అన్వేషించండి

KCR Latest News: రెండు జాతీయ పార్టీలను ఒకేసారి మడతెట్టేలా కేసీఆర్ స్కెచ్‌- ఈసారి చంద్రుడి సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా!

KCR Latest News: తెలంగాణలో బలపడేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీశారు. మళ్లీ చంద్రబాబును మధ్యలో పెట్టి రెండు జాతీయ పార్టీలను కొట్టాలని చూస్తున్నారు.

KCR Comments On Chandra Babu: రాజకీయాల్లో నేతల ప్రతీ మాటకు ఓ లెక్క ఉంటుంది. కొద్ది మంది తమ మాటల ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకుంటారు. మరి కొద్ది మంది నేతలు తమ మాటల ద్వారా ప్రత్యర్థి నేతలను, పార్టీలను ఢిపెన్స్‌లోకి నెడతారు. మరి కొద్ది మంది నేతలు మాట జారి వివాదస్పదమై సెల్ఫ్ డిఫెన్స్‌లోకి జారుకుంటారు. అలాంటి వ్యాఖ్యలతో పార్టీకి, ప్రజలకు ఓ సంకేతాన్ని పంపుతారు ఇంకొందరు. ఇదంతా ఎందుకంటే రాజకీయ నేతలకు ప్రధాన ఆయుధం వారి మాటలే. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి. 

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని కేసీఆర్ వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాకతాళీయంగా చేసినవి కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. చాలా ఆచితూచి ప్రయోగించిన పాత అస్త్రంగా కేసీఆర్ రాజకీయాలన్ని దగ్గరి నుంచి చూస్తోన్న విశ్లేషకులు చెబుతున్నారు. 

పాత గాయాలను చూపుతోన్న కేసీఆర్.
విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చంద్రబాబు పాలన నాటి రోజులను గుర్తు చేశారు. కరెంటు కోతలు, కరెంటు ఛార్జీల పెంపు, ఉద్యమం నాటి పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాను తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది, కనీసం తన పార్టీకి కార్యాలయం దొరకనీయకుండా చంద్రబాబు చేశారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జల దృశ్యంలో తన ఇంటినే కార్యాలయంగా ఇస్తే దాన్ని చంద్రబాబు కూల్చివేశారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు ప్రధాన శత్రువు అని చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. చంద్రబాబు అడుగుపెడితే అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని హెచ్చరికను పార్టీ శ్రేణులకు, ప్రజలకు పంపే ప్రయత్నం చేశారు.

2014, 2019లో చంద్రబాబే బీఆర్ఎస్ టార్గెట్...
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసన సభ ఎన్నికల్లోను కేసీఆర్ ప్రధాన ప్రచారాస్త్రం చంద్రబాబే. తెలంగాణను అడ్డుకున్న వ్యక్తిగా చంద్రబాబును ఆ ఎన్నికల్లో కేసీఆర్ చిత్రీకరించారు. తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిన చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాల్లోకి ఎలా రానిద్దామంటూ ప్రతీ సభలో కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రచారం ప్రజల్లోనీ తీవ్ర చర్చ రెకెత్తించింది. కేసీఆర్ ఎత్తుగడ ఫలించింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకోని అధికారంలోకి వచ్చింది.

2018లో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రచారం చేశారు. ఆయన టార్గెట్‌గానే కేసీఆర్ ప్రతి సభలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణపై పెత్తనం చేయడానికి వస్తున్నారని తీవ్ర స్థాయిలో సెంటిమెంట్‌ రగిల్చారు. అప్పుడు కూడా చంద్రాస్త్రంతోనే కేసీఆర్ పవర్‌లోకి వచ్చారు.  

Also Read: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి హత్య- విచారణకు ఒక్కరోజు ముందే మర్డర్‌- రేవంత్ సీరియస్‌- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

2025లోనూ పాత అస్త్రానికి పదును పెడుతున్న కేసీఆర్.
అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతున్న టైంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేదికగా కేసీఆర్ చంద్రబాబు అస్త్రాన్ని బయటకు తీశారు. తిరిగి ఎన్డీఏ పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయనున్నారని ఇది తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తోందని చెప్పేందుకు కేసీఆర్ విమర్శలు చేశారు. ఓవైపు చంద్రబాబు ఏపీ సీఎంగా ఉంటూ, తెలంగాణలో రాజకీయాల్లో కూడా అడుగుపెడితే తెలంగాణాకు అన్యాయం, ఏపీకి లాభం జరుగుతుందన్న లాజిక్‌ను వాడే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.

ఎన్డీఏలో చక్రం తిప్పే పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు, తెలంగాణలోకి రానిస్తే కేంద్రం నుంచి వచ్చేవి రాకుండా అడ్డుపడే అవకాశం ఉంటుందని, గోదావరి, కృష్ణా జలాలను తరలించుకునే అవకాశం ఉందని అందుకే కేసీఆర్ ఈ వాఖ్యలు చేసినట్లు గులాబీ ముఖ్య నేతలు చెబుతున్నారు. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉండటంతో చంద్రబాబుకు అడ్డు లేకుండా పోతుందని అందుకే కేసీఆర్ ముందు చూపుతో చేసిన వ్యాఖ్యలగా బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. 

రానున్న రోజుల్లో ఇదే ప్రచారాస్త్రం కానుందా..?
ఎన్డీఏ పేరుతో తెలంగాణలోకి చంద్రబాబు రాకుండా చేసే ప్రచారం కేసీఆర్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంతో తెలంగాణ ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రేకేత్తించవచ్చన్నది ఆయన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014, 2018లో మెజార్టీ స్థానాలు బీఆర్‌ఎస్‌ గెలవడానికి కారణం తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో తిరిగితే అది కేసీఆర్‌కు ప్లస్ అవుతుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది కేసీఆర్‌కు సెంటిమెంట్ అస్త్రంగా మారనుందని అంటున్నారు. ఇదే వ్యూహంతో కేసీఆర్ చాలా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

Also Read: బీఆర్ఎస్ బహిరంగసభ మరింత ఆలస్యం - ఏప్రిల్ 27వ తేదీ ఖరారు !

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget