అన్వేషించండి

Jagan: కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం - బిల్లులు, బెట్టింగ్ బాధితుల భయమా ?

YSRCP: కార్యకర్తల వద్దకు వెళ్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎందుకో వైసీపీ నేతలకు క్లారిటీ ఉంది. కానీ చెప్పడం లేదు.

Jagan announced that he will go to the activists, is now silent: చంద్రబాబు పాలన మోసాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తాను సమావేశం అయ్యే..తనతో సమవేశం అయ్యే వైసీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందరూ ప్రజల్లోనే ఉండాలని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ప్రకటించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా లేరు. కొద్ది రోజుల కిందట జగన్ “ కార్యకర్తలతో జగనన్న - భవిష్యత్ కు దిశానిర్దేశం” పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. సంక్రాంతి అయిపోగానే కార్యకర్తల వద్దకు వస్తానని చెప్పారు.  అందర్నీ కలుస్తానని వివరించారు.  జగన్ చెప్పిన తీరుతో  కార్యకర్తలు చాలా మంది ఆయన నిజంగానే వస్తారనుకున్నారు. కానీ జగన్ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. 

కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం ప్రస్తుతానికి నిలిపివేత

పార్టీని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్.. జిల్లాల అధ్యక్షుల్ని నియమించే ప్రయత్నం చేశారు. అయితే నియమితులైన చాలా మంది అట్టరహాసంగా ప్రమాణం చేశారు కానీ ఎవరూ యాక్టివ్ గా లేరు. కింది స్థాయి వరకూ పార్టీని నిర్మాణం చేయాలని జగన్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఓ లేయర్ లో కూడా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయలేదు. అదే సమయంలో సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ చాలా మంది సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారు. వారు సహకరించకపోతే కార్యకర్తలతో సమావేశాలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. 

ఆర్థిక సమస్యల్లో కార్యకర్తలు - జగన్ పై అసంతృప్తి 

వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గానికి వెళ్లినప్పుడు  కార్యకర్తలను కలవడానికే తంటాలు పడుతున్నారు. వచ్చిన వారంతా బిల్లులు సారూ అంటున్నారు.కోట్లు ఖర్చు పెట్టి పనులు చేశారు కానీ  ఇప్పుడు బిల్లులు రావడం లేదు. మరో వైపు పార్టీని నమ్ముకుని బెట్టింగులు కాసి నష్టోయామని ఆదుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. వీరు ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటారని ఇలాంటి వారు చేసే అలజడితో మీడియా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అతి పార్టీకి మరింత డ్యామేజీ చేస్తుందన్న ఉద్దేసంతో  జగన్ ఆగిపోయారని అంటున్నారు. జగన్ ఎంతో కొంత సాయం చేస్తారని  కార్యకర్తల నుంచి ఇఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని తగ్గించిన తర్వాత జగన్  జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు . అధికారం వచ్చిన ఐదేళ్లలో జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదని ఇటీవల అంగీకరిస్తున్నారు. జగన్ 2.0లో కార్యకర్తల కేసమే పని చేస్తానంటున్నారు. అయితే ఈ  ప్రకటనకు అంత కదలిక లేదని వైసీపీ వర్గాలు అంచనాకు వచ్చాయి. 

ప్రభుత్వంపై ఇంకా అసంతృప్తి ప్రారంభం కాలేదన్న భావన

మరో వైపు ప్రభుత్వంపై ఎంతో కొంత అసంతృప్తి ప్రజల్లో ప్రారంభమైతే.. జగన్ పర్యటనలకు స్పందన కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే   జగన్ పాలనపైనే ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతూండటంతో వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో ఏదో జరిగిందని కూటమి ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోందని ..దాన్ని తిప్పికొట్టాలని జగన్ పార్టీ నేతలకు అంటున్నారు. అంటే ప్రజలు ఇంకా కూటమి చెప్పేదే వింటున్నారి.. ఆ పరిస్థితి మారే వరకూ ఎదురుచూడటం మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జగన్ కార్యకర్తల్లోకి వెళ్లే అంశంపైనా  ముందూ వెనుకాడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy on Potti Sriramulu: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Vijayashanti: ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Potti Sriramulu: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Vijayashanti: ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
War 2 Movie Release Date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
Samantha : నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
Embed widget