అన్వేషించండి

Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !

Hyderabad Crime News: హైదారాబాద్‌ పూరానాపూల్‌ ధర్వాజా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పోలీసుల లాఠీ ఛార్జ్‌తో సద్దుమణిగింది.

Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో జనమంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఉన్న వాళ్లంతా పండగ జోష్‌లో ఉన్నారు. ఈ టైంలో పాతబస్తీలో అలజడి రేగింది. పోలీసులు జోక్యం చేసుకొని లాఠీచార్జ్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అక్కడి వాతావరణం అదుపులోనే ఉందని పోలీసులు ప్రకటించారు.  

హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో అర్థరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  స్వల్ప వివాదమే తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు. కొట్టుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. కానీ ఇరు వర్గాలు ఎవరూ వినే పరిస్థితి కనిపించలేదు. ఇంకా వివాదం పెరుగుతోందని గ్రహించిన పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.  

పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీ ఛార్జ్ చేశారు. వారి నుంచి కూడా ప్రతిదాడి ప్రారంభమైంది. వాళ్లు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పోలీసులకు ప్రజలకు కూడా గాయాలు అయ్యాయి. కాసేపటికి పోలీసులు పరిస్థితిని అదుపు చేయగలిగారు. అక్కడ గొడవ పడుతున్న వారిని చెదరగొట్టి వాతావరణాన్ని శాంతింపజేశారు. 
 
అర్ధరాత్రి జరిగిన గొడవ సద్దుమణిగినా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలోని రహదార్లు మూసివేశారు. కొత్త వాళ్లు ఆ ప్రాంతంలోకి రాకుండా కట్టడి చేశారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిరంతరం అక్కడి పరిస్థితి తెలుసుకొని ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.  

పురానాపూల్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు ప్రకటించారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదని, ప్రజలు కంగారు పడొద్దని తెలిపారు. వదంతులు నమ్మొద్దని సూచించారు. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కామెంట్స్, పోస్టులు పెట్టొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget