అన్వేషించండి

SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు

SLBC Tunnel Rescue Operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీసి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

SLBC Tunnel News Updates | నాగర్‌కర్నూల్:  శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. సహాయక చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం మృతదేహం ఆనవాళ్లను రెస్క్యూ టీమ్ గుర్తించింది. మధ్యాహ్నానికి మట్టిని తొలగించి మృతదేహాన్ని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం అధికారుల అనుమతితో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని అంబులెన్సులో తరలించారు. 

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో మొత్తం 8 మంది చిక్కుకోగా, మూడు వారాల కిందట టన్నెల్ బోరింగ్ మేషిన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. అప్పటినుంచి సహాయక చర్యలు కొనసాగించగా.. నేడు రెండో మృతదేహం ఆనవాళ్లు గుర్తించి రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి మరో మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుసత్రికి తరలించారు. మరో ఆరుగురి మృతదేహాలు వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో  మృతదేహం లభ్యమైంది. మినీ హిటాచి తో మట్టి తవ్వుతుండగా మృతదేహం ఆనవాళ్లు కనిపించగా కొన్ని గంటలపాటు శ్రమించి టీమ్ వెలికితీసింది.


SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఉద్దేశం ఏంటీ..

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 లక్షల 20 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ప్రాజెక్టును 2005లో ప్రారంభించారు. అప్పటినుంచి ప్రభుత్వాలు మారుతున్నా, పనులలో పురోగతి లభించింది. శ్రీశైలం, దేవరకొండల నుంచి రెండువైపులా టన్నెల్ బోరింగ్ మేషిన్లతో 44 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ మార్గాన్ని తవ్వుకుంటూ వస్తున్నారు. కానీ సున్నితమైన ప్రాంతం, నీళ్లు రావడం, బురద ఏర్పుడుతండటంతో తవ్వకాలకు పలుమార్లు ఆటంకాలు తలెత్తడంతో రెండు దశాబ్దాలు కావొస్తున్నా టన్నెల్ పనులు పూర్తి కాలేదు. ఇప్పటివరకు దేవరకొండ వైపు నుంచి 23.51 కిలోమీటర్లు పూర్తికాగా, అటు శ్రీశైలం జలాశయం నుంచి 13.95 కిలోమీటర్లు టన్నెల్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 9.5 కిలోమీటర్ల దూరం సొరంగాన్ని పూర్తి చేసి సాగునీరు, తాగునీరు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అసలేం జరిగిందంటే..

ఫిబ్రవరి 18న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు మళ్లీ చేపట్టగా, శ్రీశైలం వైపు నుంచి 14వ కిలోమీటరు వద్ద సొరంగం లోపల పైకప్పు కూలడంతో ఈ మార్గం మూసుకుపోయి లోపల 8 మంది చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ సమయలో టన్నెల్ లో 50 మంది వరకు ఉండగా, టీబీఎంకు వేరే వైపున ఉన్నవారు రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. అక్కడి నుంచి లోక్ ట్రైన్‌లో ప్రయాణించి సొరంగం నుంచి బయటకు వచ్చేశారు. సొరంగంలో జరిగిన ప్రమాదంపై అధికారులకు సమాచారం అందించారు. ఆరోజు నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజులు దాటినా కేవలం ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా, మరో ఆరుగురి ఆచూకీ మార్చి 25 మధ్యాహ్నం నాటికి లభ్యం కాలేదు.

ఈ మార్గంలో టన్నెల్‌ బోర్‌ మేషిన్ బిగించడం, తవ్వకాలు చేపట్టడం సాధ్యం కాదని నిపుణులు ఇదివరకే తేల్చేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా బైపాస్‌ సొరంగం నిర్మాణంపై ఫోకస్ చేసింది. భూగర్భ పొరల్లో ఉన్న పరిస్థితితో అక్కడి నుంచి ముందుకు వెళ్లడం సాధ్యం కాదని.. తవ్వకం నిలిచిన ప్రాంతాన్ని మూసివేయనున్నారు. దానికి సమీపంలో వెనకకు వచ్చి బైపాస్‌ మార్గాన్ని తవ్వాలని భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget