అన్వేషించండి

Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !

Guntur Mirchi tourism: గుంటూరు మిర్చి వీడియో టూరిజం ప్రాజెక్టుకు కారణం అవుతోంది. ఆనంద్ మహింద్రా చేసిన సూచనకు నారా లోకేష్ స్పందించారు.

Guntur Mirchi  tourism project:  గుంటూరు మిర్చి సాగు అద్భుత దృశ్యాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా , ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆసక్తికర చర్చ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.  గుంటూరు జిల్లాలో మిరపకాయలను ఆరబోసిన దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. పైనుంచి చూస్తుంటే ఎర్రటి తివాచీ పరిచినట్లున్న ఈ దృశ్యం ప్రకృతి సిద్ధమైన హోలీ రంగుల పండుగను తలపిస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ అద్భుతమైన దృశ్యాన్ని కేవలం వ్యవసాయానికే పరిమితం చేయకుండా, ఏపీ ప్రభుత్వం దీనిని ఒక పర్యాటక ఆకర్షణగా  మార్చాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. శీతాకాలంలో జరిగే ఈ పంట కోత సమయాన్ని పర్యాటక సీజన్‌గా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నేల మీద నుంచి చూస్తే ఈ అందం కనిపించకపోవచ్చని, అందుకే పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అలాగే స్థానిక సంగీత, నృత్య ప్రదర్శనలతో ఒక ఫెస్టివల్‌లా దీనిని నిర్వహించవచ్చని అద్భుతమైన ఐడియాలను ఇచ్చారు.

ఆనంద్ మహీంద్రా సూచనలపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ సానుకూలంగా సమాధానమిచ్చారు. గుంటూరు మిర్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, వేల మంది రైతుల కష్టానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రంగుల దృశ్యాన్ని పర్యాటక పరంగా ఎలా అభివృద్ధి చేయవచ్చో పరిశీలించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. మహీంద్రా ఇచ్చిన సలహాలు స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.    

అదే సమయంలో మంత్రి లోకేష్ చమత్కారంగా మరో ప్రతిపాదన కూడా చేశారు. భవిష్యత్తులో ఏపీపై డ్రోన్ విజువల్స్ తీసినప్పుడు కేవలం వ్యవసాయ క్షేత్రాలే కాకుండా.. రాష్ట్రంలో రాబోయే మహీంద్రా ఆటో ఫ్యాక్టరీ, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, ఏరోస్పేస్ పార్కులు కూడా ఆ డ్రోన్ కెమెరాల్లో కనిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పారిశ్రామికంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుతోందో ప్రపంచానికి చూపించాలనే తన ఆకాంక్షను ఆయన వెల్లడించారు. 

ఆనంద్ మహీంద్రాను స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో ఉన్న పారిశ్రామిక మరియు పర్యాటక అవకాశాలను దగ్గరుండి చూపిస్తామని లోకేష్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పారిశ్రామిక దిగ్గజం ఇచ్చిన ఐడియాకు, ఒక యువ మంత్రి స్పందించిన తీరు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Embed widget