ఈ పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఇది మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో గతేడాది ఇదే రోజున ప్రారంభమైంది.
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Free Bus For Women In AP: ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి బస్లో ప్రయాణించి ముచ్చటించారు.

- స్త్రీశక్తి ఉచిత బస్ పథకం ఏడాది పూర్తి, సీఎం మహిళలతో ప్రయాణం.
- పథకంతో మహిళలకు నెలకు రూ.4000 వరకు ప్రయాణ ఖర్చులు ఆదా.
- ఏడాదిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు; మహిళల వాటా 62%కి చేరింది.
Free Bus For Women In AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో గతేడాది సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైన ఈ పథకం, రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మహిళలతో కలిసి బస్లో ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.
రాయపూడి నుంచి క్యాంప్ కార్యాలయం వరకు...
విజయవాడలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడి యాక్సెస్ రోడ్డు మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ముఖ్యమంత్రి మహిళలతో కలిసి బస్లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముచ్చటించారు. పథకం ద్వారా వారికి కలుగుతున్న లబ్ధి, పొదుపు అవుతున్న నగదు గురించి ఆరా తీశారు.
చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక మహిళ, స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు 4000 వరకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయని వెల్లడించింది. ఈ పొదుపుతో తన ఆరోగ్య అవసరాలకు మందుల కొనుగోలు చేస్తున్నట్టు ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన సీఎం, ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే సంపాదనను మరింత పొదుపు చేసుకోవచ్చని సూచించారు.
నంద్యాల నుంచి వచ్చిన ఒక ముస్లిం మహిళ, ఉచిత బస్ ద్వారా తనకు నెలకు 1500 ఆదా అవుతోందని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మహిళ మాట్లాడుతూ, ముడి సరకు తేవడానికి, నేసిన చీరలు మార్కెట్కు చేరవేయడంలో ఈ పథకం తమకు వరంగా మారిందని తెలిపింది. గతంలో కేవలం భర్త మాత్రమే వ్యాపార పనులకు వెళ్లే వారని ఇప్పుడు తాము కూడా వెళ్తున్నామని ఇది ఆనందాన్నిచ్చిందని తెలిపింది.
పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదైనట్టు సీఎం తెలిపారు. సగటున రోజుకు 24 లక్షల మంది ఈ పథకం ద్వారా ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీలోని మత్తం 9, 978 బస్సుల్లో 7,631 బస్సుల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సులు ఉన్నాయి.
గతంలో బస్ ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతంగా ఉండగా, ఈ పథకం అమలు తర్వాత అది 62 శాతానికి పెరిగింది. ఈ పథకం వల్ల రహదారి ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Frequently Asked Questions
స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం పథకం ఎంతకాలం పూర్తి చేసుకుంది?
స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు నమోదైన ఉచిత ప్రయాణాలు ఎన్ని?
పథకం ప్రారంభమైన నాటి నుంచి రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. సగటున రోజుకు 24 లక్షల మంది మహిళలు దీని ద్వారా ప్రయాణిస్తున్నారు.
స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం ఏయే కేటగిరీ బస్సుల్లో అందుబాటులో ఉంది?
ఏపీఎస్ఆర్టీసీలోని 7,631 బస్సుల్లో ఈ పథకం అమలు అవుతోంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సులు దీనిలో భాగం.
స్త్రీశక్తి పథకం అమలుతో మహిళల ప్రయాణ వాటాలో వచ్చిన మార్పు ఏమిటి?
ఈ పథకం అమలు తర్వాత బస్ ప్రయాణాల్లో మహిళల వాటా గతంలో 40% ఉండగా, అది ఇప్పుడు 62%కి పెరిగింది. ఇది రహదారి ప్రమాదాల తగ్గింపునకు కూడా దోహదపడింది.
ట్రెండింగ్ వార్తలు






















