అన్వేషించండి

Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!

ఏపీ రైల్వే ప్రయాణంలో కీలక మార్పులు రానున్నాయి. విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన సిద్ధమవుతోంది. దీంతోపాటు విజయవాడ నుంచి కర్నూలుకు రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Vijayawada- Visakha High Speed Rail: ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, మారుమూల ప్రాంతాలకు, పుణ్య క్షేత్రాలకు రైలు సౌకర్యం కల్పించేలా రైల్వే శాఖ ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా బులెట్ రైళ్లు, సమీ హైస్పీడ్‌ రైళ్లు, కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైనల్‌ లొకేషన్ సర్వే కోసం రైల్వే అధికారులు బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంకానున్నాయి. 

విజయవాడ - విశాఖ మధ్య హైస్పీడ్ ప్రయాణం

రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ, విశాఖ మధ్య ప్రయాణం ఇకపై మరింత వేగంగా సాగనుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కారిడార్‌ ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ రైలు అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, అమరావతి- విజయవాడ- విశాఖ ప్రాంతాలను కలుపుతూ, భవిష్యత్తులో హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌కు అనుసంధానంకానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ కారిడార్లను కేంద్రం ప్రకటించగా అందులో ఏపీ మీదుగా వెళ్లే హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్‌- బెంగళూరు, చెన్నై - బెంగళూరు కారిడార్లతో ఇప్పుడు నాలుగో కారిడార్‌ కూడా చేరనుంది. 

విజయవాడ నుంచి కర్నూలు రెండు గంటల్లోనే...

రాయలసీమ, కోస్తా ఆంధ్రను కలిపే కీలక మార్గంలో కూడా భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి కర్నూలుకు నేరుగా వెళ్లే రైలు సౌకర్యం లేదు. ప్రయాణికులు డోన్ లేదా నంద్యాల వద్ద రైలు దిగి మరో రైలు ఎక్కాల్సి వస్తోంది. ఈ  ఇబ్బందులు తొలగిస్తూ విజయవాడ- కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్‌ను ప్రతిపాదించారు. ఈ కొత్త లైన్ గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా సుమారు 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి భవిష్యత్‌లో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు ఒక గొప్ప వరంగా మారనుంది. 

మల్లన్న దర్శనానికి రైలు మార్గం

కోట్లాది మంది భక్తులు సందర్శించే శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైలు మార్గం ఉండాలనే దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీని వల్ల అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ఇటు మార్కాపురం వైపు నుంచి వచ్చే వారికి శ్రీశైలానికి నేరుగా రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు 184కిలోమీటర్ల కొత్త లైన్ ద్వారా తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ నౌకాశ్రయాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది. నెల్లూరు నుంచి రాజంపేట వైపు వెళ్లాలంటే రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అలా కాకుండా 120 కిలోమీటర్ల నేరుగా కొత్త లైన్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రవాణాకు ఉపయోగపడేలా 150కిలోమీటర్ల మేర ఈ లైన్ ప్రతిపాదించారు. 58 కిలోమీటర్ల కళ్యాణదుర్గం- అనంతపురం మధ్య రైల్వే లైన్ పూర్తి అయితే రాయదుర్గం నుంచి అనంతపురానికి నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. గూడూరు నుంచి దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్‌ పోర్టుకు, అక్కడ నిర్మించబోయే షిప్ బిల్డింగ్‌ యూనిట్‌కు రైల్వే రైన్ కోసం మళ్లీ సర్వే చేయనున్నారు. 

Frequently Asked Questions

విజయవాడ - విశాఖపట్నం మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ ఎంత దూరం ఉంటుంది?

ఈ కారిడార్ సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

విజయవాడ నుండి కర్నూలుకు సెమీ హైస్పీడ్ రైలుతో ఎంత సమయంలో చేరుకోవచ్చు?

సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి, భవిష్యత్తులో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.

శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రతిపాదించారు?

హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి అధికారులు ప్రతిపాదించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ
ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు!
Advertisement

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Iran War 2026: 'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
'మేమే తేలుస్తాం.. ట్రంప్ చెప్పడానికి లేదు'; యుద్ధంపై అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్
Social Media Addiction: సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
సోషల్ మీడియాను వ్యసనంగా మారుస్తున్న మెటా, యూట్యూబ్‌! కాలిఫోర్నియా జ్యూరీ సంచలన నిర్ణయం! బాధితురాలికి భారీ పరిహారం!
Daily 10-Minute Yoga : రోజుకు 10 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలు చేస్తే బాడీ ఫిట్, మైండ్ కూల్ అవుతుంది
రోజుకు 10 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలు చేస్తే బాడీ ఫిట్, మైండ్ కూల్ అవుతుంది
Gas Crisis: అంగారకుడి దృష్టి యుద్ధంపై, శుక్రుడి దృష్టి చమురు, గ్యాస్‌పై !ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా?
అంగారకుడి దృష్టి యుద్ధంపై, శుక్రుడి దృష్టి చమురు, గ్యాస్‌పై !ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా?
Affordable Safe Cars Under 10 Lakhs: 10 లక్షల రూపాయల కన్నా తక్కువ ధరకే లభించే 5 సురక్షితమైన కార్లు! వాటి రేటింగ్‌లను తెలుసుకోండి
10 లక్షల రూపాయల కన్నా తక్కువ ధరకే లభించే 5 సురక్షితమైన కార్లు! వాటి రేటింగ్‌లను తెలుసుకోండి
Vishnupriyaa Bhimeneni: బుల్లితెరపై విష్ణుప్రియ అందాల ధూమ్ ధామ్... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
బుల్లితెరపై విష్ణుప్రియ అందాల ధూమ్ ధామ్... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Sri Rama Navami Wishes In Telugu 2026: శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!
2026 శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!
Embed widget