అన్వేషించండి

AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష

AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31రోజున జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1కు పోస్టుపోన్ చేశారు.

AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక గమనిక. నెల 31న అంటే సోమవారం రాయాల్సిన 1న సోషల్ స్టడీస్ పరీక్ష ఒకరోజు వాయిదా పడింది.
31-03-2025 (సోమవారం)న ఈద్ అల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా సెలవు దినంగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కాబట్టి సోషల్ స్టడీస్ పరీక్ష 01-04-2025 న అంటే(మంగళవారం)న నిర్వహిస్తామన్నారు ఏపీ పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజ్ ఐఏఎస్. పరీక్ష తేదీలోని ఈ మార్పుని ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, స్కూల్ హెడ్మాస్టర్లు, సిఎస్, డిఓ, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖ, ఇతరులతో సహా అన్ని లైన్ డిపార్ట్‌మెంట్‌ల సిబ్బందికి తెలియజేయాలని ఆర్జేడీ, డీఈవో తదితర అధికారులకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా డైరెక్టర్ సూచించారు. ఈ నేపథ్యంలో మెటీరియల్, ప్రశ్నాపత్రాలు తీసుకెళ్లడానికి   ఈ నెల 31న నిల్వ కేంద్రాల  (స్టోరేజీ పాయింట్లు) వైపు వెళ్లొద్దన్నారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి సోషల్ స్టడీస్ పరీక్షను  సోమవారం బదులుగా మంగళవారం రాయడానికి ప్రిపేర్ కావాలని ఆయన తెలిపారు.

శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలో 98.65 శాతం హాజరు

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన జీవ శాస్త్ర (బయాలజికల్ సైన్స్) పరీక్ష ప్రశాంతంగా జరిగింది అని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు  ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 6,36,241 మంది విద్యార్థులకు గానూ 6,27,673 మంది విద్యార్థులు హాజరు కాగా, 8345 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1376 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఒక విద్యార్థి చూసి రాస్తుండగా పట్టుబడ్డాడని, ఆ విద్యార్థిని డిబార్ చేసి సంబంధించిన ఇన్విజిలేటరును సస్పెండ్ చేశామన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు.

ఆది, సోమవారాల్లో రెవెన్యూ మున్సిపల్ శాఖలు పని చేస్తాయి : ఏపీ ప్రభుత్వం 
ఉగాది, రంజాన్ సందర్భంగా సెలవు ఉంటుందని భావించిన రెవెన్యూ మున్సిపల్ శాఖలను ఆ రెండు రోజులు పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం ఆఖరు కాబట్టి స్థిరాస్థి విక్రయాలు కొనుగోలుకు వీలు పడేలా ఆ రెండు రోజులు రెవెన్యూ శాఖ, ఇంటి పన్ను చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖలో కొన్ని ప్రత్యేక కౌంటర్లు మార్చి 30 31 తారీఖుల్లోనూ పని చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. దానితో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష కూడా 31న జరిపేస్తారని కొందరు ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం  మార్చి 31న పరీక్షలు ఉండదని దానికి బదులు ఏప్రిల్ ఒకటిన పరీక్ష జరుగుతుందని స్పష్టత ఇచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Balakrishna: 'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
Embed widget