అన్వేషించండి

Union Budget 2025: నిర్మలమ్మ నోట 'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' - మహాకవి గురజాడ కవిత వెనుక కథ ఇదే!

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ గేయం 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..' ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. దాని వెనుక కథ ఓసారి చూస్తే..

Nirmala Sitharaman Gurajada Quote In Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఎనిమిదోసారి పార్లమెంటులో బడ్జెట్‌ను (Union Budget 2025) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని మహాకవి గురజాడ సూక్తితో ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..' అంటూ తన ప్రసంగంలోని తొలి వాక్యాల్లో ప్రస్తావించారు. ఇది ఆసక్తికరంగా మారింది. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యం కలిగిన కార్మికులతో పూర్తి ఉపాధిని సాధించడం, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యాన్ని 70 శాతానికి పెంచడం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను ఎత్తిచూపేలా విత్త మంత్రి ప్రసంగం సాగింది. 

కవిత వెనుక కథ

కాగా, మహాకవి గురజాడ అప్పారావు 'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అంటూ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తన కోసం పరితపించారు. ఈ గేయం ప్రజల్లో దేశభక్తిని ప్రభోదించడమే కాకుండా దేశాభివృద్ధికై ప్రజలను కార్యోన్ముఖులను చేసింది. అంతేకాకుండా స్వదేశీ వాదనను బలపరిచారు. ఆయన కలం నుంచి జాలువారిన అనేక రచనలు దేశభక్తిని పెంపొందించేలా.. సాంఘిక దురాచారాలను రూపుమాపేలా, యువతకు ప్రేరణ ఇచ్చేలా ఉంటాయి. తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేక స్థానం. ప్రజలందరికీ అర్థమయ్యే జీవ భాషలో ఆయన రచలను ఎందరికో ఆదర్శం. 

అసలెవరీ గురజాడ అప్పారావు..

గురజాడ వెంకట అప్పారావు 1862, సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా రాయవరంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో రెవెన్యూ సూపర్వైజర్‌గా పని చేశారు. తండ్రి మరణం తర్వాత ఎం.ఆర్.కళాశాల ప్రధానోపాధ్యాయుడు సి.చంద్రశేఖర్ శాస్త్రి సహాయంతో చదువు కొనసాగించారు. 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, ఉన్నత విద్యను అభ్యసించి చివరకు ఎం.ఆర్.ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. విజయనగరం సంస్థానంలో శాసనసభ పరిశోధకుడిగా, మహారాజా కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1911లో మద్రాస్ విశ్వ విద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యుడయ్యారు. 1913లోపదవీ విరమణ చేశారు.

సాహిత్య సేవలో..

బాల్య వివాహం, వరకట్న వ్యవస్థ వంటి సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు గురజాడ తన సాహిత్యంతో కీలక పాత్ర పోషించారు. తెలుగు సాహిత్యానికే మూలస్తంభంగా నిలిచిన 'కన్యాశుల్కం' (1892) నాటకం ఆయన కలం నుంచి జాలువారిన ఆణిముత్యమే. నాటకంలోని సంభాషణలు, ముఖ్యంగా గిరీశం పాత్ర నేటికీ జనాధరణ పొందాయి. అప్పారావు రచనలు తరచుగా స్త్రీల పోరాటాలను ప్రస్తావిస్తూ, సామాజిక నిబంధనలను సవాలు చేస్తూ ఆధునిక తెలుగు నాటకానికి మార్గదర్శకుడిగా నిలిచాయి. ఆయన సంఘ సంస్కరణ కోసం బలమైన న్యాయవాది, ఆంధ్ర సాహిత్య పరిషత్ వంటి కార్యక్రమాల ద్వారా మాట్లాడే మాండలికాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు.

'ముత్యాల సరాలు' ద్వారా కొత్త సాహిత్య ధోరణిని గురజాడ ప్రవేశపెట్టారు. ఆయన రచనలు ప్రాంతీయ భాషల్లో విద్య ప్రాముఖ్యతను తెలియజేయడం సహా.. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడాన్ని విమర్శించాయి. ఆయన రచనల్లో మహిళా విద్య, సాధికారతను బలంగా వినిపించారు. 1915 నవంబర్ 30న గురజాడ కన్నుమూశారు. కవిశేఖర, అభ్యుదయ కవితా పితామహుడు బిరుదులతో సత్కరించబడిన గురుజాడ అప్పారావు వారసత్వం భారతీయ సాహిత్యం, సామాజిక ఆలోచనల్లో పరివర్తన చెందిన వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేస్తూ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.

Also Read: Union Budget 2025: మధ్య తరగతి, వేతన జీవులకు గుడ్ న్యూస్ - వ్యవ'సాయ'మే ప్రాధాన్యం, విత్త మంత్రి బడ్జెట్ పూర్తి వివరాలివే!

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget