Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Puri Jagannadh: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబో మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్ జూన్లో ప్రారంభం కానుందని.. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ అందిస్తామని పూరీ కనెక్ట్స్ సంస్థ తెలిపింది.

Puri Jagannadh Vijay Sethupathi Combo Movie Official Announcement: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కొత్త మూవీపై ఇటీవల వచ్చిన రూమర్స్ నిజం చేస్తూ ప్రకటన వచ్చేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కించనున్నట్లు పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది.
అప్పుడే షూటింగ్ ప్రారంభం
ఉగాది సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ప్రకటన ఇస్తూ.. సోషల్ మీడియా వేదికగా పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి, ఛార్మి ఉన్న ఫోటోను సంస్థ షేర్ చేసింది. పాన్ ఇండియా మూవీ షూటింగ్ జూన్లో ప్రారంభం కానున్నట్లు తెలిపింది. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ ఇస్తామని వెల్లడించింది.
On this auspicious day of #Ugadi ✨🙏🏻
— Puri Connects (@PuriConnects) March 30, 2025
Embarking on an electrifying new chapter with a sensational collaboration 🔥
Dashing Director #PuriJagannadh and powerhouse performer, Makkalselvan @VijaySethuOffl join forces for a MASTERPIECE IN ALL INDIAN LANGUAGES ❤️🔥
Produced by Puri… pic.twitter.com/Hvv4gr0T2Z
సింగిల్ సిట్టింగ్లోనే ఓకే..
ఇటీవల విజయ్ సేతుపతిని కలిసిన పూరీ జగన్నాథ్ ఆయనకు ఓ కథ వినిపించారని.. ఈ స్టోరీకి ఆయన సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చెప్పేశారనే రూమర్స్ వినిపించాయి. తాను చేస్తున్న సినిమాల్ని సైతం పక్కన పెట్టి కాల్ షీట్స్ ఇచ్చేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇవన్నీ నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. జూన్లోనే ఈ మూవీ పట్టాలెక్కనుండగా.. ఎవరూ ఊహించని విధంగా స్టోరీ ఉండబోతుందనే టాక్ నడుస్తోంది. అందుకే విజయ్ సేతుపతి సైతం వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం.
ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ రోల్స్లో నటించి మెప్పించారు. ఇటీవలే 'మహారాజా'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా చివరిగా 'విడుదల పార్ట్ 2'లోనూ తన నటనతో మెప్పించారు. ఉప్పెన తర్వాత ఆయనతో మూవీ చేసేందుకు చాలామంది టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రయత్నించినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక పూరీ మూవీ ఓకె చెప్పడంతో భారీ హైప్ నెలకొంది.
మళ్లీ ట్రాక్ ఎక్కేనా..
ఒకప్పుడు పూరీ జగన్నాథ్ మాస్ డైరెక్టర్గా టాలీవుడ్ టాప్ హీరోలతో మూవీస్ చేసి భారీ హిట్స్ అందించారు. మహేష్ బాబుతో పోకిరి, ఎన్టీఆర్తో టెంపర్ ఇలా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఆ తర్వాత ఆయన ట్రెండ్కు కాస్త బ్రేక్ పడింది. వరుస అపజయాల అనంతరం 2019లో 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మళ్లీ హిట్ అందుకున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్, రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. కింగ్ నాగార్జునతో, గోపీచంద్ గోలీమార్ సీక్వెల్ ప్రచారం జరిగినా.. అవి పట్టాలెక్కలేదు. ఇప్పుడు విజయ్తో మూవీ స్టార్ట్ కాబోతుండడంతో మళ్లీ పూరీ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.





















