అన్వేషించండి

TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?

TDP trap: శాసనమండలిలో కల్తీ నెయ్యిపై చర్యలో జగన్ మతాన్ని టీడీపీ సభ్యులు ప్రస్తావించిన అంశంలో సరైన విధంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఎదుర్కోలేకపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

YSRCP falls into TDP Christian trap:   శాసనమండలిలో జరిగిన పరిణామాల్లో  వైసీపీ చాలా పక్కాగా టీడీపీలో  ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. కల్తీ నెయ్యి అంశంపై చర్చలో  టీడీపీ సభ్యులు వ్యూహాత్మకంగా జగన్ మతం ప్రస్తావన తెచ్చారు. అచ్చెన్నాయుడు శాసనమండలి చైర్మన్ ను ఇంక్లూడ్ చేస్తూ మీరు..మీ నాయకుడు క్రిస్టియన్లు అని అన్నారు. దాంతో మండలి చైర్మన్ ఉలిక్కి పడ్డారు. తాను హిందువునేనని చెప్పారు. పేరుతో మోషేన్ అని ఉంటే మతం మార్చుకున్నట్లు కాదన్నారు. అయితే జగన్ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. దాంతో అచ్చెన్నాయుడు.. తాను జగన్ క్రిస్టియన్ అనే మాటకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.  

జగన్ మత ప్రస్తావనతో గందరగోళంలో వైసీపీ సభ్యులు                

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చ కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. అధికార తెలుగుదేశం పార్టీ వేసిన రాజకీయ వ్యూహంలో వైసీపీ సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు. తిరుమల పవిత్రత గురించి చర్చ జరుగుతున్న తరుణంలో, మత ప్రస్తావన తీసుకురావడం ద్వారా వైసీపీని డిఫెన్స్‌లో పడేయాలన్న టీడీపీ వ్యూహం పక్కాగా అమలు జరిగింది. సభలో లేని జగన్ మతాన్ని ప్రస్తావిస్తూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించే క్రమంలో వైసీపీ సభ్యులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.  

క్రిస్టియన్ పార్టీగా ముద్రవేసే ట్రాప్            

తిరుమల లడ్డూ వంటి అత్యంత సున్నితమైన హిం దూ సెంటిమెంట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు, వైసీపీని ఒక నిర్దిష్ట మతానికి చెందిన పార్టీగా చిత్రించాలనేది టీడీపీ ప్లాన్. అచ్చెన్నాయుడు నేరుగా జగన్ మతాన్ని ప్రస్తావించినా, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో వైసీపీ సభ్యులు విఫలమయ్యారు. దీనివల్ల ప్రజల్లోకి  వైసీపీ  అధినేత ఒక క్రిస్టియన్ అనే ముద్రను బలంగా తీసుకెళ్లే అవకాశం టీడీపీకి చిక్కినట్లయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీకి ఒక సీనియర్ దిశానిర్దేశకుడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ   తన చాకచక్యంతో సభను దారిలోకి తెచ్చేవారు. కానీ ఆయన అనారోగ్యంతో సభకు రాకపోవడంతో, టీడీపీ సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు, విమర్శలకు వైసీపీ సభ్యులు తడబడ్డారు.  

వాయిదా పడినా ఇమేజ్ డ్యామేజ్ 

పరిస్థితి విషమిస్తోందని, మతపరమైన చర్చ తమకు నష్టం చేకూరుస్తుందని గ్రహించిన వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. లడ్డూ నెయ్యి నాణ్యతపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వైసీపీ, చివరకు తమ మత గుర్తింపును కాపాడుకోవాల్సిన ఆత్మరక్షణ స్థితికి పడిపోయింది.  మండలిలో జరిగిన ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారనున్నాయి. కేవలం కల్తీ నెయ్యి చర్చకు మాత్రమే పరిమితం కాకుండా, దీన్ని ఒక మతపరమైన కోణంలోకి మళ్లించడంలో టీడీపీ విజయం సాధించింది. చట్టసభ రికార్డుల్లోనే జగన్  మతం గురించి చర్చ రావడం, దాన్ని కౌంటర్ చేయలేకపోవడం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరమైన అంశంగానే భావిస్తున్నారు.       

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
Chandrababu Naidu Cases: పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?
పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget