Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
వెస్టిండీస్ ను ఇంగ్లండ్ ను నాకౌట్ చేసి భారత్ ఈ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి దూసుకువచ్చింది. న్యూజిలాండ్ తో ఆదివారం జరగబోయే ఫైనల్ కి సర్వం సిద్ధమైంది. కానీ భారత్ ఫ్యాన్స్ మాత్రం చాలా టెన్షన్ తో ఉన్నారు. ఈ టెన్షన్ టీమ్ ఫర్ ఫార్మెన్స్ గురించి కాదు మ్యాచ్ వెన్యూ గురించి. ఎస్ అహ్మదాబాద్ లో నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. లక్షా 20 వేల మంది ఒకే సారి మ్యాచ్ చూడగల వెసులు బాటు ఈ గ్రౌండ్ లో ఉంటుంది కానీ భారత్ క్రికెట్ జట్టుకు ఈ గ్రౌండ్ తో ఓ పీడకల ఉంది. అదేంటంటే మనం 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఈ గ్రౌండ్ లోనే ఓడిపోయాం. ఫైనల్ వరకూ తిరుగేలేకుండా దూసుకొచ్చిన రోహిత్ శర్మ సేనను...ఫైనల్లో ఆస్ట్రేలియా మట్టికరిపించింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును 240 పరుగులకే ఆలౌట్ చేయటం కాదు...ఆ స్కోరును అవలీలగా ఛేజ్ చేసేసి మన చేతుల్లోనుంచి వరల్డ్ కప్ ను తన్నుకెళ్లిపోయింది. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లక్షా 20 వేల మందిని సైలెంట్ చేస్తే వచ్చే మజానే వేరని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి మరీ వరల్డ్ కప్ గెలుచుకుని వెళ్లాడు. ఇప్పుడు అలాంటి బ్యాడ్ మెమరీ ఉన్న గ్రౌండ్ లోనే మళ్లీ భారత్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడనుంది. ఈ సారి ఫార్మాట్ వేరేనా ప్రత్యర్థి న్యూజిలాండ్ అయినా కూడా టెన్షన్ మాత్రం తగ్గట్లేదు. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో మనం న్యూజిలాండ్ చేతిలోనే కంగుతిన్నామనే టెన్షన్ ఓ వైపు...అంత గొప్ప ఎక్స్ పీరియన్స్ లేని గ్రౌండ్ లో ఫైనల్ కావటం మరోవైపు మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. అయితే ఇక్కడ టీ20 ల్లో భారత్ రికార్డు మాత్రం బాగుంది. 10 మ్యాచులను ఇదే గ్రౌండ్ లో ఆడిన భారత్ 7 గెలుచుకోగా..ఆడిన 2 మ్యాచుల్లోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది. ఈటీ20 వరల్డ్ కప్ లో ఇక్కడ ఆరు మ్యాచులు జరిగితే మూడు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు..రెండుసార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచాయి...ఓ సారి మ్యాచ్ టై అయ్యింది. సో ఇక్కడ పిచ్ కూడా అన్ ప్రెడిక్టబుల్. చూడాలి మనోళ్లు ఏం మ్యాజిక్ చేస్తారో...ఎలా వరల్డ్ కప్ ను వరుసగా రెండోసారి ముద్దాడుతారో.
ట్రెండింగ్ వార్తలు


















