అన్వేషించండి

Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025 - పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులపై నిపుణుల అంచనాలు

Budget 2025 : పార్లమెంట్ లో బడ్జెట్ 2025 ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ శాఖలో ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలపై కేటాయింపులను నిపుణులు అంచనా వేస్తున్నారు.

Budget 2025 : 2025 -26 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే పలు రంగాలకు కేటాయింపులను నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25లో రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)కు రూ. 6,21,940.85 కోట్లు కేటాయించారు. ఇది మంత్రిత్వ శాఖలలోనే అత్యధికం. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయింపుల కంటే దాదాపు రూ. 1 లక్ష కోట్లు (18.43 శాతం) ఎక్కువ, 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 4.79 శాతం ఎక్కువ. ఈ సారి బడ్జెట్ లో ఏసింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ iDEX (ADITI) పథకం ద్వారా ఇన్నోవేషన్‌కు రూ. 400 కోట్లు కేటాయించారు. 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం సమీపిస్తున్నందున, ఇతర విషయాలతోపాటు పరిశోధన & అభివృద్ధి, సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ముందుకు

జియోపాలిటికల్ డైనమిక్స్‌ను భారతదేశం విజయవంతంగా మార్గనిర్దేశం చేస్తోందని కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ సుబ్బు వెంకటాచలం కొనియాడారు. 2025 డిఫెన్స్‌లో 'సంస్కరణల సంవత్సరం'గా మన ఆత్మనిర్భర్త ఆశయానికి మరింత దగ్గరవుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా మూలధన వ్యయంపై గణనీయంగా కేటాయింపులు ఉండడడం వినూత్న సాంకేతికతలను రంగంలోకి తీసుకువచ్చేందుకు, సైనిక ఆధునికీకరణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుందని వెంకటాచలం చెప్పారు. దేశీయ ఉత్పత్తికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. సైనిక వైఖరిని మరింత బలపర్చేందుకు దేశీయ ఉత్పత్తి సామర్థ్యం, ఆవిష్కరణ సామర్థ్యాలను విస్తరించడం చాలా కీలకమని, ఈ కేటాయింపులు విశ్వసనీయత, బాధ్యతను ప్రోత్సహిస్తుందన్నారు. "ప్రస్తుత కేటాయింపులు డిఫెన్స్‌పై స్టాండింగ్ కమిటీ 3 శాతం కంటే తక్కువగా ఉన్నందున, కీలకమైన ప్రాధాన్యతల కోసం ఖర్చును పెంచడానికి మాకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయి" అని చెప్పారు.

ఇది పరిశోధనతో పాటు డెవలప్‌మెంట్ లైఫ్‌సైకిల్‌ను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి, కొత్త వ్యూహాలను, ఆవిష్కరణలను ప్రోత్సాహాన్ని ఇస్తుందని వెంకటాచలం అభిప్రాయపడ్డారు. అగ్రశ్రేణి సంస్థలలో పరిశోధనా విభాగాలను అభివృద్ధి చేయడానికి, అనేక రకాల ఆన్-గ్రౌండ్ సవాళ్లను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. సైనికులతో పాటు వారి వాహనాలకు భద్రత, రక్షణ అత్యున్నత ప్రమాణాలను నిర్ధారిస్తుందన్నారు. ఇక డీఆర్డీవో ఛైర్మన్ ఇటీవల సూచించిన విధంగా ఆర్ అండ్ డీపై బడ్జెట్ వ్యయాలను ప్రస్తుత 5 శాతం నుండి 15 శాతానికి పెంచడం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని చెప్పారు. ఇది భారతదేశానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని, ముఖ్యంగా నెక్ట్స్ జనరేషన్ ఏరో ఇంజన్ సామర్థ్యాలను మరింత పెంచుతుందన్నారు.

మౌలిక సదుపాయాల ఖర్చును పెంచడం

ఇక రక్షణ రంగానికి కేటాయింపులపై ఇంద్రజల్ సీఈవో & సహ వ్యవస్థాపకుడు కిరణ్ రాజు మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల ఖర్చులను పెంచడంపై కేంద్రం దృష్టి పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం మన సాయుధ బలగాలను ఆధునీకరించడం, సరిహద్దు, తీర ప్రాంత భద్రతను పటిష్టం చేయడం, భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి భవిష్యత్ ను ఆశించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోందని, ఇది పురోగతి దశను సూచిస్తుందన్నారు. ఈ కేటాయింపులు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయన్నారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే డ్రోన్ వినియోగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినప్పటికీ, అధిక మొత్తంలో డ్రోన్‌లకు మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు ఇప్పటికీ లేవన్నారు. డ్రోన్ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు, స్వదేశీ డ్రోన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని మరింత స్వావలంబన, సురక్షితమైన దేశంగా మార్చేందుకు బడ్జెట్ 2025 ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని చెప్పారు.

Also Read : Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget