అన్వేషించండి

Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!

Andhra Pradesh Latest News: వైసీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు సభ్యులు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్‌లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకటరమణ తమ పదవులకు ఇప్పటికే  రాజీనామా చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి వేదికగా ఒక ఆసక్తికరమైన పోరు మొదలైంది. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉండి, ఇప్పుడు బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు నేరుగా మండలి ఛైర్మన్‌పైనే యుద్ధం ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఇప్పుడు మండలి ఛైర్మన్‌ మోషేను‌రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహంతో ఉన్న ఈ సభ్యులు, ఛైర్మన్‌ తీరును నిరసిస్తూ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

ఎందుకు అసంతృప్తి 

వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్‌లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకటరమణ తమ పదవులకు ఇప్పటికే  రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలు సమర్పించి చాలా కాలం అవుతున్నా, మండలి ఛైర్మన్‌ వాటిని ఇంకా ఆమోదించలేదు. ఛైర్మన్‌ అనుసరిస్తున్న ఈ వైఖరిపై సదరు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజీనామాలు ఆమోదించకుండా కావాలనే పెండింగ్‌ పెండింగ్‌లో పెట్టారనేది వారి ప్రధాన ఆరోపణ. అందుకే ఆయనపై అవిశ్వాసం పెట్టి, తమ నిరసనను గట్టిగా తెలియజేయాలని వారు భావిస్తున్నారు. 

కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే కాకుండా, మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సరిపడా సంఖ్యాబలం తమకు ఉందని ఈ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ దిశగా ముందుడుగు వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని వింగా మండలి ఛైర్మన్‌పై  అవిశ్వాసం వచ్చే పరిస్థితి ఏర్పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

వైసీపీ ఫిర్యాదుతో ఛైర్మన్ విచారణ 

మరోవైపు ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఆదేశాలను దిక్కరించినందున వారిపై అనర్హ వేటు వేయాలని వైసీపీ కోరుతోంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఛైర్మన్‌ మోషేన్ రాజు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఎందుకు రాజీనామా చేశారు. వారిపై ఎవరైనా ఒత్తిడి చేశారా అనే విషయాలు  అడిగి తెలుసుకున్నారు. 

ఎమ్మెల్సీలు స్పష్టత

ఛైర్మన్‌ జరిపిన విచారణలో బల్‌లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తమ వాదనను బలంగా వినిపించారు. తాము ఎవరి ఒత్తిడినో లేదా వేరే ప్రలోభాలు లొంగి రాజీనామా చేయలేదని, తమకు నచ్చిన విధంగా స్వతహాగానే పదవుల నుంచి తప్పుకుంటున్నామని వారు తెలిపారు. అయినప్పటికీ వారి రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో ఇప్పుడు అవిశ్వాసం అనే అస్త్రాన్ని వారు సిద్ధం చేసుకున్నారు. 

Frequently Asked Questions

శాసన మండలిలో ఆసక్తికరమైన పోరు ఎక్కడ మొదలైంది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసన మండలి వేదికగా ఒక ఆసక్తికరమైన పోరు మొదలైంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ మోషేను రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్సీలు ఎందుకు మండలి ఛైర్మన్ పై అసంతృప్తిగా ఉన్నారు?

తమ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహంతో ఎమ్మెల్సీలు ఛైర్మన్ తీరును నిరసిస్తూ ఈ నిర్ణయానికి వచ్చారు.

మండలి ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎంతమంది ఎమ్మెల్సీలు మొగ్గు చూపుతున్నారు?

కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే కాకుండా, మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలి ఛైర్మన్ కు ఏమని ఫిర్యాదు చేసింది?

ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, వారిపై అనర్హ వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
GoldJewelry: బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Embed widget