అన్వేషించండి

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

Konaseema Gas Blowout : ఇరుసుమండలో ఓఎన్జీసీ పైప్‌లైన్ లీక్‌తో ఎగసిన మంటలు కాస్త తగ్గుముఖం పట్టాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Konaseema Gas Blowout : కోనసీమ వాసులను నిదుర లేకుండా చేసిన ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్‌ బ్లోఔట్‌ అదుపులోకి వస్తోంది. మలికీపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన అగ్ని కీలలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అయితే ఓఎన్జీసీ సిబ్బంది, ప్రభుత్వం యంత్రాంగం సమన్వయంతో చేసిన పోరాటం ఫలితంగా మంటలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. 

ఒక వైపు ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడుతున్న మంటలు, మరోవైపు భూమి నుంచి వణికించే శబ్దాల మధ్య కోనసీమ వాసులు గడిపిన క్షణాలు వర్ణనాతీతం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాలు, అత్యాధునిక సాంకేతికత వినియోగం ప్రాణ నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించాయి. 

సాంకేతిక పోరాటం- వాటర్‌ అంబరిల్లాతో మంటలకు చెక్ 

మంటలను అదుపు చేసేందుకు ఓఎన్‌జీసీ అధికారులు అత్యంత క్లిష్టమైన వాటర్‌ అంబరిల్లా సాంకేతికతను వినియోగించారు. మంటలు వ్యాపించకుండా నాలుగు వైపుల నుంచి నీటి గొడుగు ఆకారంలో విరజిమ్మడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నం చేశారు. 
ఈ ఆపరేషన్ కోసం అవసరమైన భారీ యంత్ర సామగ్రి, పైప్‌లైన్‌లను యుద్ధ ప్రాతిపదికన నరసాపురం నుంచి తరలించారు. అదనంగా మరో పైప్‌ను అమర్చి, మంటలను మరింత త్వరగా ఆర్పివేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో ఉండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. 

ముఖ్యమంత్రి సమీక్ష- బాధితులకు భరోసా 

ఈ ప్రమాద తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి అనిత, సీఎస్‌ విజయానంద్‌ ఆయనకు వివరించారు. ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వారిలో ధైర్యం నింపాలని సీఎం ఆదేశించారు. 

ప్రమాదం కారణంగా ఇళ్లు వదిలి వెళ్లిన వారు సమస్య పూర్తిగా తీరే వరకు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మంటల వేడికి దెబ్బ తిన్న కొబ్బరి తోటలకు పరిహారం అందించాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని, ఓఎన్జీసీతో త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

పునరావాస చర్యలు- క్షేత్రస్థాయి పరిస్థితి 

ప్రమాదం జరిగిన వెంటనే సుమారు 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాల్లోకి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ కేంద్రాల్లో బాధితులకు అవసరమైన ఆహారం, తాగు నీరు, వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వృద్ధులు, గర్భిణులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 

పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అమలాపురం ఎంపీ హరీష్‌ మాధుర్‌ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ప్రతి నిమిషం అప్‌డేట్స్ తీసుకొంటున్నారని వెల్లడించారు. సోమవారం రాత్రి భద్రతా కారణాల దృష్ట్యా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలకు చీకటిలో భయం భయంగా గడిపారు. 

ఓఎన్‌జీసీపై స్థానికుల ఆగ్రహం 

మంటలు తగ్గుతున్నప్పటికీ ఓఎన్‌జీసీ వ్యవహార శైలిపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ... సహజ వాయువు వెలికి తీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ప్రమాదం జరిగినప్పుడు స్థానికులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఓఎన్‌జీసీ వైఫల్యమేనని విమర్శించారు. ఓఎన్‌జీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగిందని ఆరోపించారు. 

రైతులకు అపార నష్టం 

ఈ బ్లౌఔట్ కారణంగా ఇరుసుమండ గ్రామంలోని వందల కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. అలాగే సాగుకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లోని నీరు మంటల వేడికి ఇంకిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పచ్చని కోనసీమలో ఈ నిప్పుల సెగ ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Embed widget