Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
T20 World Cup 2026లో నాకౌట్స్ స్టేజ్ వరకూ భారత్ ఎలాగోలా వచ్చేసింది. ప్రతీ మ్యాచ్ లోనూ ఎవరో ఒకరు తమ అద్భుతమైన ప్రదర్శనతో భారత్ కు విజయాలను అందిస్తూ వచ్చారు. కానీ కీలక దశ అంటే నాకౌట్ స్టేజ్ వచ్చేసరికి భారత్ ను ఆదుకుంటోంది ఒక్కడే. తన పేరు సంజూ శాంసన్. సూపర్ 8 దశ దాటి సెమీస్ ఆడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ గా మారిపోయిన వెస్టిండీస్ పై అద్భుతమైన ఛేజింగ్ తో 97 పరుగులు చేసి భారత్ ను ఒంటిచేత్తో సెమీస్ కు తీసుకువచ్చిన సంజూ...నిన్న సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ పై అదే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. 42 బాల్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 రన్స్ బాదాడు. అభిషేక్ అవుటైపోయినా...ఇషాన్ కిషన్...శివమ్ దూబే తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించిన సంజూ...13 ఓవర్లలోనే భారత్ స్కోరు 160 పరుగులు చేసేలా దుమ్మురేపాడు. టీమ్ స్కోర్ 253 పరుగులు వచ్చిందంటే..సంజూ శాంసన్ ఆడిన ఆ ఫియర్ లెస్ ఇన్నింగ్సే రీజన్. అలా అని ఏ షాట్ కూడా ఏదో బ్లైండ్ గా వచ్చింది కాదు. ప్రతీ ది ఫర్ ఫెక్ట్ టైమింగ్ తో కళాత్మక విధ్వంసంలా సాగింది శాంసన్ ఇన్నింగ్స్. ప్రతీ బౌలర్ ను ఎంచుకుని మరీ ఆడాడు. వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ రెండు ఇన్నింగ్స్ లోనూ సంజూ సెంచరీలు కొట్టలేకపోయినా.. ఈ రెండు ఇన్నింగ్స్ లు సెంచరీల కంటే ఎక్కువ. భారత్ దృష్టిలో ఈ వరల్డ్ కప్ టీమిండియా ముద్దాడింది అంటే...ఓ యువరాజ్, ఓ గంభీర్, ఓ కోహ్లీ తరహాలో సంజూ శాంసన్ పేరు కూడా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు



















