అన్వేషించండి

Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు

Kurnool News: ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం కొనసాగింది. బన్నీ ఉత్సవంలో 70 మందికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Devaragattu Bunny Utsavam In Kurnool: ఓ సంప్రదాయం.. ఓ ఉత్సవం.. ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు గ్రామాల మధ్య పోరాటం. వెరసి కర్రల సమరం. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఇది మా సంప్రదాయం అంటూ అక్కడి గ్రామాల ప్రజలు ఏళ్లుగా ఈ పోరాటం చేస్తూనే ఉన్నారు. దేవతామూర్తులను కాపాడుకోవడానికి కర్రలతో కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా కర్నూలు (Kurnool) జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం కొనసాగింది. సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగింది. ఇరువర్గాల ప్రజలు కర్రలతో కొట్టుకోవడంతో దాదాపు 70 మంది గాయలపాలయ్యారు. వీరిని సమీపంలోని ఆదోని, బళ్లారి ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు

హింసకు తావు లేకుండా బన్నీ ఉత్సవం నిర్వహించుకునేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు ఏర్పాట్లు చేసినా ఎలాంటి సత్ఫలితాన్నివ్వలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 800 మంది పోలీసులు మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. అయినా, కర్రల సమరంలో హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు 

అసలేంటీ బన్నీ ఉత్సవం.?
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు

ప్రతి ఏటా దసరా సందర్భంగా దేవరగట్టులో ఈ బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై ఉన్న దేవతామూర్తులు మాళ మల్లేశ్వర స్వామికి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుతురులో విగ్రహాలు ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా.. మూడు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగుతారు. ఉత్సవ మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓవైపున.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల ప్రజలు మరోవైపున కర్రలతో తలపడ్డారు. ఈ నేపథ్యంలో గాయాలపాలైనా కొందరు లెక్కచేయరు. ఈ కర్రల సమరాన్ని వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. 

సమరంలో గాయాలపాలైన వారికి చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. పరిస్థితి విషమంగా ఉంటే పట్టణంలో చేరుస్తారు. కొందరు చిన్న గాయాలపాలైన వారు పసుపు రాసుకుని వెళ్లిపోతారు. 

ఇదీ చరిత్ర

త్రేతాయుగంలో దేవరగట్టు కొండల్లో లోక కల్యాణార్థం మునులు యజ్ఞ యాగాలు నిర్వహించేవారు. వాటిని మణి, మల్లాసురులనే రాక్షసులు భగ్నం చేసేవారు. దీంతో వారి బారి నుంచి రక్షించాలని మునులు శివపార్వతులను వేడుకోగా.. ఆది దంపతులు మాళ, మల్లేశ్వర స్వాములుగా అవతరించారు. రాక్షసులతో యుద్ధం ప్రారంభం కాగా.. శివుని చేతిలో మరణం భాగ్యమనుకున్న రాక్షసులు విజయదశమి రోజు చావుకి సిద్ధమయ్యారు. అయితే, తమకు ఏటా నరబలి ఇవ్వాలని కోరుకున్నారట. అది సాధ్యం కాదని.. విజయదశమి రోజున గొరవయ్య తొడ నుంచి పిడెకెడు రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తారని స్వామి వారికి అభయమిచ్చాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా దసరా రోజున ఈ జైత్రయాత్ర జరపడం ఆనవాయితీ అయ్యింది.

Also Read: Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget