అన్వేషించండి

Andhra Pradesh Budget 2025: పల్లెలకు ప్రగతి వెలుగులు ఇచ్చి అభివృద్ధి దారులు వేస్తున్నాం: బడ్జెట్‌లో కేశవ్

Andhra Pradesh Budget 2025: పల్లెలను శక్తిసంపన్నగా చేసి ఆదర్శవంత తీర్చి దిద్దే చర్యలు తీసుకుంటున్నామని బడ్జెట్‌లో పయ్యావుల కేశవ్ తెలిపారు. జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతున్నట్టు వెల్లడించారు .

Andhra Pradesh Budget 2025: గ్రామాలు శక్తి సంవన్నమై స్వయం సమృద్ధి సాధికారతలతో తులతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుందన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ కామెంట్స్‌ను గుర్తు చేసుకున్న పయ్యావుల... గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజల హక్కు అయిన రహదారులు, తాగునీరు వంటి కనీస అవసరాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శించారు. స్థానిక సంస్థల నిధులను పక్క దారి పట్టించడంతో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని వాపోయారు. ఉపముఖ్యమంత్రి వవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగువరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో సమగ్ర గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు తదితర 30 వేల పనులను మంజూరు చేసినట్టు వెల్లడించారు.  

"4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సి.సి. రోడ్లలో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తయ్యాయి. మరో 1,300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయి. వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరిగింది." అని పయ్యావుల తెలిపారు.  

గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్.ఇ.డి. వీధి దీపాల కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు పయ్యావుల. 150 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించి కార్యక్రమాన్ని పునరుద్దరించినట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఆగస్టు 15, 2019లో ప్రారంభించినప్పటి నుంచి 2024-25 వరకు 13,499 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం 2,255 కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించుకోగలిగారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు 2023-24 సంవత్సరానికి కేంద్రం నుంచి ఏపీ కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుందని తమ అభ్యర్ధన మేరకు ఈ పథకం గడువును 2028 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దీనిలో భాగంగా 95.44 లక్షల గ్రామీణ గృహాలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.  

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 45.30 లక్షల కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు పయ్యావుల. రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు చేపట్టా పరిశుభ్రమైన, ఆదర్శ గ్రామాలుగా తయారు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వనతులు, రోడ్ల నిర్మాణం విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఎక్కడ చూసినా.. గుంతలమయమైన రోడ్లే ఉండేవన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పి.ఎం.జి.ఎన్.వై.), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు, జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) నిధుల కింద రోడ్లు అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించమన్నారు. అన్ని వాతావరణ వరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించే దిశగా పి.ఎం.జన్ మన్ వథకం రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.  అన్నింటికీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయల కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Embed widget