అన్వేషించండి

Tirumala : తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!

Tirumala: తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాను.. అయినా కష్టం తీరలేదు అనుకునేవారున్నారు. అయితే కొన్ని యాత్రలు చేసినప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలుంటాయి..వాటిని పాటిస్తేనే ఫలితం ఆశించాలి..

Never Make These Mistakes at Tirumala:  కలియుగప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించుకున్నాను..జన్మ ధన్యం అనుకుంటారు. మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లేవారు కొందరు, కష్టం చెప్పుకుని తీరుతుందనే ఆశతో వెళ్లేవారు ఇంకొందరు, శ్రీ వేంకటేశ్వరస్వామిపై చూసి పులకించిపోయేందుకు వెళ్లొచ్చేవారు మరికొందరు. కారణం ఏదైనా శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడిపోతుంటుంది. అయితే వేంకటేశ్వరస్వామి కరుణాకటాక్షాలు మీపై ఉండాలంటే అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ముఖ్యంగా ఈ నాలుగు తప్పులు చేయకూడదు. అప్పుడే శ్రీవారి కరుణ మీపై ఉంటుందంటారు పండితులు.. ఆ నాలుగు తప్పులేంటో తెలుసుకుందాం..

వరాహస్వామి దర్శనమే ముందు

సాధారణంగా తిరుమలకు వెళ్లే చాలామంది భక్తులు చేసే మొదటి తప్పు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లిపోతారు. వాస్తవానికి వరాహస్వామి దర్శనం చేసుకోకుండా శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోకూడదు. ఎందుకంటే తిరుమల క్షేత్రం శ్రీనివాసుడిది కాదు..వరాహస్వామిది. అక్కడ స్వామివారు కొలువైనప్పుడు వరాహస్వామికి మూడు వాగ్ధానాలు చేసి ప్రమాణపత్రం కూడా రాసిచ్చారు. మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం నీకే ఇస్తానని మాటిస్తూ ఆ శాసనంలో ఉంది. అందుకే అర్చకస్వాములు మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహస్వామికే అర్పిస్తారు. కానీ భక్తులు చాలామంది వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుడిని చూసి తరిస్తున్నారు.  

వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ
దర్శాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న  తృప్యతి
 
వరాహస్వామి కన్నా ముందు వచ్చిన నన్ను దర్శించుకుంటే దానికి ఫలితం ఉండదని ఈ శ్లోకం అర్థం.

తమిళులు వరాహా స్వామిని జ్ఞానం ఇచ్చేవాడుగా భావిస్తారు.. శరీరంలో ఉన్న అన్నమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం అని ఉంటాయి. వరహాస్వామి దర్శనంతో  జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆనందకోశంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం సాధ్యమవుతుందని అర్థం. అందుకే వరాహస్వామిని చూడకుండా వెళ్లేవారికోసమే అన్నట్టు...తిరుమల ఆలయంలో లోపల దర్శనానికి వెళ్లినప్పుడు ఓ స్తంభంపై వరాహస్వామి కనిపిస్తారు. 

Also Read: శ్రావణమాసంలో 4 శుక్రవారాలు ఎలా పూజ చేయాలి - వరలక్ష్మీ వ్రతం రోజు కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి!

లౌకిక సుఖాలకోసం తిరుమల వెళ్లొద్దు

అత్యంత పవిత్రమైన తిరుమలకు లౌకిక సుఖాల కోసం ఎప్పుడూ వెళ్లకూడదు. అందుకే పెళ్లి జరిగితే ఆరు నెలల పాటూ  పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే పెళ్లైన తర్వాత ఆ వ్యామోహం నుంచి బయటపడేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది. అందుకే ఈ నియమం. ఇది కేవలం భక్తులకే కాదు..వేంకటేశ్వరుడు కూడా పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత ఆరు నెలల పాటూ కొండకిందనున్న అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉండిపోయారు. ఆ తర్వాతే కొండెక్కారు..

దొంగ దర్శనాలు చేసుకోకండి

తిరుమలలో చాలామంది చేసే మూడోతప్పు దొంగ దర్శనాలు. దేవస్థానం పెట్టిన నియమాలను గాలికి వదిలేసి వేర్వేరు లెటర్లు తీసుకొచ్చి దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండబోదు. ఎన్నిసార్లు, ఎంతసేపు దర్శించుకున్నాం అనికాదు..మనసు పవిత్రంగా ఉందోలేదో అన్నదే ముఖ్యం.  

మాడవీధుల్లో పాదరక్షలతో తిరగకండి 

తిరుమలకు వెళ్లే భక్తులు ఇలా చేయకండి అంటూ రామానుజులు ఓ రెండు విషయాలు చెబుతూ శాసనం చేశారు. ముఖ్యంగా తిరుమల మాడవీధుల్లో పాదరక్షలతో నడవకూడదు. వాస్తవానికి కొండమొత్తం శాలగ్రామశిల. కొండమొత్తం చెప్పుల్లేకుండా తిరగడం సాధ్యంకాకపోయినా మాడవీధుల్లో చెప్పులు వేసుకోవద్దు. కొండపై ప్రతి పూవూ స్వామికే అంకితం. అందుకే స్వామివారి వాడిన పూలు కూడా తీసి ఎవ్వరికీ ఇవ్వరు. అయినప్పటికీ అక్కడ పూలు అమ్మేస్తున్నారు, కొనుక్కుని పెట్టేసుకుంటున్నారు...కానీ కొండపై పూలు పెట్టుకోకూడదు.. ఆ ప్రదేశంలో ప్రతికుసుమం స్వామివారి సొంతం..
 
ఈ తప్పులు చేయకుండా పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి...

Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Kiran Abbavaram: 'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Kiran Abbavaram: 'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Samsung A56: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
Embed widget