అన్వేషించండి

Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!

ఏపీ రైల్వే ప్రయాణంలో కీలక మార్పులు రానున్నాయి. విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన సిద్ధమవుతోంది. దీంతోపాటు విజయవాడ నుంచి కర్నూలుకు రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ రైలు కారిడార్ ప్రతిపాదన, ప్రయాణ సమయం తగ్గింపు.
  • విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు, రెండు గంటల్లో చేరుకునే సౌకర్యం.
  • శ్రీశైలం, గద్వాల్, అనంతపురం, దుగరాజపట్నం పోర్టులకు కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదన.

Vijayawada- Visakha High Speed Rail: ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, మారుమూల ప్రాంతాలకు, పుణ్య క్షేత్రాలకు రైలు సౌకర్యం కల్పించేలా రైల్వే శాఖ ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా బులెట్ రైళ్లు, సమీ హైస్పీడ్‌ రైళ్లు, కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైనల్‌ లొకేషన్ సర్వే కోసం రైల్వే అధికారులు బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంకానున్నాయి. 

విజయవాడ - విశాఖ మధ్య హైస్పీడ్ ప్రయాణం

రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ, విశాఖ మధ్య ప్రయాణం ఇకపై మరింత వేగంగా సాగనుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కారిడార్‌ ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ రైలు అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, అమరావతి- విజయవాడ- విశాఖ ప్రాంతాలను కలుపుతూ, భవిష్యత్తులో హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌కు అనుసంధానంకానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ కారిడార్లను కేంద్రం ప్రకటించగా అందులో ఏపీ మీదుగా వెళ్లే హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్‌- బెంగళూరు, చెన్నై - బెంగళూరు కారిడార్లతో ఇప్పుడు నాలుగో కారిడార్‌ కూడా చేరనుంది. 

విజయవాడ నుంచి కర్నూలు రెండు గంటల్లోనే...

రాయలసీమ, కోస్తా ఆంధ్రను కలిపే కీలక మార్గంలో కూడా భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి కర్నూలుకు నేరుగా వెళ్లే రైలు సౌకర్యం లేదు. ప్రయాణికులు డోన్ లేదా నంద్యాల వద్ద రైలు దిగి మరో రైలు ఎక్కాల్సి వస్తోంది. ఈ  ఇబ్బందులు తొలగిస్తూ విజయవాడ- కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్‌ను ప్రతిపాదించారు. ఈ కొత్త లైన్ గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా సుమారు 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి భవిష్యత్‌లో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు ఒక గొప్ప వరంగా మారనుంది. 

మల్లన్న దర్శనానికి రైలు మార్గం

కోట్లాది మంది భక్తులు సందర్శించే శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైలు మార్గం ఉండాలనే దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీని వల్ల అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ఇటు మార్కాపురం వైపు నుంచి వచ్చే వారికి శ్రీశైలానికి నేరుగా రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు 184కిలోమీటర్ల కొత్త లైన్ ద్వారా తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ నౌకాశ్రయాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది. నెల్లూరు నుంచి రాజంపేట వైపు వెళ్లాలంటే రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అలా కాకుండా 120 కిలోమీటర్ల నేరుగా కొత్త లైన్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రవాణాకు ఉపయోగపడేలా 150కిలోమీటర్ల మేర ఈ లైన్ ప్రతిపాదించారు. 58 కిలోమీటర్ల కళ్యాణదుర్గం- అనంతపురం మధ్య రైల్వే లైన్ పూర్తి అయితే రాయదుర్గం నుంచి అనంతపురానికి నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. గూడూరు నుంచి దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్‌ పోర్టుకు, అక్కడ నిర్మించబోయే షిప్ బిల్డింగ్‌ యూనిట్‌కు రైల్వే రైన్ కోసం మళ్లీ సర్వే చేయనున్నారు. 

Frequently Asked Questions

విజయవాడ - విశాఖపట్నం మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ ఎంత దూరం ఉంటుంది?

ఈ కారిడార్ సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

విజయవాడ నుండి కర్నూలుకు సెమీ హైస్పీడ్ రైలుతో ఎంత సమయంలో చేరుకోవచ్చు?

సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి, భవిష్యత్తులో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.

శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రతిపాదించారు?

హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి అధికారులు ప్రతిపాదించారు.

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget