జూలై నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కేవలం 15.25 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా చేయబడింది. కొన్ని జిల్లాల్లో నమోదు సున్నాగా ఉంది, ఇది ఆందోళన కలిగిస్తోంది.
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్లైన్.. ఎల్నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
ఏపీలో పంటల బీమా నమోదు నత్తనడకన సాగుతోంది. 3 రోజుల్లో గడువు ముగుస్తున్నందున అధికారులు రైతులకు అవగాహన కల్పించి, నమోదు పెంచి కరవు నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

- ఏపీలో పంటల బీమా నమోదు ప్రక్రియ మందకొడిగా, గడువు సమీపిస్తోంది.
- రాయలసీమలో మెరుగైన నమోదు, ఇతర జిల్లాల్లో అవగాహన కొరత ఉంది.
- ఎల్నినో ముప్పు దృష్ట్యా, ప్రభుత్వం తక్షణమే అవగాహన పెంచాలి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ పంటల బీమా నమోదు ప్రక్రియలో జోరు కనిపించడం లేదు. పంటల బీమా నమోదు ముగియడానికి మరో 3 రోజులే గడువు (జులై నెలాఖరు వరకు) ఉన్నప్పటికీ, పలు జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం మారలేదు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 15.25 లక్షల ఎకరాలకు మాత్రమే 2 బీమా పథకాల కింద ప్రీమియం చెల్లించారు. కొన్ని జిల్లాలు, మండలాల్లో పంటల బీమా (Pradhan Mantri Fasal Bima Yojana - PMFBY) నమోదు సున్నా(0)గా ఉందని అధికారులు గుర్తించారు.
రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం తద్వరా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నప్పటికీ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం రైతులకు అంతగా సూచనలు చేయడం లేదని వినిపిస్తోంది. వ్యవసాయ శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రైతులను ప్రోత్సహిస్తే, వారు పంటల బీమా నమోదు చేసుకుంటారు. తద్వారా కరవు ముప్పు వచ్చినా రైతులకు నష్టపరిహారం లభించి ఆసరాగా నిలుస్తుంది.
రాయలసీమ ముందంజ.. తీరప్రాంత జిల్లాల్లో అత్యల్పం
రాష్ట్రంలో నమోదైన మొత్తం 15.25 లక్షల ఎకరాల బీమాలో ఒక్క కర్నూలు, అనంతపురం జిల్లాల వాటానే 60% ఉంది. నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో నమోదు కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ, మిగిలిన జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా (PMFBY) కింద 12 జిల్లాల్లో సగటున వెయ్యి ఎకరాలు కూడా పంటల బీమాకు నమోదు చేసుకోలేదు. సవరించిన వాతావరణ ఆధారిత బీమా (WBCIS) కింద 9 జిల్లాల్లో సగటున 500 ఎకరాల్లో కూడా బీమా చేయకపోవడం ఆందోళన పెంచుతోంది.
తక్కువ ప్రీమియం ఉన్నా ఆసక్తి చూపని రైతులు
ఖరీఫ్లో వరి, వేరుశనగ, కంది, పత్తి, మిరప, మినుము, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా సాగవుతున్నప్పటికీ ప్రీమియం తక్కువగా ఉన్న చోట్ల కూడా రైతులు బీమా చేయడం లేదు. ఉదాహరణకు ఎకరా మిరపకు కేవలం రూ.360, ఓ జిల్లాలో ఎకరా కందికి రూ.36, కోనసీమ జిల్లాలో ఎకరా వరికి రూ.76 మాత్రం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అయినప్పటికీ అవగాహన లేకపోవడంతో రైతులు పంటలకు బీమా చేయించడం లేదు. వరి ఎక్కువగా సాగయ్యే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట బీమా నమోదు చాలా తక్కువగా నమోదైంది. ఖరీఫ్ సాధారణ పంటలకు జులై నెలాఖరు వరకు, వరి పంటకు ఆగస్టు 15 వరకు గడువు ఉంది. కనుక ఏపీ ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవగాహనా కల్పించి, పంటల బీమా వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే ఈ ఏడాది వ్యవసాయరంగంపై ఎల్నినో ప్రభావం అధికంగా ఉండనుందని అధికారులు అంచనా వేశారు.
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ పంటల బీమా నమోదు ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
రైతులు పంటల బీమా చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
వ్యవసాయ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించడంలో విఫలమవడం, ప్రజాప్రతినిధుల సూచనలు లేకపోవడం ప్రధాన కారణాలు. తక్కువ ప్రీమియం ఉన్నా, అవగాహన లేకపోవడంతో రైతులు బీమా చేయడం లేదు.
ఏ జిల్లాల్లో పంటల బీమా నమోదు మెరుగ్గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది?
రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం వంటివి 60% వాటాతో ముందంజలో ఉన్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా వంటి తీరప్రాంత జిల్లాల్లో నమోదు చాలా తక్కువగా ఉంది.
ఈ సంవత్సరం పంటల బీమా ఎందుకు ముఖ్యమైనది?
ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. బీమా చేసుకుంటే కరవు ముప్పు వచ్చినా రైతులకు నష్టపరిహారం లభిస్తుంది.
ఖరీఫ్ పంటల బీమా నమోదుకు చివరి గడువు ఎప్పుడు?
సాధారణ ఖరీఫ్ పంటలకు జులై నెలాఖరు వరకు గడువు ఉంది. వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు నమోదు చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు























