అన్వేషించండి

Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాం- బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం!

Telangana Latest News: తెలంగాణ స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడిపించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. లేకుంటే ఆయనపై అవిశ్వాస తీర్మామనం పెడతామని హెచ్చరిస్తోంది.

Telangana Assembly Sessions: తెలంగాణలో స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని సూచిస్తోంది. లేకుంటే అవిశ్వాసం పెట్టేందుకు వెనుకాడబోమని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. 

ఉదయం నుంచి తెలంగాణ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. మొదట కాంగ్రెస్‌ నేతలు మాట్లాడిన తర్వాత బీఆర్‌ఎస్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ చర్చలో మాట్లాడిన జగదీష్‌ రెడ్డి కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. 

జగదీష్ రెడ్డి విమర్శలను తిప్పి కొట్టిన అధికార పక్షం అసలు విషయలపై మాట్లాడాలని సూచించారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఇంతలో స్పీకర్ మరోసారి జగదీష్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సభ మీది కాదని అందరిదీ అని అన్నారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని అనడంతో దుమారం రేగింది.  

జగదీష్ రెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్ మరోసారి మండిపడింది. స్పీకర్‌ను ఉద్దేశించి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. దళితులంటే గౌరవం లేదని అందుకే బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో కూర్చొందని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సహా   కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. స్పీకర్ను దూషించేలా జగదీష్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందని మండిపడ్డారు.  
ఇంతలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... కాంగ్రెస్‌ నేతల తీరును తప్పుపట్టారు. జగనదీష్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారని నిలదీశారు. సభలో అందరికీ సమానం హక్కులు ఉన్నాయని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. 

దీంతో కాంగ్రెస్ సభ్యులు మరింతగా ఫైర్ అయ్యారు. మొదటి నుంచి దళితులంటే బీఆర్‌ఎస్‌కు చిన్నచూపే అన్నారు. ఉద్యమం సమయంలో దళితుడే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అప్పటి నుంచి అడుగడుగునా దళితులను తొక్కే ప్రయత్నం చేశరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ సభ్యుల కామెంట్స్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నేతలు, వాళ్లకు వ్యతిరేకంగా అధికార పార్టీ లీడర్లు నినాదాలు చేసుకున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. 
వాయిదా తర్వాత మీడియా పాయింట్ వద్ద కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హరీష్‌రావు అవిశ్వాస తీర్మానం విషయం తెరపైకి తీసుకొచ్చారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడిపించకపోతే కచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. 

సభ వాయిదా పడిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు...స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదని మరోసారి స్పష్టం చేశారు. సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అన్నారని గుర్తు చేశారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని తెలిపారు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కానేకాదన్నారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదని ఎద్దేవా చేశారు. సభను ఎందుకు వాయిదా వేశారో కూడా అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై స్పీకర్‌ను కలిసి సభా రికార్డులు తీయాలని కోరామన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన సభ వీడియో రికార్డు అడిగామని తెలిపారు. ఆ వీడియోలు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద BRS ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget