అన్వేషించండి

Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం

Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం.

India Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం. ఈ పెరుగుదల దేశీయ స్థూల ఉత్పత్తి (GDP) వృద్ధి రేటుతో సమానంగా ఉండడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP అంచనా రూ. 356.97 లక్షల కోట్లుగా ఉండగా, ప్రభుత్వ  మూల ధన వ్యయం మొత్తం GDPలో 3.14 శాతంగా ఉంటుంది.

Also Read :Income Tax: 8 నుంచి 50 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగులకు ఎంత పన్ను ఆదా అవుతుందో ఇక్కడ చూడండి

రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాలకు అధిక కేటాయింపు
సాంప్రదాయంగా కొనసాగిన విధంగానే, ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాల కోసం భారీగా నిధులు కేటాయించారు. ప్రభుత్వం మూల ధన వ్యయంలో సుమారు 55 శాతం రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాలపై ఖర్చు చేయనుంది. రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు, రోడ్డు రవాణా శాఖకు రూ. 1.87 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ. 1.8 లక్షల కోట్లు కేటాయించబడింది. ఈ మూడు రంగాలు కలిపి మొత్తం మూల ధన వ్యయంలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.ప్రభుత్వం మొత్తం వ్యయంలో ప్రతి రూ. 100కు సుమారు రూ. 22 మూల ధర వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 సవరణ అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువ. అదేవిధంగా, ప్రభుత్వ రంగ యూనిట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో ప్లాన్ చేసిన పెట్టుబడుల కంటే 13 శాతం అధికం. ఈ విధంగా, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెరగడం ద్వారా దేశంలోని మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, దీంతో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Also Read : New Income Tax Slabs 2025: ఆదాయ పన్ను మినహాయింపు.. ఆదాయం 12 లక్షలు దాటినా కానీ అద్భుతమైన ప్రయోజనమే!

ఈ విధంగా కేటాయింపులు
* రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు
* రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలకు రూ. 1.87 లక్షల కోట్లు
* రక్షణ పరికరాల కోసం రూ. 1.8 లక్షల కోట్లు
రోడ్లు, రైల్వేలకు ఖర్చు చేయబోయే మొత్తం వ్యయం ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల సబ్సిడీల కంటే అధికంగా ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల్లో పెరుగుదల
ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) 2025-26లో రూ. 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇది FY25లో కంటే 13 శాతం అధికం.

Also Read : Budget 2025 Key Announcements : గంటా ఇరవై నిమిషాల నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగాన్ని కేవలం పది పాయింట్లలో చూసేయండి

ప్రభుత్వ వ్యయంలో కీలక మార్పులు
FY26లో మొత్తం ప్రభుత్వం ఖర్చు చేయబోయే ప్రతి రూ. 100కు సుమారు రూ. 22  మూల ధన వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ. ఈ భారీ పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయని, దీని ప్రభావం ఆర్థిక వృద్ధిపై కూడా అనుకూలంగా ఉండొచ్చని అంచనా.

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget