అన్వేషించండి

KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

BRS stand on Governor Speech | తెలంగాణ అసెంబ్లీలో జరిగింది గవర్నర్ ప్రసంగం కాదని, గాంధీ భవన్‌లో రాసిచ్చే ప్రెస్ నోట్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ తో పాటు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారన్నారు.

 

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌ ప్రసంగంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్ పెద్ద మనిషిగా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆశపడిన బీఆర్ఎస్ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు నిరాశ చెందారని కేటీఆర్ అన్నారు. గవర్నర్ తన హోదా, స్థాయిని మరిచి ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. రాష్ట్రంలో రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణ మాఫీ చేయాలని, రైతులకు పంట బోనస్‌ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన, నిరసన మధ్యే గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది.

బీసీ కులగణనపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 56 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఎందుకు తగ్గిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి తెలంగాణ తల్లి అంటున్నారు. రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ లో పెట్టారు. మూడేళ్ల తరువాత మేం అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపిస్తాం’ అని కేటీఆర్ అన్నారు.  

ఇంతకీ గవర్నర్ స్పీచ్ లో ఏమన్నారంటే..

దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి తెలంగాణలో అవుతుందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులకు రూ. 500 పంట బోనస్‌ ఇస్తోందని, మహాలక్ష్మీ స్కీమ్‌ గేమ్ ఛేంజర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు. పేదింటి వారికి రూ. 500 కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని, ఇప్పటికే రూ. 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని గవర్నర్ జిష్ణదేవ్ వర్మ తెలిపారు.

కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డను నాశనం చేస్తున్నారు

అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగం కాదు, గాంధీభవన్ లో రాసే ప్రెస్ నోట్‌లా ఉంది. పెద్దాయన గవర్నర్ నోటి నుంచి ఎన్నో అబద్ధాలు చెప్పించారు. రాష్ట్రంలో 400కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలు ఎండిపోకుండా కాపాడం లాంటి బాధ్యతాయుత మాట ఒక్కటీ గవర్నర్ నోటి నుంచి రాలేదు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా 30, 35 శాతానికి మించి రుణమాఫీ జరగలేదు. రేవంత్ నియోజకవర్గం అయినా, మా నియోజకవర్గాలైనా ఓకే.. వెళ్లి లెక్కలు పరిశీలిద్దామని ఛాలెంజ్ చేస్తే ముందుకొచ్చే ధైర్యం చేయలేదు. తాగునీటి సంక్షోభం పెరిగినా, మేడిగడ్డను కేసీఆర్ మీద కక్షతో రిపేయిర్ చేపించకుండా ఎండేలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇస్తలేరని సెక్రటేరియట్ పై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు, సర్పంచులను వేధించి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి నోట్ల మూటలు పంపుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లలో 80 మంది వరకు పిల్లలు చనిపోతే ఎలాంటి చర్యలు చేపట్టని చేతకాని సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం’ అని కేటీఆర్ మండిపడ్డారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
AMB Classic Dolby: అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Chandigarh Blast: చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
IPL 2026 DC VS LSG Result Update: ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Indian Stock Market Rally: భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
Cabinet Committee Security Meeting: పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రధానమంత్రి మోదీ కీలక సమావేశం!
పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రధానమంత్రి మోదీ కీలక సమావేశం!
 Drum Brakes vs Disc Brakes: డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
 డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Embed widget