అన్వేషించండి

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్

First flight lands at Bhogapuram international airport | భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి టెస్ట్ విమానం ల్యాండ్ కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు.

విజయనగరం: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport)లో తొలి విమానం ప్రయోగాత్మక ల్యాండింగ్  విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని షేర్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడం తెలిసిందే.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయి 
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతమైన సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విమానయాన రంగంలో నేడు ఒక కొత్త మైలురాయి అని, ఇది ప్రాంతీయ అనుసంధానతను  బలోపేతం చేయడమే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా ఎదిగేందుకు మరింత ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రగతి, అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న దార్శనికత, నాయకత్వం, నిబద్ధతకు ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వ హయాంలోనే ఈ విమానాశ్రయానికి ప్రణాళికలు రూపొందించి, శ్రీకారం చుట్టామని తొలి విమానం ల్యాండ్ అయిన సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని పనులను పూర్తి చేసుకుని, రాబోయే జూన్ నెల నుండి ప్రజల కోసం వాణిజ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

విజన్ వైజాగ్ దిశగ కీలక అడుగు పడింది.. వైఎస్ జగన్
విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ కావడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావ‌డం ఏపీ అభివృద్ధిలో ఒక మైలురాయి. Vision Vizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. 

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ఎంతో కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. వైసీపీ పాలన కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడంతో పాటు ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం రూ. 960 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ఎయిర్ పోర్టు నిర్మాణానికి  సంబంధించిన ప్రధాన పనుల్లో అగ్రభాగం వైసీపీ హయాంలోనే పూర్త‌యింది. ఆ రోజు మేం చేసిన కృషి నేడు ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు కారణమైంది. 

విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృషి, సహకారం నాకు ఇప్పటికీ గుర్తుందని’ వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget