Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Visakha Utsav: ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా విశాఖ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. టూరిజానికి ఈ ఉత్సవ్ బూస్ట్ ఇవ్వనుంది.

Visakha Utsav Arrangements: ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఏడాది విశాఖ ఉత్సవ్ ను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సాగరం నుంచి శిఖరం వరకు అనే ప్రత్యేక థీమ్తో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
ఈసారి ఉత్సవాలను కేవలం విశాఖ నగరానికే పరిమితం చేయకుండా, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కూడా విస్తరించడం విశేషం. మూడు జిల్లాల వ్యాప్తంగా మొత్తం 20 ప్రధాన వేదికలపై 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. విశాఖపట్నంలో ప్రారంభ వేడుకలు ఘనంగా మొదలై, ఫిబ్రవరి 1న అనకాపల్లిలో ముగింపు వేడుకలతో ఈ సంబరాలు ముగుస్తాయి. తీరప్రాంత పర్యాటకం నుంచి మన్యం ప్రాంతపు గిరిజన సంస్కృతి వరకు ప్రతి అంశాన్ని ఈ వేదికలపై ప్రదర్శించనున్నారు.
విశాఖపట్నం కలెక్టరేట్లో విశాఖ ఉత్సవ్ నిర్వహణపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నాను.
— Kandula Durgesh (@kanduladurgesh) January 20, 2026
ఈ సందర్భంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.… pic.twitter.com/RoA2t4Pl2h
ఈ మెగా ఈవెంట్ ద్వారా సుమారు రూ. 500 కోట్ల మేర ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, అలాగే సుమారు 3000 మంది స్థానిక కళాకారులు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆర్కే బీచ్తో పాటు రుషికొండ, సాగర్నగర్, భీమిలి బీచ్లలో డ్రోన్ షోలు, బీచ్ స్పోర్ట్స్, ఫ్లవర్ షో, మిస్ వైజాగ్ వంటి పోటీలు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. అరకు, లంబసింగి వంటి ప్రాంతాలలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, హస్తకళల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న 'విశాఖ ఉత్సవ్' కర్టెన్ రైజర్ కార్యక్రమంలో విశాఖపట్నం VMRDA చిల్డ్రన్ ఏరినాలో సహచర మంత్రివర్యులు శ్రీ @kanduladurgesh గారు, శ్రీ @Drswamydola గారు, శ్రీ @KolluROfficial గారు, శ్రీమతి @GSandhyarani_ గారు, ఎంపీ శ్రీ… pic.twitter.com/aTDHwJwu1U
— Anitha Vangalapudi (@Anitha_TDP) January 20, 2026
పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక వంటకాలు , చేనేత వస్త్రాలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.





















