Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సూపర్-8 ఆఖరి పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ), ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) త్వరగానే పెవిలియన్ చేరడంతో 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ టైంలో సంజూ శాంసన్ ( Sanju Samson ) చెలరేగిపోయాడు. ఫామ్లో లేడన్న విమర్శలకు తన బ్యాట్తోనే సమాధానం చెబుతూ, కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav )తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన సంజూ, ఆ తర్వాత తిలక్ వర్మ ( Tilak Verma )తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
చివరి 2 ఓవర్లలో 17 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. షమార్ జోసెఫ్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ (17) అవుట్ అవ్వడంతో టెన్షన్ పెరిగింది. ఆఖరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా.. సంజూ శాంసన్ వరుసగా 6, 4 బాది భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన సంజూ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ విజయంతో విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్ సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది.























