అన్వేషించండి

Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!

JC Prabhakar Reddy News | తాడిపత్రిలో స్థానికంగా ఇసుక వ్యాపారం, లిక్కర్ బిజినెస్, పేకాట క్లబ్బులు నడిపేవారు 15 శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేకాట క్లబ్‌లు, ఇసుక వ్యాపారం చేసేవారు వారి సంపాదనలో 15 శాతం కమిషన్ ఇవ్వాలని హెచ్చరించారు. ఇదంతా నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించాలన్నారు. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి తాను 20 శాతం డబ్బులు ఖర్చు చేస్తానని, తనకు ఒక్క రూపాయి కూడా వద్దన్నారు. దశాబ్దాల నుంచి తాము రాజకీయాల్లో ఉన్నామని, ప్రజలు తమకు అండగా ఉన్నారని.. నియోజకవర్గ అభివృద్ధి ఇలాంటివి తప్పదన్నారు. వారితో పాటు మద్యం షాపు నిర్వాహకులు తనకు 35 శాతం కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేయడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తాడిపత్రి రాజకీయాలు వేరయా అంటున్నారు.

అనంతపురంలో భిన్నమైన నియోజకవర్గం..
ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడ్రిపత్రిలోకి రాలేకపోతున్నారు. మరోవైపు జేసీ వర్గీయులు నియోజకవర్గంలో కొత్త రూల్స్ పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు తాడిపత్రిలో లేకుండా ఉండాలంటూ గతంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అభివృద్ధి పేరుతో కమీషన్లు ఇవ్వాలని నేరుగా అడగడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతోంది. కమిషన్లుగా తీసుకున్న డబ్బును తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయడం ఏంటని స్థానికులతో పాటు వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తాడిపత్రి నియోజకవర్గం కాస్త వెరైటీ అని చెప్పవచ్చు. అక్కడ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. 

ఇసుక అక్రమాలపై జేసీ సంచలనం
టీడీపీకి చెందిన నాయ‌కులు, త‌న అనుచ‌రులే ఇసుక దోచుకుంటున్నార‌ని తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. పైగా ఆయన కుమారుడు ప్ర‌స్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కావడంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. గ‌డిచిన అయిదేళ్లుగా త‌న‌కు అండ‌గా నిలిచిన నాయ‌కులు, ఇప్పుడు తాడిపత్రిలో ఇసుకను అక్ర‌మంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నార‌ని ఆరోపించారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఇసుక త‌వ్వ‌కాల‌పై చర్యలు తీసుకోవాలంటూ తాను గ్రీన్ ట్రైబ్యున‌ల్, హైకోర్టులు, అధికారుల‌ చుట్టూ తిరిగి పోరాటం చేస్తే.. ఇప్పుడు తన అనుచ‌రులే ఇసుక దందా చేస్తున్నారని వీడియో రిలీజ్ చేశారు. తాడిపత్రి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 2.5 ల‌క్ష‌ల మంది ఉంటే, కేవ‌లం 25 మంది ఇసుక దందా చేసి దోచుకుంటున్నారని జేసీ ప్రభాకకర్ రెడ్డి ఆరోపించారు. మీ దందా, ఇసుక అక్రమరవాణా మరెక్కడైనా చేసుకోండి, కానీ నా నియోజ‌క‌వ‌ర్గంలో కనుక కనిపిస్తే మీ టిప్పర్ బండ్లు ఇక బ‌య‌ట‌కు కూడా రావ‌ని టిప్ప‌ర్ ఓన‌ర్ల‌ను సైతం హచ్చరించారు. 

పోలీసుల్లో జేసీ ఫ్యామిలీపై అసంతృప్తి.. 
తాడిపత్రిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే అస్మిత్‌ రెడ్డి సీఐ లక్ష్మీకాంత్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. అయితే తమకు విషయం వదిలేస్తే, చట్టప్రకారం కేసులు  నమోదు చేస్తామని, ఎప్పుడేం చేయాలేం మీరు చెబుతారా అని సీఐ అడగటంతో వివాదం మొదలైంది. అది చివరికి సీఐ వర్సెస్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిగా మారింది. సీఐకి మద్దతు తెలిపాల్సిన పోలీసు ఉన్నతాధికారులు సైతం అందుకు భిన్నంగా సీఐతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి క్షమాపణలు సైతం చెప్పించారు. దాంతో రాష్ట్రంలో ఇది సపరేట్ నియోజకవర్గం అని తాడిపత్రిపై మరోసారి చర్చ జరుగుతోంది.

Also Read: Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Baba Siddique Death: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారికి చక్రస్నానం, చూసి తరించండిGame Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Baba Siddique Death: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?
Attack on TDP Office: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
Home Loan: కో-అప్లికెంట్‌తో కలిసి హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా?, ముందు లాభనష్టాల గురించి తెలుసుకోండి
కో-అప్లికెంట్‌తో కలిసి హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా?, లాభనష్టాల గురించి తెలుసుకోండి
Viral News: డ్రైవర్ లేకుండా వెళ్తున్న కారులో మంటలు, షాకింగ్ వీడియో వైరల్
డ్రైవర్ లేకుండా వెళ్తున్న కారులో మంటలు, షాకింగ్ వీడియో వైరల్
Baba Siddique: సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
సల్మాన్ - షారుఖ్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన బాబా సిద్ధిఖీ దారుణ హత్య, బాలీవుడ్‌లో కలకలం
PM Internship Scheme: టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
టాప్‌ కంపెనీల్లోకి యవతకు రెడ్‌ కార్పెట్‌ - పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు
Embed widget