అన్వేషించండి

Hyderabad Hanuman Temple :పూజారి రంగరాజన్ పై దాడి..ఇప్పుడు శివ లింగం వెనుక మాంసం ముద్దలు - అసలేం జరుగుతోంది!

Hyderabad Temple: హైదరాబాద్ లో హనుమాన్ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దలు కనిపించడంతో భక్తులు ఆందోళనకు దిగారు...

Hyderabad Hanuman Temple : హైదరాబాద్ పరిధిలోని ఓ ఆలయంలో మాంసం ముద్దలు కనిపించడం కలకలం రేపుతోంది. భక్తుల నుంచి సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో టప్పాచబుత్ర హనుమాన్ ఆలయంలో జరిగిందీ ఘటన. 

నిత్య పూజలో భాగంగా ఫిబ్రవరి 12 బుధవారం ఉదయం ఆలయాన్ని తెరిచారు. అనంతరం పూజలు నిర్వహించేందుకు వచ్చిన భక్తులు శివ లింగం వెనుక మాంసం ముద్దలు చూసి అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆలయ పూజారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న హిందూసంఘాల కార్యకర్తలు ఆలయానికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Hyderabad Hanuman Temple :పూజారి రంగరాజన్ పై దాడి..ఇప్పుడు శివ లింగం వెనుక మాంసం ముద్దలు - అసలేం జరుగుతోంది!

Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!

ఆలయం పరిసర ప్రాంతం మొత్తం పోలీసులు,భక్తులు, హిందూ సంఘాలతో నిండిపోయాయి. ఎవరో కావాలనే ఇదంతా చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఇలా చేశారని మండిపడుతున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు పోలీసులు. 

ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..కమిషనర్ ఈ కేసును ప్రత్యేకంగా చూడాలని కోరారు. పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సీసీ ఫుటేజ్ పరిశీలించి ఇలాంటి ఘటనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  

అయితే చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరగా అందుకు నిరాకరించారు రంగరాజన్. ఆయనతో పాటూ కుమారుడిని సైతం కొట్టారు. ఈ ఘటన ఓ వైపు కొనసాగుతోంది లేటెస్ట్ గా శివలింగం వెనుక మాంసం ముద్దలు వెలుగుచూశాయ్. దీంతో అసలేం జరుగుతోందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయ్..

Also Read:  ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!

భక్త కన్నప్ప పరమేశ్వరుడికి మాంసం నైవేద్యంగా సమర్పించాడు కదా..

నోటితో నీళ్లు తీసుకొచ్చి శివలింగంపై అభిషేకం చేశాడు

కాలిని శివలింగంపై పెట్టి..తన కన్ను తీసి అమర్చాడు..

తనని భక్త కన్నప్ప అన్నప్పుడు...ఇప్పుడు శివయ్యకి మాంసం పెడితే ఎందుకు తప్పుపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయ్...

అయితే...

భక్తి - మూర్ఖత్వం ఈ రెండింటికీ వ్యత్యాసం తెలుసుకుంటే ఈ ప్రశ్న అడగరేమో..!

భక్త  కన్నప్పకి భక్తి తప్ప మరొకటి తెలియదు..తను ఏం చేసినా శివుడిపై భక్తితోనే చేశాడు. అమాయకత్వంతో శివుడిని ఇంటికి రమ్మని పిలిచి రాకపోవడంతో అలిగి అక్కడే ఉండిపోయి శివయ్యకు సపర్యలు చేశాడు. శివలింగం ఉన్న ప్రదేశాన్ని నిత్యం శుభ్రం చేశాడు. నోటితో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేశాడు. ఆ పక్కనే ఉన్న ఆకులను శివుడికి సమర్పించాడు..అవే బిల్వ పత్రాలు. వేటాడి తీసుకొచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. చివరకు కంట రక్తం కారుతుంటే తన కన్ను తీసి అమర్చాడు. 

ఇదంతా తిన్నడి అపరిమిత భక్తి మాత్రమే...అందులో ఎలాంటి మూర్ఖత్వం  లేదు...

కానీ..ఇప్పుడు జరిగిన చర్య కేవలం మూర్ఖత్వం కాక మరేంటి. సాధారణంగా మాంసాహారం తిన్న రోజున ఆలయానికి వెళ్లరు, ఆ రోజు కనీసం ప్రసాదం కూడా తీసుకోరు కొందరు. అలాంటిది నేరుగా పవిత్రమైన అలయంలోకి మాంసాహారాన్ని ఎలా తీసుకెళ్తారన్నదే హిందూ సంఘాల వాదన.

మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించే ఆలయాలూ ఉన్నాయి..కానీ..ప్రతి ఆలయానికి కొన్ని నియమాలుంటాయి..భక్తులు వాటిని పాటించాలి. అధిగమిస్తే ఇలానే ఆందోళనలు జరుగుతాయ్...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget