అన్వేషించండి

Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

Council: అచ్చెన్నాయుడు చేసిన క్రిస్టియన్ వ్యాఖ్యలు మండలిలో వివాదం రేపాయి. మండలి చైర్మన్ ను క్రిస్టియన్ గా అచ్చెన్న సంబోధించారు. అయితే తాను హిందువునని మోషేన్ రాజు స్పష్టం చేశారు.

Atchannaidu Christian comments spark controversy in the council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరిగిన చర్చ తీవ్ర ఉత్కంఠకు, అనూహ్య పరిణామాలకు దారితీసింది.  శాసన మండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న చర్చను వైసీపీ సభ్యులు అడ్డుకోవడంపై ఆయన ఆవేదన చెందారు. తాను ఇక్కడ మంత్రిగా కంటే, ఒక సామాన్య వేంకటేశ్వర స్వామి భక్తునిగా మాట్లాడుతున్నానని, కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.      

ఎవరి మతాలను వారు గౌరవించుకోవడంలో తప్పు లేదన్న అచ్చన్న                                
 
ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవించాలని హితవు పలికారు.  నేను హిందువును, జగన్ మోహన్ రెడ్డి ,  చైర్మన్ మోషేన్ రాజు క్రిస్టియన్లు.. ఎవరి మతం వారి ఇష్టం, ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా కలకలం రేపాయి. తనను క్రిస్టియన్‌గా అభివర్ణించడంపై మండలి చైర్మన్ మోషేన్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.                             

తాను హిందువునని ప్రకటించిన  మోషేన్ రాజు                          
 
మంత్రి వ్యాఖ్యలకు స్పందించిన చైర్మన్ మోషేన్ రాజు తాను క్రిస్టియన్‌ను కాదని, హిందువునని సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. తన పేరులో మోషేన్ ఉన్నంత మాత్రాన మతం మార్చుకున్నట్టు కాదని ఆయన వివరించారు. చైర్మన్ నుంచి వచ్చిన ఈ స్పష్టీకరణతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తెలియక చేసిన పొరపాటుగా భావించాలని కోరారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం ఆపలేదు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.            

అయినా వైసీపీ సభ్యులు నిరసనలు ఆపకపోవడతో సభ వాయిదా 

ఈ తరుణంలో చైర్మన్ మోషేన్ రాజు వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివరణతో తాను సంతృప్తి చెందానని, వ్యక్తిగతంగా తనకే లేని అభ్యంతరం మీకు ఎందుకని ఆయన  వైసీపీ  సభ్యులనే ప్రశ్నించారు. అయినా వైసీపీ సభ్యులు ఆందోళనలు కొనసాగించారు.  లడ్డూ కల్తీపై జరగాల్సిన చర్చ కాస్తా మతపరమైన అంశాల చుట్టూ తిరగడం సభలో చర్చనీయాంశమైంది. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, చైర్మన్ స్వయంగా జోక్యం చేసుకుని సభ్యులను వారించడంతో గొడవ సద్దుమణిగింది.             

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget