అన్వేషించండి

Andhra Pradesh Budget 2025: పల్లెలకు ప్రగతి వెలుగులు ఇచ్చి అభివృద్ధి దారులు వేస్తున్నాం: బడ్జెట్‌లో కేశవ్

Andhra Pradesh Budget 2025: పల్లెలను శక్తిసంపన్నగా చేసి ఆదర్శవంత తీర్చి దిద్దే చర్యలు తీసుకుంటున్నామని బడ్జెట్‌లో పయ్యావుల కేశవ్ తెలిపారు. జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతున్నట్టు వెల్లడించారు .

Andhra Pradesh Budget 2025: గ్రామాలు శక్తి సంవన్నమై స్వయం సమృద్ధి సాధికారతలతో తులతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుందన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ కామెంట్స్‌ను గుర్తు చేసుకున్న పయ్యావుల... గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజల హక్కు అయిన రహదారులు, తాగునీరు వంటి కనీస అవసరాలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శించారు. స్థానిక సంస్థల నిధులను పక్క దారి పట్టించడంతో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని వాపోయారు. ఉపముఖ్యమంత్రి వవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగువరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో సమగ్ర గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు తదితర 30 వేల పనులను మంజూరు చేసినట్టు వెల్లడించారు.  

"4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సి.సి. రోడ్లలో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తయ్యాయి. మరో 1,300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయి. వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరిగింది." అని పయ్యావుల తెలిపారు.  

గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్.ఇ.డి. వీధి దీపాల కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు పయ్యావుల. 150 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించి కార్యక్రమాన్ని పునరుద్దరించినట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఆగస్టు 15, 2019లో ప్రారంభించినప్పటి నుంచి 2024-25 వరకు 13,499 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం 2,255 కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించుకోగలిగారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు 2023-24 సంవత్సరానికి కేంద్రం నుంచి ఏపీ కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుందని తమ అభ్యర్ధన మేరకు ఈ పథకం గడువును 2028 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దీనిలో భాగంగా 95.44 లక్షల గ్రామీణ గృహాలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.  

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 45.30 లక్షల కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు పయ్యావుల. రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు చేపట్టా పరిశుభ్రమైన, ఆదర్శ గ్రామాలుగా తయారు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వనతులు, రోడ్ల నిర్మాణం విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఎక్కడ చూసినా.. గుంతలమయమైన రోడ్లే ఉండేవన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పి.ఎం.జి.ఎన్.వై.), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు, జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) నిధుల కింద రోడ్లు అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించమన్నారు. అన్ని వాతావరణ వరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించే దిశగా పి.ఎం.జన్ మన్ వథకం రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.  అన్నింటికీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయల కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.  

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget