ.75.6 కోట్లుగా అంచనా వేయబడింది.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ.3.23 కోట్లుగా ఉంది. మొత్తం లోటు రూ.75.6 కోట్లుగా అంచనా వేయబడింది.

Read More

1951-52

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం అంచనా రూ.369.89 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.375.43 కోట్లు ఉంది. రూ.5.54 కోట్ల లోటును మిగిల్చింది.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం అంచనా రూ.369.89 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.375.43 కోట్లు ఉంది. రూ.5.54 కోట్ల లోటును మిగిల్చింది.

Read More

1950-51

1950 -51లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు.
ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రణాళికా సంఘం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశ అభివృద్ధికి అవసరమైన కార్యకమాలను ఈ ప్రణాళికా సంఘం రూపొందించింది.

డాక్టర్ జాన్ మత్తై

1950 -51లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రణాళికా సంఘం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశ అభివృద్ధికి అవసరమైన కార్యకమాలను ఈ ప్రణాళికా సంఘం రూపొందించింది.

Read More

1949-50

1949 -50లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేసింది. అయితే, ఇది తర్వాత 1956 - 57 బడ్జెట్ సమయంలో పునరుద్ధరించారు.

డాక్టర్ జాన్ మత్తై

1949 -50లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేసింది. అయితే, ఇది తర్వాత 1956 - 57 బడ్జెట్ సమయంలో పునరుద్ధరించారు.

Read More

1948-49

1948 - 49 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి సమర్పించారు.

ముఖ్యాంశం: 1948లో తొలిసారిగా ఆర్థిక మంత్రి ‘మధ్యంతర బడ్జెట్’ అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో తర్వాత ఇదే ఆనవాయితీగా.. మధ్యంతర బడ్జెట్ అనే ప్రక్రియ కొనసాగింది.

ఆర్.కే.షణ్ముఖం చెట్టి

1948 - 49 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి సమర్పించారు. ముఖ్యాంశం: 1948లో తొలిసారిగా ఆర్థిక మంత్రి ‘మధ్యంతర బడ్జెట్’ అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో తర్వాత ఇదే ఆనవాయితీగా.. మధ్యంతర బడ్జెట్ అనే ప్రక్రియ కొనసాగింది.

Read More

1947-48

1947 - 48లో భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 
ముఖ్యాంశం: బడ్జెట్ కింద రూ.197.39 కోట్లు కేటాయించగా.. ఇందులో దాదాపు రూ.92.74 కోట్లు అంటే సుమారు 46 శాతం రక్షణ సేవల కోసం కేటాయించబడింది.

ఆర్.కే.షణ్ముఖం చెట్టి

1947 - 48లో భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముఖ్యాంశం: బడ్జెట్ కింద రూ.197.39 కోట్లు కేటాయించగా.. ఇందులో దాదాపు రూ.92.74 కోట్లు అంటే సుమారు 46 శాతం రక్షణ సేవల కోసం కేటాయించబడింది.

Read More

Photo Gallery

Videos

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP Desam
Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP Desam
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Ravi Teja: రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
Eluru Railway Station: ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
Embed widget