అన్వేషించండి

Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం

Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం.

India Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం. ఈ పెరుగుదల దేశీయ స్థూల ఉత్పత్తి (GDP) వృద్ధి రేటుతో సమానంగా ఉండడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP అంచనా రూ. 356.97 లక్షల కోట్లుగా ఉండగా, ప్రభుత్వ  మూల ధన వ్యయం మొత్తం GDPలో 3.14 శాతంగా ఉంటుంది.

Also Read :Income Tax: 8 నుంచి 50 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగులకు ఎంత పన్ను ఆదా అవుతుందో ఇక్కడ చూడండి

రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాలకు అధిక కేటాయింపు
సాంప్రదాయంగా కొనసాగిన విధంగానే, ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాల కోసం భారీగా నిధులు కేటాయించారు. ప్రభుత్వం మూల ధన వ్యయంలో సుమారు 55 శాతం రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాలపై ఖర్చు చేయనుంది. రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు, రోడ్డు రవాణా శాఖకు రూ. 1.87 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ. 1.8 లక్షల కోట్లు కేటాయించబడింది. ఈ మూడు రంగాలు కలిపి మొత్తం మూల ధన వ్యయంలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.ప్రభుత్వం మొత్తం వ్యయంలో ప్రతి రూ. 100కు సుమారు రూ. 22 మూల ధర వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 సవరణ అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువ. అదేవిధంగా, ప్రభుత్వ రంగ యూనిట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో ప్లాన్ చేసిన పెట్టుబడుల కంటే 13 శాతం అధికం. ఈ విధంగా, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెరగడం ద్వారా దేశంలోని మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, దీంతో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Also Read : New Income Tax Slabs 2025: ఆదాయ పన్ను మినహాయింపు.. ఆదాయం 12 లక్షలు దాటినా కానీ అద్భుతమైన ప్రయోజనమే!

ఈ విధంగా కేటాయింపులు
* రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు
* రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలకు రూ. 1.87 లక్షల కోట్లు
* రక్షణ పరికరాల కోసం రూ. 1.8 లక్షల కోట్లు
రోడ్లు, రైల్వేలకు ఖర్చు చేయబోయే మొత్తం వ్యయం ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల సబ్సిడీల కంటే అధికంగా ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల్లో పెరుగుదల
ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) 2025-26లో రూ. 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇది FY25లో కంటే 13 శాతం అధికం.

Also Read : Budget 2025 Key Announcements : గంటా ఇరవై నిమిషాల నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగాన్ని కేవలం పది పాయింట్లలో చూసేయండి

ప్రభుత్వ వ్యయంలో కీలక మార్పులు
FY26లో మొత్తం ప్రభుత్వం ఖర్చు చేయబోయే ప్రతి రూ. 100కు సుమారు రూ. 22  మూల ధన వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ. ఈ భారీ పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయని, దీని ప్రభావం ఆర్థిక వృద్ధిపై కూడా అనుకూలంగా ఉండొచ్చని అంచనా.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget