అన్వేషించండి

Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Telangana News | తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పారిపోతోందని, అందులో భాగంగానే ప్రశ్నోత్తరాలను ఎత్తివేశారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly Sessions | అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు కీలకమైన ప్రశ్నలు ఉన్నాయని సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకుంది. దీనిపైన స్పీకర్‌కు, కార్యదర్శికి అభ్యంతరం చెప్పామన్నారు. తెలంగాణ ప్రభుత్వం HMDA భూములు తాకట్టు పెట్టి 20 వేల కోట్లు అప్పు తెస్తుంది. TGIIC 10 వేల కోట్లు, HMDA ఆస్తులు కుదబెట్టి 20 వేల కోట్లు,  HMWS 10 వేల కోట్లు, GHMC ఆస్తులను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు అప్పులు.. మొత్తం 50 వేల కోట్లను అప్పు చేస్తుంది. 

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, వెబ్‌సైట్లో జీవోలు కూడా లేవు

బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. సభ్యుల హక్కులను స్పీకర్ కాపాడాలి. జీవోలను సైతం వెబ్‌సైట్‌లో పెట్టడం లేదు. ఆంధ్ర జలదోపిడి కారణంగా మహబూబ్ నగర్, నల్లగొండలో పంటలు ఎండిపోతున్నాయి. రైతు భరోసా వానకాలం వేశారా లేదా అని ప్రశ్న వేస్తే దానిని రద్దు చేశారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చెయ్యకపోవడం వల్ల తక్కువ ధరకు రైతులు పంటలు అమ్ముకొని నష్టపోయారు.

బీఆర్ఎస్ హయంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ప్రస్తుత ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. మేం 54 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వరి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామన్నారు. కొన్నది 24 లక్షల మెట్రిక్ టన్నులు. ధాన్యం కొనుగోళ్లలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు.

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం

వరంగల్ జిల్లాలో దేవాదుల కింద పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్న సాగర్, దుబ్బాకలో పంటలు ఎండిపోతున్నాయి. వీటి పైన మేము ప్రశ్నలు వేస్తే ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నా నియోజకవర్గంలో రైతు భరోసా క్రింద రైతులకు 39 కోట్లు మాత్రమే వేశారు. ఇంకా 37 కోట్లు రావాల్సింది. మల్లన్న సాగర్ క్రింద పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా, పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక హడావిడిగా ప్రశ్నోత్తరాలను ఎత్తివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడానికి భయపడుతుంది. సభ్యులకు తెలియకుండా ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు మారుతున్నాయి.

సిద్ధిపేట నియోజకవర్గంలో 43,363 మంది రైతులు ఉన్నారు. వారిలో 22,949 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఇంకా 20,514 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇంకా 22 వేల మంది రైతులకు రైతు భరోసా రాలేదు. 39 కోట్లు రైతు భరోసా అందింది. రావాల్సింది 37 కోట్లు ఉంది.

రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే చెబుతున్నారు, కానీ ఇంకా 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిన్న రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉండేవి. HMDA భూములు తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన విషయం. GHMC, HMWS నుంచీ అప్పులు తెచ్చిన విషయం. ఇవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతాయని ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఎంఐఎం వారి ప్రశ్న కూడా ఒకటి ఉండేది.

మా మూడవ ప్రశ్న “యాసంగి పంటలు ఎండిపోతున్నాయి” అనే అంశంపై మా కేటీఆర్ ప్రశ్న ఉండేది. ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది మా ప్రభుత్వ బాధ్యత అని నిన్నే నీటిపారుదల శాఖ అంగీకరించింది. అయితే దేవాదుల కింద వందల ఎకరాల పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులలో నీళ్లు లేవు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.

మూడవ ప్రశ్న వరి ధాన్యం కొనుగోలు పై మా పల్లా రాజేశ్వర్ రెడ్డిది ఉండేది. వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్న సాగర్‌లో నీళ్లు ఉన్నా, రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు. శాసన సభ వ్యవహారల మంత్రిని అడుగుతున్నా, ప్రశ్నోత్తరాలను ఎందుకు రద్దు చేశారు? ప్రభుత్వం మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హడావిడిగా ప్రశ్నోత్తరాలను రద్దు చేసింది.

స్పీకర్‌తో నిన్ననే ఫోన్‌లో మాట్లాడాను. హడావుడిగా చేసి Question Hour లేకుండా చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా రద్దు చేయడం ఏంటి? ప్రశ్నోత్తరాలు నిర్వహించడం తప్పనిసరి. ఒకవేళ జీరో అవర్ పెట్టకపోయినా, కచ్చితంగా Question Hour పెట్టాల్సిందే అని హరీష్ రావు అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
TG High Court: రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
Sunita Williams Return to Earth: సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return To Earth | International Space Station నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్ | ABP DesamSunita Williams Return to Earth Biography | సునీతా విలియమ్స్ జర్నీ తెలుసుకుంటే గూస్ బంప్స్ అంతే| ABP DesamCM Revanth Reddy on Potti Sriramulu | పొట్టిశ్రీరాములకు అగౌరవం కలిగించాలనే ఉద్ధేశం లేదు | ABP DesamLeopard in Tirupati SV University  | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
TG High Court: రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం
Sunita Williams Return to Earth: సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
సునీతా విలియమ్స్ టీం భూమ్మీదకు రిటర్న్ జర్నీలో కీలక పరిణామం, సైంటిస్టులు హర్షం
MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్, బీజేపీపై సంచలన ఆరోపణలు
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్, బీజేపీపై సంచలన ఆరోపణలు
House Rates In Hyderabad: రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు హాట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌ - రేట్లు 128 శాతం జంప్‌
రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు హాట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌ - రేట్లు 128 శాతం జంప్‌
Actress Ranya Rao: 'పెళ్లైన నెల నుంచే మేం విడిగా ఉంటున్నాం' - కోర్టులో రన్యారావు భర్త కామెంట్స్, అరెస్ట్ నుంచి మినహాయింపు
'పెళ్లైన నెల నుంచే మేం విడిగా ఉంటున్నాం' - కోర్టులో రన్యారావు భర్త కామెంట్స్, అరెస్ట్ నుంచి మినహాయింపు
Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget