అన్వేషించండి
Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మణికా బృందం, టేబుల్ టెన్నిస్లో తొలిసారి క్వార్టర్స్కు
Olympic Games Paris 2024: ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్కి చేరింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్లో క్వార్టర్స్ చేరిన తొలి మహిళల జట్టుగా చరిత్ర లిఖించింది.

చరిత్ర సృష్టించిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు
1/9

పారిస్ ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్కి దూసుకెళ్లింది.
2/9

16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించిన మనిక బాత్రా బృందం... విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్లో క్వార్టర్స్ చేరిన తొలి మహిళల జట్టుగా కొత్త చరిత్ర లిఖించింది.
3/9

మణిక బాత్రా, ఆకుల శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ అయిన టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయ దుంధుభి మోగించింది.
4/9

తెలుగు తేజం ఆకుల శ్రీజ-అర్చన జోడీ రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించింది.
5/9

తర్వాతి మ్యాచ్లో మణికా బాత్రా... బెర్నాడెట్ను 3-0తో సునాయసంగా చిత్తు చేసింది. 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్పై మణికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
6/9

దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఎలిజబెత్ సమారాతో జరిగిన మూడో మ్యాచ్లో చివరి వరకూ పోరాడినా శ్రీజ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో శ్రీజ ఓడిపోయినా రొమేనియాపై భారత్ 2-1తో ఆధిక్యంలోనే నిలిచింది.
7/9

బెర్నాడెట్తో జరిగిన నాలుగో మ్యాచ్లో అర్చన కామత్ ఓడిపోవడంతో భారత్, రొమేనియా పోరు 2-2తో సమమైంది.
8/9

చివరి మ్యాచ్లో మనిక గెలవడంతో 3-2తో చరిత్ర సృష్టించింది.
9/9

క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు.. అమెరికా లేదా జర్మనీ మధ్య జరిగే పోరులో విజేతతో తలపడనుంది.
Published at : 05 Aug 2024 05:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion