అన్వేషించండి

Maha Kumbh 2025: జైల్లో ఖైదీలకు కుంభమేళా పవిత్ర జలంతో స్నానం!

Maha Kumbh 2025: మహా కుంభమేళలా ముగిసిపోనుంది. భక్తులంతా కుంభమేళాలో స్నానమాచరించేందుకు పోటీపడుతున్నారు. ఈ సమయంలో ఖైదీలకు కూడా ఆ అవకాశం కల్పిస్తోంది యూపీ సర్కార్

Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో పూర్తవుతుంది. భారీగా భక్తులు స్నానమాచరించేందుకు పోటీపడుతున్నారు. ఇక వారం రోజులే ఉండడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ సమయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలో 90 వేలకు పైగా ఖైదీలకు త్రివేణిసంగజలంతో స్నానమాచరించే అవకాశం కల్పిస్తామని యూపీ అధికారులు వెల్లడించారు.

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం నుంచి జలాన్ని సేకరించి ఆయా జైళ్లకు తీసుకెలతామని..ఆయా కారాగారాల్లో ఉండే నీటి ట్యాంకుల్లో ఈ జలాన్ని కలుపుతామన్నారు. పవిత్ర స్నానాల తర్వాత పూజలు, మిగిలిన క్రతువులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర జైళ్లశాఖా మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమంలో తాను  పాల్గొంటున్నానని చెప్పారు. మొదటిసారి ఖైదీల కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు మంత్రి.  

Also Read:  చిన్న రాయి పడితే కోరికలు తీర్చే ఈ చిత్రమైన శివాలయం గురించి మీకు తెలుసా - ఈ శివరాత్రికి దర్శించుకోండి !

జనవరి 13 భోగి రోజు ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ముగింపు తేదీని పొడిగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది కానీ అదేం లేదని..అనుకున్న సమయానికి పూర్తవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అసలు మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు కానీ ఇప్పటికే 55 కోట్లు దాటేసింది. కేవలం మౌని అమావాస్య ఒక్కరోజే 8 కోట్లమంది భక్తులు స్నానాలు అచరించారు. మహాశివరాత్రి నాటికి ఈ లెక్క 60 కోట్ల దాటే అవకాశం ఉందని అధికారుల అంచనా.

Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా భక్తుల రద్దీతోనే కాదు వ్యాపారంలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కుంభమేళా ప్రారంభానికి ముందు  40 కోట్ల మంది భక్తులు వస్తే దాదాపు 2 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు..కానీ ఆ లెక్క ఇప్పుడు 3 లక్షల కోట్లు దాటేసిందని అంచనా. ఇది యూపీ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం అందించడంతో పాటూ కొత్త వ్యాపార అవకాశాలు క్రియేట్ చేసిదంటున్నారు అధికారులు. ఆతిథ్యం, ఫుడ్, వాటర్, డ్రింక్స్, రవాణా, ఆధ్యాత్మిక దుస్తులు, పూజా సామగ్రి,మందులు, ఇతర వినియోగ వస్తువుల వ్యాపారాలు ఓ రేంజ్ లో జరిగాయంటున్నారు. కేవలం ప్రయాగరాజ్ లోనే కాదు..కుంభమేళాకి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాల్లోనూ వ్యాపారం భారీగా సాగిందంటున్నారు. ఇంకా అయోధ్య, వారణాసి సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లోనూ యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ప్రయాగరాజ్ సందర్శించిన భక్తులంతా అయోధ్య బాలరాముడిని, వారణాసిలో శివయ్యను దర్శించుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి.

Also Read:  అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే

మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర ప్రదేశ్  ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్‌పాస్‌ల కోసమే 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.  ఆ మేరకు భక్తుల రద్దీ కూడా అదే స్థాయిలో ఉంది...

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Samantha: కష్ట సమయంలో అతను నా వెంటే ఉన్నాడు - ఆ రిలేషన్‌కు పేరు పెట్టలేనన్న సమంత
కష్ట సమయంలో అతను నా వెంటే ఉన్నాడు - ఆ రిలేషన్‌కు పేరు పెట్టలేనన్న సమంత
Viral News: కాలేజీ విద్యార్థిని ఖాతాలో 35 కోట్లు - ఎక్కడివో తెలుసుకుని పోలీసులు షాక్ !
కాలేజీ విద్యార్థిని ఖాతాలో 35 కోట్లు - ఎక్కడివో తెలుసుకుని పోలీసులు షాక్ !
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
Sarangapani Jathakam Review - సారంగపాణి జాతకం రివ్యూ: 'కోర్ట్' విజయం తర్వాత ప్రియదర్శికి మరో హిట్ వచ్చిందా? జాతకాల పిచ్చి నవ్వించిందా?
సారంగపాణి జాతకం రివ్యూ: 'కోర్ట్' విజయం తర్వాత ప్రియదర్శికి మరో హిట్ వచ్చిందా? జాతకాల పిచ్చి నవ్వించిందా?
Embed widget