అన్వేషించండి

Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ

Aadhar: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఓటర్ జాబితాలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది.

Aadhar Voter Link: భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంటోంది.  ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించుకుంది.  ఈ అనుసంధానంపై న్యూఢిల్లీలో జరిగిన చర్చలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఎలా అనుసంధానం చేయాలన్న అంశంఫై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని ఈసీ తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై  ఓ స్పష్టత తీసుకోనుంది.  

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే చాలా వరకూ ఓటర్,ఆధార్ అనుబంధానాన్ని ఓటర్లు స్వచ్చందంగా చేసుకున్నారు. అయితే తప్పనిసరి కాదు. స్వచ్చందంగా ఆన్ లైన్ లో చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం విషయంలో భారతదేశంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం ఒక వైపు ఉండగా, ప్రతిపక్ష పార్టీలు, గోప్యతా హక్కుల కార్యకర్తలు మరో వైపు వాదనలు వినిపిస్తున్నారు.                                  

ఆధార్‌తో ఓటరు ఐడీ అనుసంధానం చేయడం వల్ల వ్యక్తుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం కావచ్చని  కొన్ని సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు 2018లో ఆధార్‌పై ఇచ్చిన తీర్పులో, గోప్యత ఒక ప్రాథమిక హక్కు అని పేర్కొంది . ఆధార్ వినియోగాన్ని కొన్ని ప్రత్యేక ప్రయోజనాలకు  మాత్రమే పరిమితం చేసింది. ఓటరు ఐడీతో లింక్ చేయడం ఈ తీర్పును ఉల్లంఘించే అవకాశం ఉందని ..డేటా లీక్ అయితే లేదా ప్రభుత్వం దీన్ని  నిఘా కోసం ఉపయోగిస్తే పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లుతుందనే భయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. 

2015లో ఎన్నికల సంఘం ఆధార్‌తో ఓటరు ఐడీలను ప్రయోగాత్మకంగా అనుసంధానం చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో దాదాపు 55 లక్షల ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుండి తొలగిపోయాయని ఆరోపణలు వచ్చాయి. ఆధార్ లేని లేదా ఆధార్ వివరాలు సరిపోలని వారి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, గిరిజనులు వంటి వర్గాల వద్ద ఆధార్ కార్డు లేకపోవడం లేదా సరైన వివరాలు లేకపోవడం వల్ల వారు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం ,  ఎన్నికల సంఘం   ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ ఓటర్లను గుర్తించ వచ్చని వాదిస్తున్నాయి. 

2021లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ప్రకారం, ఆధార్‌తో ఓటరు ఐడీ అనుసంధానం ఐచ్ఛికం   మాత్రమేనని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఐచ్చికంగానే ఈసీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
Embed widget