అన్వేషించండి

Tirumala : తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!

Tirumala: తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాను.. అయినా కష్టం తీరలేదు అనుకునేవారున్నారు. అయితే కొన్ని యాత్రలు చేసినప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలుంటాయి..వాటిని పాటిస్తేనే ఫలితం ఆశించాలి..

Never Make These Mistakes at Tirumala:  కలియుగప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించుకున్నాను..జన్మ ధన్యం అనుకుంటారు. మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లేవారు కొందరు, కష్టం చెప్పుకుని తీరుతుందనే ఆశతో వెళ్లేవారు ఇంకొందరు, శ్రీ వేంకటేశ్వరస్వామిపై చూసి పులకించిపోయేందుకు వెళ్లొచ్చేవారు మరికొందరు. కారణం ఏదైనా శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడిపోతుంటుంది. అయితే వేంకటేశ్వరస్వామి కరుణాకటాక్షాలు మీపై ఉండాలంటే అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ముఖ్యంగా ఈ నాలుగు తప్పులు చేయకూడదు. అప్పుడే శ్రీవారి కరుణ మీపై ఉంటుందంటారు పండితులు.. ఆ నాలుగు తప్పులేంటో తెలుసుకుందాం..

వరాహస్వామి దర్శనమే ముందు

సాధారణంగా తిరుమలకు వెళ్లే చాలామంది భక్తులు చేసే మొదటి తప్పు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లిపోతారు. వాస్తవానికి వరాహస్వామి దర్శనం చేసుకోకుండా శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోకూడదు. ఎందుకంటే తిరుమల క్షేత్రం శ్రీనివాసుడిది కాదు..వరాహస్వామిది. అక్కడ స్వామివారు కొలువైనప్పుడు వరాహస్వామికి మూడు వాగ్ధానాలు చేసి ప్రమాణపత్రం కూడా రాసిచ్చారు. మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం నీకే ఇస్తానని మాటిస్తూ ఆ శాసనంలో ఉంది. అందుకే అర్చకస్వాములు మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహస్వామికే అర్పిస్తారు. కానీ భక్తులు చాలామంది వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుడిని చూసి తరిస్తున్నారు.  

వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ
దర్శాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న  తృప్యతి
 
వరాహస్వామి కన్నా ముందు వచ్చిన నన్ను దర్శించుకుంటే దానికి ఫలితం ఉండదని ఈ శ్లోకం అర్థం.

తమిళులు వరాహా స్వామిని జ్ఞానం ఇచ్చేవాడుగా భావిస్తారు.. శరీరంలో ఉన్న అన్నమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం అని ఉంటాయి. వరహాస్వామి దర్శనంతో  జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆనందకోశంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం సాధ్యమవుతుందని అర్థం. అందుకే వరాహస్వామిని చూడకుండా వెళ్లేవారికోసమే అన్నట్టు...తిరుమల ఆలయంలో లోపల దర్శనానికి వెళ్లినప్పుడు ఓ స్తంభంపై వరాహస్వామి కనిపిస్తారు. 

Also Read: శ్రావణమాసంలో 4 శుక్రవారాలు ఎలా పూజ చేయాలి - వరలక్ష్మీ వ్రతం రోజు కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి!

లౌకిక సుఖాలకోసం తిరుమల వెళ్లొద్దు

అత్యంత పవిత్రమైన తిరుమలకు లౌకిక సుఖాల కోసం ఎప్పుడూ వెళ్లకూడదు. అందుకే పెళ్లి జరిగితే ఆరు నెలల పాటూ  పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే పెళ్లైన తర్వాత ఆ వ్యామోహం నుంచి బయటపడేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది. అందుకే ఈ నియమం. ఇది కేవలం భక్తులకే కాదు..వేంకటేశ్వరుడు కూడా పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత ఆరు నెలల పాటూ కొండకిందనున్న అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉండిపోయారు. ఆ తర్వాతే కొండెక్కారు..

దొంగ దర్శనాలు చేసుకోకండి

తిరుమలలో చాలామంది చేసే మూడోతప్పు దొంగ దర్శనాలు. దేవస్థానం పెట్టిన నియమాలను గాలికి వదిలేసి వేర్వేరు లెటర్లు తీసుకొచ్చి దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండబోదు. ఎన్నిసార్లు, ఎంతసేపు దర్శించుకున్నాం అనికాదు..మనసు పవిత్రంగా ఉందోలేదో అన్నదే ముఖ్యం.  

మాడవీధుల్లో పాదరక్షలతో తిరగకండి 

తిరుమలకు వెళ్లే భక్తులు ఇలా చేయకండి అంటూ రామానుజులు ఓ రెండు విషయాలు చెబుతూ శాసనం చేశారు. ముఖ్యంగా తిరుమల మాడవీధుల్లో పాదరక్షలతో నడవకూడదు. వాస్తవానికి కొండమొత్తం శాలగ్రామశిల. కొండమొత్తం చెప్పుల్లేకుండా తిరగడం సాధ్యంకాకపోయినా మాడవీధుల్లో చెప్పులు వేసుకోవద్దు. కొండపై ప్రతి పూవూ స్వామికే అంకితం. అందుకే స్వామివారి వాడిన పూలు కూడా తీసి ఎవ్వరికీ ఇవ్వరు. అయినప్పటికీ అక్కడ పూలు అమ్మేస్తున్నారు, కొనుక్కుని పెట్టేసుకుంటున్నారు...కానీ కొండపై పూలు పెట్టుకోకూడదు.. ఆ ప్రదేశంలో ప్రతికుసుమం స్వామివారి సొంతం..
 
ఈ తప్పులు చేయకుండా పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి...

Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget