అన్వేషించండి

Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం

Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం.

India Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం. ఈ పెరుగుదల దేశీయ స్థూల ఉత్పత్తి (GDP) వృద్ధి రేటుతో సమానంగా ఉండడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP అంచనా రూ. 356.97 లక్షల కోట్లుగా ఉండగా, ప్రభుత్వ  మూల ధన వ్యయం మొత్తం GDPలో 3.14 శాతంగా ఉంటుంది.

Also Read :Income Tax: 8 నుంచి 50 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగులకు ఎంత పన్ను ఆదా అవుతుందో ఇక్కడ చూడండి

రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాలకు అధిక కేటాయింపు
సాంప్రదాయంగా కొనసాగిన విధంగానే, ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాల కోసం భారీగా నిధులు కేటాయించారు. ప్రభుత్వం మూల ధన వ్యయంలో సుమారు 55 శాతం రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాలపై ఖర్చు చేయనుంది. రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు, రోడ్డు రవాణా శాఖకు రూ. 1.87 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ. 1.8 లక్షల కోట్లు కేటాయించబడింది. ఈ మూడు రంగాలు కలిపి మొత్తం మూల ధన వ్యయంలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.ప్రభుత్వం మొత్తం వ్యయంలో ప్రతి రూ. 100కు సుమారు రూ. 22 మూల ధర వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 సవరణ అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువ. అదేవిధంగా, ప్రభుత్వ రంగ యూనిట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో ప్లాన్ చేసిన పెట్టుబడుల కంటే 13 శాతం అధికం. ఈ విధంగా, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెరగడం ద్వారా దేశంలోని మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, దీంతో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Also Read : New Income Tax Slabs 2025: ఆదాయ పన్ను మినహాయింపు.. ఆదాయం 12 లక్షలు దాటినా కానీ అద్భుతమైన ప్రయోజనమే!

ఈ విధంగా కేటాయింపులు
* రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు
* రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలకు రూ. 1.87 లక్షల కోట్లు
* రక్షణ పరికరాల కోసం రూ. 1.8 లక్షల కోట్లు
రోడ్లు, రైల్వేలకు ఖర్చు చేయబోయే మొత్తం వ్యయం ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల సబ్సిడీల కంటే అధికంగా ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల్లో పెరుగుదల
ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) 2025-26లో రూ. 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇది FY25లో కంటే 13 శాతం అధికం.

Also Read : Budget 2025 Key Announcements : గంటా ఇరవై నిమిషాల నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగాన్ని కేవలం పది పాయింట్లలో చూసేయండి

ప్రభుత్వ వ్యయంలో కీలక మార్పులు
FY26లో మొత్తం ప్రభుత్వం ఖర్చు చేయబోయే ప్రతి రూ. 100కు సుమారు రూ. 22  మూల ధన వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ. ఈ భారీ పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయని, దీని ప్రభావం ఆర్థిక వృద్ధిపై కూడా అనుకూలంగా ఉండొచ్చని అంచనా.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
Construction Ban: నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం-ఇందులో నిజమెంత?
నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం - ఇందులో నిజమెంత?
Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
Pagani Hypercars: డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!
డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget