అన్వేషించండి

Budget 2025 : బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?

Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు హల్వా వేడుకతో బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ షురూ అయింది.

 Budget 2025 :  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు హల్వా వేడుకతో బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ షురూ అయింది. రానున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని అన్ని రంగాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 2025 బడ్జెట్ సమీపిస్తున్న సందర్భంగా భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగం వినియోగదారులకు ఈవీలను మరింత అందుబాటులో, సులభంగా అందించడానికి మరిన్ని చర్యలు, ప్రోత్సాహకాలు ప్రకటించబడాలని ఆశిస్తోంది. ఈ రంగం నేతలు, నిపుణులు, కేంద్రం ఈ బడ్జెట్ ద్వారా ఈవీ రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి, 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన విధానాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.

ఈవీలను ప్రోత్సహించాలి

స్టాటిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అక్షిత్ బన్సాల్ టియర్-2 నగరాల్లో ఈవీ విస్తరణ కోసం పటిష్టమైన మౌలిక సదుపాయాలు అవసరమని చెప్పారు. "ఈ మౌలిక సదుపాయాలు వినియోగదారులకు నమ్మకం కలిగించి, ఈవీలను ప్రోత్సహిస్తాయి" అని ఆయన అన్నారు. అలాగే, భారీ వాణిజ్య వాహనాలు మరింత పర్యావరణ సానుకూల ప్రత్యామ్నాయాలకు మార్పు కావాలని ఆయన సూచించారు. ట్రినిటీ టచ్ సంస్థ డైరెక్టర్ ఇషాన్ పర్వండా GST ను తగ్గించడం, చార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాలను పెంచడం వంటి చర్యలు అవసరం అన్నారు.    ఆత్మనిర్భర్ భారత్ ఉద్దేశ్యంతో, ప్రధాన ఈవీ భాగాల దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా అవసరం. దీనివల్ల ఈవీ వాహనాల ధరలు తగ్గిపోతాయి. భారతీయ వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకుని రావడం అనేది అత్యంత ముఖ్యమని ఇషాన్ పర్వండా చెప్పారు.

Also Read : Budget 2025: బడ్జెట్‌ బృందానికి ఎక్కువ జీతం ఇస్తారా! - లాక్‌డౌన్‌లో ఉన్నందుకు ఎలాంటి రివార్డ్‌లు లభిస్తాయి?

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

స్టాటిక్ సంస్థ సహ-వ్యవస్థాపకుడు,  సీటీఓ రఘవ్ అరోరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఉపయోగించి చార్జింగ్ నెట్‌వర్క్‌ను ఆప్టిమైజ్ చేయడం, బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరం అని పేర్కొన్నారు. "కొత్త టెక్నాలజీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు,  స్మార్ట్ మొబిలిటీ పరిష్కారాలు ఈవీ అనుభవాన్ని మెరుగుపరచడానికి అవసరం" అని ఆయన అన్నారు. ఈవీ రంగంలో సాంకేతిక పెట్టుబడులు, సరికొత్త ఆవిష్కరణలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, పర్యావరణ మార్పులు, వాణిజ్య వాహనాలు వంటి అంశాలపై కేంద్రం మరింత దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశాన్ని సుస్థిర మొబిలిటీ దిశగా ప్రగతి సాధించేందుకు 2025 బడ్జెట్ కీలకంగా మారుతుందని వారు అంటున్నారు.

సుస్థిర మొబిలిటీ దిశగా ఈవీ రంగం

ఈవీ రంగం సాంకేతిక అభివృద్ధి, వ్యవస్థాపిత మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలు అన్నింటికీ సంబంధించి ప్రారంభ పెట్టుబడులు తప్పనిసరిగా అవసరమైనవి. భారతదేశంలో సుస్థిర మొబిలిటీ దిశగా ఈవీ రంగం సంస్కరణలు, పెట్టుబడులతో మరింత పటిష్టంగా మారుతుంది.

Also Read : Budget 2025 Expectations: ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు స్పెషల్‌గా నిలుస్తుంది, కొత్త స్కీమ్‌లతో మీ మతిపోతుంది!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget