అన్వేషించండి

Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Adluri Laxman kumar | తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమం కోసం వారి వివాహ ప్రోత్సాహక నగదును రూ.2 లక్షలకు పెంచినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

Marriage Incentive for Persons with Disabilities | హైదరాబాద్: తెలంగాణలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వికలాంగుల జీవన భద్రత, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు దివ్యాంగుల మధ్య జరిగే వివాహాలకు ఇస్తున్న రూ. 1 లక్ష ఆర్థిక సహాయాన్ని ఏకంగా రూ. 2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా జనవరి 17, 2026న అధికారికంగా జీవో (G.O.Ms.No.1) విడుదలైంది. ఈ ఆర్థిక సహాయాన్ని నేరుగా భార్య పేరున జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని

ఈ నిర్ణయంపై దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. వికలాంగుల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వివాహానంతరం దివ్యాంగ దంపతులు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించి, వారు గౌరవప్రదమైన జీవితం గడపడానికి, నివాసం, వైద్య ఖర్చుల నిమిత్తం ఈ నగదు ప్రోత్సాహకం ఎంతగానో దోహదపడుతుందని అడ్లూరి లక్ష్మణ్ వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికలాంగుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

సామాజికంగా దివ్యాంగుల పట్ల వివక్షను తగ్గించి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పింఛన్ల పెంపుతో పాటు ఇటువంటి సంక్షేమ పథకాల విస్తరణ ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని సంబంధిత శాఖ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

అన్ని పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యం..

వికలాంగుల వివాహాలను ప్రోత్సహించడం ద్వారా వివక్ష తగ్గి, సామాజిక అంగీకారం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల పెంపు, సంక్షేమ పథకాల విస్తరణతో దివ్యాంగుల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోంది. ఈ చారిత్రాత్మక నిర్ణయాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సమాజంలో సమాన హక్కులతో గౌరవప్రదంగా జీవించేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబద్ధతను చాటుతూ ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఇది దివ్యాంగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే కీలక అడుగు.

అర్హత ప్రమాణాలు: ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే వధూవరులిద్దరూ లేదా వారిలో ఒకరు నిర్ణీత శాతం వైకల్యాన్ని కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం: అర్హులైన వారు మీ-సేవ కేంద్రాల ద్వారా లేదా సంబంధిత జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అవసరమైన పత్రాలు: వివాహ ధృవీకరణ పత్రం (Marriage Certificate), వైకల్య ధృవీకరణ పత్రం (SADAREM Certificate), ఆధార్ కార్డు, భార్య బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి.

ఇతర పథకాలు: ప్రభుత్వం ఇప్పటికే దివ్యాంగుల కోసం ఆసరా పింఛన్లను పెంచడంతో పాటు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
Thailand : థాయ్‌ల్యాండ్‌లో సైకోగా మారిన మాజీ పోలీసు అధికారి - పిసిపిల్లల స్కూల్లో కాల్పులు -34 మంది మృతి
థాయ్‌ల్యాండ్‌లో సైకోగా మారిన మాజీ పోలీసు అధికారి - పిసిపిల్లల స్కూల్లో కాల్పులు -34 మంది మృతి
Epstein Files: ఇండియాలోనూ ఎప్ స్టీన్ ఫైల్స్ కలకలం - మోదీ, హర్దీప్‌పై రాహుల్ ఆరోపణలు- బీజేపీ ఆగ్రహం!
ఇండియాలోనూ ఎప్ స్టీన్ ఫైల్స్ కలకలం - మోదీ, హర్దీప్‌పై రాహుల్ ఆరోపణలు- బీజేపీ ఆగ్రహం!
Bajaj Platina On Road Price: తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ ప్లాటినా 100 ఆన్-రోడ్ ధర ఎంత? ఏపీకి, తెలంగాణకు రేటులో తేడా ఎంత ?
తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ ప్లాటినా 100 ఆన్-రోడ్ ధర ఎంత? ఏపీకి, తెలంగాణకు రేటులో తేడా ఎంత ?
Advertisement

వీడియోలు

Sunil Gavaskar vs Nasser Hussain | ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు గవాస్కర్ కౌంటర్ | ABP Desam
Voter Hulchul With Knife | ఓటు వేసేందుకు వచ్చి...కత్తితో దొరికిపోయిన మహిళ | ABP Desam
Sachin Son Arjun Tendulkar Wedding | మోదీని కలిసిన సచిన్ కుటుంబం | ABP Desam
Mohsin Naqvi India vs Pak T20 WC | ఐసీసీ ఒత్తిళ్లకు లొంగబోమన్న మొహ్సిన్ నఖ్వీ| ABP Desam
Abhishek Sharma Health Update | స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు
Thailand : థాయ్‌ల్యాండ్‌లో సైకోగా మారిన మాజీ పోలీసు అధికారి - పిసిపిల్లల స్కూల్లో కాల్పులు -34 మంది మృతి
థాయ్‌ల్యాండ్‌లో సైకోగా మారిన మాజీ పోలీసు అధికారి - పిసిపిల్లల స్కూల్లో కాల్పులు -34 మంది మృతి
Epstein Files: ఇండియాలోనూ ఎప్ స్టీన్ ఫైల్స్ కలకలం - మోదీ, హర్దీప్‌పై రాహుల్ ఆరోపణలు- బీజేపీ ఆగ్రహం!
ఇండియాలోనూ ఎప్ స్టీన్ ఫైల్స్ కలకలం - మోదీ, హర్దీప్‌పై రాహుల్ ఆరోపణలు- బీజేపీ ఆగ్రహం!
Bajaj Platina On Road Price: తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ ప్లాటినా 100 ఆన్-రోడ్ ధర ఎంత? ఏపీకి, తెలంగాణకు రేటులో తేడా ఎంత ?
తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ ప్లాటినా 100 ఆన్-రోడ్ ధర ఎంత? ఏపీకి, తెలంగాణకు రేటులో తేడా ఎంత ?
SA vs AFG Super Over: T20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ! రెండో సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం
T20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ! రెండో సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం
Telangana new Chief Secretary: మార్చి నెలాఖరులో రామకృష్ణారావు రిటైర్ - తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా ఆ సీనియర్ ఆఫీసరేనా?
మార్చి నెలాఖరులో రామకృష్ణారావు రిటైర్ - తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా ఆ సీనియర్ ఆఫీసరేనా?
Telangana Municipal Elections 2026: ఆదిలాబాద్‌లో కత్తితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన మహిళ.. పీఎస్‌కు తరలించి కేసు నమోదు
ఆదిలాబాద్‌లో కత్తితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన మహిళ.. పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు
AP Assembly Schedule: ఈ 14న సభలో రాష్ట్ర బడ్జెట్‌, మొత్తం 17 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ 14న సభలో రాష్ట్ర బడ్జెట్‌, మొత్తం 17 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Embed widget