అన్వేషించండి

Tirumala : శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు..తిరుమలలో ఈ టైమ్ లో ఇంత రద్దీ ఎందుకో తెలుసా సామీ!

Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది..శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోంది. ఈ టైమ్ లో ఇంత రష్ ఎందుకో తెలుసా...

Tirumala Rush: తిరుమలేశుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఫిబ్రవరి 20 గురువారం ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా టైమ్ పట్టేస్తోంది. వారం ప్రారంభం సోమవారం రోజు కొంత రద్దీ తగ్గినట్టు కనిపించినా..మళ్లీ మంగళవారం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈరోజు గురువారం ...రేపటి నుంచి వీకెండ్ సందడి ప్రారంభం కావడంతో శుక్రవారం, శనివారం, ఆదివారం .. రోజుల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు టీటీడీ అధికారులు

Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!

వాస్తవానికి న్యూ ఇయర్, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి హడావుడి ముగిసిన తర్వాత మళ్లీ సమ్మర్ హాలిడేస్ లో తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఫిబ్రవరిలోనూ శ్రీవారి సన్నిధి భక్తులతో వెలిగిపోతోంది. 

సమ్మర్లో ఆ వేడి భరించడం కన్నా ముందుగానే తిరుమల వెళ్లిరావడం మంచిదనే ఆలోచన కొందరిది

పరీక్షలు మొదలయ్యేలోగా శ్రీవారిని దర్శించుకుని రావాలన్న సెంటిమెంట్ మరికొందరిది

స్టూడెంట్స్ కి హాలిడేస్ ఇచ్చేస్తే తిరుమలలో రష్ పెరుగుతుందనే ఆలోచనతో ముందే దర్శనం చేసుకుంటున్నవారు ఇంకొందరు

మొక్కులు తీర్చుకునేందుకు అధిక రద్దీ లేని సమయంలోనే వెళ్లడం బెటరనే ఆలోచన...ఇంకా ఇంకా...కారణాలు ఏమైనా కానీ తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగుతూనే ఉంది

ప్రతి వీకెండ్ భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?

ఫిబ్రవరి 20 గురువారం రోజు మొత్తం 12 కంపార్ట్ మెంట్స్ లో భక్తులు వేచి చూస్తున్నారు. 

ఉచిత దర్శం క్యూ లైన్ల్లోకి ఎలాంటి టికెట్ లేకుండా వెళ్లిన భక్తులకు దాదాపు 14 గంటలు సమయం పట్టేస్తోంది.

300 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సమయం మూడు నుంచి నాలుగు గంటలు

టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలు పట్టేస్తోందని టీటీడీ అధికారులు వెల్లడించారు

ఫిబ్రవరి 19 బుధవారం రోజు తిరుమల శ్రీవారిని మొత్తం 72 వేల 745 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24 వేల 156 మంది భక్తులు  తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు.

Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 

శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం ( Sri Venkateshwara Panchaka Stotram )

శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం
శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |
శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ-
-న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |
చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

నందగోపనందనం సనందనాదివందితం
కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |
నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

నాగరాజపాలనం భోగినాథశాయినం
నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |
నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం-
-విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ ||  

ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |

Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: బ్లడ్ మూన్ వినాశనానికి సంకేతమా? రానున్న 41 రోజుల్లో ఇరాన్ 100ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందా?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: బ్లడ్ మూన్ వినాశనానికి సంకేతమా? రానున్న 41 రోజుల్లో ఇరాన్ 100ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందా?
March 2026 Monthly Horoscope: మేషం నుంచి మీనం వరకు.. 2026 మార్చిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి!
మేషం నుంచి మీనం వరకు.. 2026 మార్చిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget