Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Maoists surrender : దేవ్జీ దళానికి చెందిన మావోయిస్టులంతా సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యే వారందరికీ భద్రత, ప్యాకేజీ కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Maoists surrender in the presence of CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత , జనజీవన స్రవంతిలోకి వారిని ఆహ్వానించే క్రమంలో ఒక భారీ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఏకంగా 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించి లొంగిపోయారు. దశాబ్దాల కాలంగా అడవుల్లో సాయుధ పోరాటం చేస్తున్న ఇంతటి భారీ సంఖ్యలో సభ్యులు ఒకేసారి లొంగిపోవడం రాష్ట్ర శాంతిభద్రతల చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో డిజిపి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అగ్రశ్రేణి నాయకత్వం లొంగుబాటు
లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. మొత్తం 130 మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు , ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు , 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు , 46 మంది ఏరియా కమిటీ సభ్యులు , 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. పార్టీ వ్యూహరచనలో, కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే ఇంతమంది అగ్రశ్రేణి నేతలు లొంగిపోవడం వల్ల మావోయిస్టు క్యాడర్కు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.
124 #Maoists, including #PLGA committee members led by Devji, are set to surrender before #Telangana CM #RevanthReddy. Security forces seized 16 SLRs, 15 INSAS rifles, 20+ AKs, other weapons, and a huge cache of ammunition. pic.twitter.com/Bg0jNqF3a0
— Ashish (@KP_Aashish) March 7, 2026
భారీగా ఆయుధాల అప్పగింత
కేవలం వ్యక్తులు మాత్రమే కాకుండా, అత్యాధునిక ఆయుధాలను కూడా వారు పోలీసులకు అప్పగించారు. మొత్తం 124 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 1 ఇన్సాస్ ఎల్ఎంజి రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21 ఇన్సాస్ రైఫిళ్లు, 20 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 18 .303 రైఫిళ్లు, ఇతర 33 రకాల ఆయుధాలు ఉన్నాయి.
130 Maoists surrendered in the presence of Telangana Chief Minister A. Revanth Reddy, handing over their weapons to the police.
— Naveena (@TheNaveena) March 7, 2026
Among those who surrendered:
• 3 State Committee Members
• 1 Regional Committee Member
• 10 Divisional Committee Members
• 46 Area Committee… pic.twitter.com/1Mx97UnTpw
ప్రభుత్వ భరోసా - పునరావాసం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున ప్రకటించిన పునరావాస ప్యాకేజీలను తక్షణమే అందిస్తామని, వారి కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా, చర్చలు మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమస్యల పరిష్కారం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నాం. శాంతియుత మార్గాలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. గణపతి ఆరోగ్యం బాగోలేదని తెలిసిందని.. ఆయన సరెండర్ అయితే రక్షణ కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు



















