Top Stories
See MoreAdvertisement
గణతంత్ర దినోత్సవం (Republic Day 2026)
భారతదేశ రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటాం. ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. మనల్ని మన పాలించుకుంటున్నాం, మన శ్రేయస్సు కోసం చట్టాలు తయారు చేసుకుంటున్నామనే విషయాన్ని చెప్పేందుకు ప్రతీకగా ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. 1950లో ఇదే రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ రోజున మన దేశం రూపొందించుకున్న రాజ్యాంగం ద్వారా మనల్ని మనం పరిపాలించుకునే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేశాం.
స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు దేశ వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను, పౌరుల హక్కులను పరిరక్షించే రాజ్యాంగాన్ని రూపొందించడం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ నాయకత్వంలోని రాజ్యాంగ పరిషత్ సుమారు 2 సంవత్సరాల, 11 నెలల 18 రోజులు రాత్రిపగలు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలపై ఆధారపడి ఉంది.
1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విడిపోయి, ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా తన గుర్తింపును సుస్థిరం చేసుకుంది. ఈ రోజు నుంచి దేశంలో చట్టబద్ధమైన పాలన ప్రారంభమైంది. మతం, కులం లేదా వర్గంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాయి.
అందుకే నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై పూర్తి గౌరవ మర్యాదలతో సగర్వంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో (గతంలో రాజ్పథ్ అని పిలిచేవారు) ఒక భారీ కవాతు జరుగుతుంది, ఇది భారతదేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. రాష్ట్రాల శకటాలను ప్రదర్శిస్తారు.
Independence Day Quiz
Independence Day Wishes
Advertisement













