బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, పదవుల కోసమో, డబ్బుల కోసమో కాదని ఆయన స్పష్టం చేశారు.
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Banswada MLA Pocharam Srinivas Reddy | పదవుల కోసం కాదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని, కానీ కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

- పోచారం నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ మారగా, సగం నిధులే విడుదలయ్యాయి.
- నిధుల జాప్యంపై సీఎంను ప్రశ్నించగా, మంత్రుల స్పందన లేదని ఆవేదన.
- కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అన్నారు.
Banswada Politics | బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై, పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదని, కేవలం బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ జెండా కాదు.. జాతీయ జెండా కప్పుకున్నాను
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేకపోయినా, బాన్సువాడ నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని, కాంగ్రెస్ జెండాను కాదని వ్యాఖ్యానించారు. బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న బిల్లులను 6 నెలల్లో మంజూరు చేస్తామని తనకు హామీ ఇచ్చారని, కానీ కండువా కప్పుకున్న తర్వాత కేవలం సగం నిధులు మాత్రమే విడుదల చేశారని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు నిలిచిపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపివేశారని తెలిపారు.
నవంబరులో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహించిన సందర్భంగా ‘నేను నీకు అమ్ముడుపోయానా? లేక ఎమ్మెల్యేగిరిని కొన్నావా?’ అని రేవంత్ రెడ్డిని సూటిగా అడిగినట్లు పోచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ నిధులు మంజూరు కావడం లేదని ఆయన విమర్శించారు.
Also Read: KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
కనీసం ఫోన్ ఎత్తడం లేదు
కనీసం నిధుల విషయమై మాట్లాడదామని ఫోన్ చేస్తే మంత్రులు గానీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గానీ స్పందించడం లేదని, ఫోన్ ఎత్తడం లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి జరిగిందని, తనకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ మరచిపోలేనని స్పష్టం చేశారు. కొంతమంది దౌర్భాగ్యుల వల్ల కలిగిన పరిస్థితులతోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో మళ్లీ తమదే విజయమని.. తనకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందంటూ పోచారం ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని, తమ జెండా ఎగురుతుందని పోచారం అనడంతో కార్యకర్తలు జై పోచారం అంటూ హుషారుగా నినాదాలు చేశారు.
Frequently Asked Questions
పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఎందుకు మారారు?
నియోజకవర్గ నిధుల గురించి పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమి హామీ ఇచ్చారు?
బాన్సువాడలో పెండింగ్లో ఉన్న బిల్లులను 6 నెలల్లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, పార్టీ మారిన తర్వాత సగం నిధులు మాత్రమే విడుదలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నిధుల విషయమై పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి ఏమిటి?
ముఖ్యమంత్రితో సహా మంత్రులకు విజ్ఞప్తి చేసినా నిధులు మంజూరు కావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















