అన్వేషించండి

Wayanad Landslides: భయమే వాళ్లను కాపాడింది, తృటిలో చావు నుంచి తప్పించుకున్న కుటుంబం

Wayanad: వయనాడ్‌ విపత్తు నుంచి తప్పించుకున్న బాధితులు ఆ సమయంలో ఏం జరిగిందో వివరిస్తున్నారు. కొంత మంది భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.

Wayanad Tragedy: వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడిన ఘటనలు (Wayanad Landslides) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పలు చోట్ల ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు వెయ్యి మందిని రెస్క్యూ టీమ్స్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే...ఈ విపత్తు నుంచి తప్పించుకున్న వాళ్లు మాత్రం ఆ క్షణాలను తలుచుకుని భయపడిపోతున్నారు. తృటిలో చావు నుంచి తప్పించుకున్నామని చెబుతున్నారు. అయితే...ఓ కుటుంబాన్ని మాత్రం వాళ్ల భయమే కాపాడింది. ముందక్కైలో ఉంటున్న షకీరా భారీ వర్షాలు మొదలైనప్పటి నుంచి విపరీతంగా భయపడుతోంది. ఏదైనా జరిగిపోతుందేమోనని అనుమానంతో ఆమెకి నిద్ర పట్టలేదు. వెంటనే ఇంట్లో వాళ్లను అలెర్ట్ చేసింది. మెప్పడిలోని తల్లిగారింటికి వెళ్లిపోదామని చెప్పింది. కానీ అందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు. తరవాత ఎలాగోలా అంగీకరించాడు. వెంటనే కుటుంబ సభ్యులంతా ఆ ఇంటిని విడిచిపెట్టి మెప్పడికి వెళ్లారు. కొద్ది గంటల తరవాత అక్కడ కొండ చరియలు విరిగిపడి ఇళ్లన్నీ ధ్వంసమైపోయాయి. తన భయమే కుటుంబాన్ని కాపాడిందని ఆ మహిళ వివరించింది. 

"దాదాపు రెండు రోజులుగా ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. అప్పటి నుంచి నా భార్య భయపడుతోంది. ఏం జరుగుంతో అని టెన్షన్ పడింది. ఏమీ జరగదు అని నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. వెంటనే అంతా కలిసి అక్కడి నుంచి వచ్చేశాం. కొద్ది సేపటికే అక్కడ విపత్తు ముంచుకొచ్చింది. నా ఇల్లంతా శిథిలమైపోయింది. చుట్టు పక్కల ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి"

- బాధితుడు 

మందక్కైకి కిలోమీటర్ దూరంలో ఉన్న వెల్లడిపర వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయని...ఇక్కడి వరకూ ఆ ప్రభావం ఉంటుందని అసలు ఊహించలేదని బాధితులు చెబుతున్నారు. కొంత మంది వెళ్లిపోదాం అని చెప్పినా వినకుండా అక్కడే ఉండిపోయి ఈ ముప్పునకు బలి అయ్యారని అంటున్నారు. లక్షలు పోసి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేంద్రమంత్రి జార్జ్ కురియన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రిలీఫ్ క్యాంప్‌లలోని బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలను పరిశీలించారు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

 

Also Read: Wayanad Landslide: అర్ధరాత్రి ఇల్లంతా ఒక్కసారిగా ఊగిపోయింది, సాయం కోసం కేకలు వేశాను - వయనాడ్ బాధితురాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget