అన్వేషించండి

Jagan: కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం - బిల్లులు, బెట్టింగ్ బాధితుల భయమా ?

YSRCP: కార్యకర్తల వద్దకు వెళ్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎందుకో వైసీపీ నేతలకు క్లారిటీ ఉంది. కానీ చెప్పడం లేదు.

Jagan announced that he will go to the activists, is now silent: చంద్రబాబు పాలన మోసాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తాను సమావేశం అయ్యే..తనతో సమవేశం అయ్యే వైసీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందరూ ప్రజల్లోనే ఉండాలని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ప్రకటించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా లేరు. కొద్ది రోజుల కిందట జగన్ “ కార్యకర్తలతో జగనన్న - భవిష్యత్ కు దిశానిర్దేశం” పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. సంక్రాంతి అయిపోగానే కార్యకర్తల వద్దకు వస్తానని చెప్పారు.  అందర్నీ కలుస్తానని వివరించారు.  జగన్ చెప్పిన తీరుతో  కార్యకర్తలు చాలా మంది ఆయన నిజంగానే వస్తారనుకున్నారు. కానీ జగన్ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. 

కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం ప్రస్తుతానికి నిలిపివేత

పార్టీని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్.. జిల్లాల అధ్యక్షుల్ని నియమించే ప్రయత్నం చేశారు. అయితే నియమితులైన చాలా మంది అట్టరహాసంగా ప్రమాణం చేశారు కానీ ఎవరూ యాక్టివ్ గా లేరు. కింది స్థాయి వరకూ పార్టీని నిర్మాణం చేయాలని జగన్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఓ లేయర్ లో కూడా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయలేదు. అదే సమయంలో సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ చాలా మంది సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారు. వారు సహకరించకపోతే కార్యకర్తలతో సమావేశాలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. 

ఆర్థిక సమస్యల్లో కార్యకర్తలు - జగన్ పై అసంతృప్తి 

వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గానికి వెళ్లినప్పుడు  కార్యకర్తలను కలవడానికే తంటాలు పడుతున్నారు. వచ్చిన వారంతా బిల్లులు సారూ అంటున్నారు.కోట్లు ఖర్చు పెట్టి పనులు చేశారు కానీ  ఇప్పుడు బిల్లులు రావడం లేదు. మరో వైపు పార్టీని నమ్ముకుని బెట్టింగులు కాసి నష్టోయామని ఆదుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. వీరు ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటారని ఇలాంటి వారు చేసే అలజడితో మీడియా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అతి పార్టీకి మరింత డ్యామేజీ చేస్తుందన్న ఉద్దేసంతో  జగన్ ఆగిపోయారని అంటున్నారు. జగన్ ఎంతో కొంత సాయం చేస్తారని  కార్యకర్తల నుంచి ఇఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని తగ్గించిన తర్వాత జగన్  జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు . అధికారం వచ్చిన ఐదేళ్లలో జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదని ఇటీవల అంగీకరిస్తున్నారు. జగన్ 2.0లో కార్యకర్తల కేసమే పని చేస్తానంటున్నారు. అయితే ఈ  ప్రకటనకు అంత కదలిక లేదని వైసీపీ వర్గాలు అంచనాకు వచ్చాయి. 

ప్రభుత్వంపై ఇంకా అసంతృప్తి ప్రారంభం కాలేదన్న భావన

మరో వైపు ప్రభుత్వంపై ఎంతో కొంత అసంతృప్తి ప్రజల్లో ప్రారంభమైతే.. జగన్ పర్యటనలకు స్పందన కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే   జగన్ పాలనపైనే ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతూండటంతో వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో ఏదో జరిగిందని కూటమి ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోందని ..దాన్ని తిప్పికొట్టాలని జగన్ పార్టీ నేతలకు అంటున్నారు. అంటే ప్రజలు ఇంకా కూటమి చెప్పేదే వింటున్నారి.. ఆ పరిస్థితి మారే వరకూ ఎదురుచూడటం మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జగన్ కార్యకర్తల్లోకి వెళ్లే అంశంపైనా  ముందూ వెనుకాడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget