అన్వేషించండి

Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ

Aadhar: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఓటర్ జాబితాలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది.

Aadhar Voter Link: భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంటోంది.  ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించుకుంది.  ఈ అనుసంధానంపై న్యూఢిల్లీలో జరిగిన చర్చలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఎలా అనుసంధానం చేయాలన్న అంశంఫై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని ఈసీ తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై  ఓ స్పష్టత తీసుకోనుంది.  

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే చాలా వరకూ ఓటర్,ఆధార్ అనుబంధానాన్ని ఓటర్లు స్వచ్చందంగా చేసుకున్నారు. అయితే తప్పనిసరి కాదు. స్వచ్చందంగా ఆన్ లైన్ లో చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం విషయంలో భారతదేశంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం ఒక వైపు ఉండగా, ప్రతిపక్ష పార్టీలు, గోప్యతా హక్కుల కార్యకర్తలు మరో వైపు వాదనలు వినిపిస్తున్నారు.                                  

ఆధార్‌తో ఓటరు ఐడీ అనుసంధానం చేయడం వల్ల వ్యక్తుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం కావచ్చని  కొన్ని సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు 2018లో ఆధార్‌పై ఇచ్చిన తీర్పులో, గోప్యత ఒక ప్రాథమిక హక్కు అని పేర్కొంది . ఆధార్ వినియోగాన్ని కొన్ని ప్రత్యేక ప్రయోజనాలకు  మాత్రమే పరిమితం చేసింది. ఓటరు ఐడీతో లింక్ చేయడం ఈ తీర్పును ఉల్లంఘించే అవకాశం ఉందని ..డేటా లీక్ అయితే లేదా ప్రభుత్వం దీన్ని  నిఘా కోసం ఉపయోగిస్తే పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లుతుందనే భయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. 

2015లో ఎన్నికల సంఘం ఆధార్‌తో ఓటరు ఐడీలను ప్రయోగాత్మకంగా అనుసంధానం చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో దాదాపు 55 లక్షల ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుండి తొలగిపోయాయని ఆరోపణలు వచ్చాయి. ఆధార్ లేని లేదా ఆధార్ వివరాలు సరిపోలని వారి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, గిరిజనులు వంటి వర్గాల వద్ద ఆధార్ కార్డు లేకపోవడం లేదా సరైన వివరాలు లేకపోవడం వల్ల వారు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం ,  ఎన్నికల సంఘం   ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ ఓటర్లను గుర్తించ వచ్చని వాదిస్తున్నాయి. 

2021లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ప్రకారం, ఆధార్‌తో ఓటరు ఐడీ అనుసంధానం ఐచ్ఛికం   మాత్రమేనని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఐచ్చికంగానే ఈసీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs WI Highlights: సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
Israel Strike on Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మృతి.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మృతి.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget