అన్వేషించండి

Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!

ఏపీ రైల్వే ప్రయాణంలో కీలక మార్పులు రానున్నాయి. విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన సిద్ధమవుతోంది. దీంతోపాటు విజయవాడ నుంచి కర్నూలుకు రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Vijayawada- Visakha High Speed Rail: ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, మారుమూల ప్రాంతాలకు, పుణ్య క్షేత్రాలకు రైలు సౌకర్యం కల్పించేలా రైల్వే శాఖ ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా బులెట్ రైళ్లు, సమీ హైస్పీడ్‌ రైళ్లు, కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైనల్‌ లొకేషన్ సర్వే కోసం రైల్వే అధికారులు బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంకానున్నాయి. 

విజయవాడ - విశాఖ మధ్య హైస్పీడ్ ప్రయాణం

రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ, విశాఖ మధ్య ప్రయాణం ఇకపై మరింత వేగంగా సాగనుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కారిడార్‌ ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ రైలు అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, అమరావతి- విజయవాడ- విశాఖ ప్రాంతాలను కలుపుతూ, భవిష్యత్తులో హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌కు అనుసంధానంకానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ కారిడార్లను కేంద్రం ప్రకటించగా అందులో ఏపీ మీదుగా వెళ్లే హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్‌- బెంగళూరు, చెన్నై - బెంగళూరు కారిడార్లతో ఇప్పుడు నాలుగో కారిడార్‌ కూడా చేరనుంది. 

విజయవాడ నుంచి కర్నూలు రెండు గంటల్లోనే...

రాయలసీమ, కోస్తా ఆంధ్రను కలిపే కీలక మార్గంలో కూడా భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి కర్నూలుకు నేరుగా వెళ్లే రైలు సౌకర్యం లేదు. ప్రయాణికులు డోన్ లేదా నంద్యాల వద్ద రైలు దిగి మరో రైలు ఎక్కాల్సి వస్తోంది. ఈ  ఇబ్బందులు తొలగిస్తూ విజయవాడ- కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్‌ను ప్రతిపాదించారు. ఈ కొత్త లైన్ గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా సుమారు 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి భవిష్యత్‌లో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు ఒక గొప్ప వరంగా మారనుంది. 

మల్లన్న దర్శనానికి రైలు మార్గం

కోట్లాది మంది భక్తులు సందర్శించే శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైలు మార్గం ఉండాలనే దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీని వల్ల అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ఇటు మార్కాపురం వైపు నుంచి వచ్చే వారికి శ్రీశైలానికి నేరుగా రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు 184కిలోమీటర్ల కొత్త లైన్ ద్వారా తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ నౌకాశ్రయాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది. నెల్లూరు నుంచి రాజంపేట వైపు వెళ్లాలంటే రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అలా కాకుండా 120 కిలోమీటర్ల నేరుగా కొత్త లైన్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రవాణాకు ఉపయోగపడేలా 150కిలోమీటర్ల మేర ఈ లైన్ ప్రతిపాదించారు. 58 కిలోమీటర్ల కళ్యాణదుర్గం- అనంతపురం మధ్య రైల్వే లైన్ పూర్తి అయితే రాయదుర్గం నుంచి అనంతపురానికి నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. గూడూరు నుంచి దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్‌ పోర్టుకు, అక్కడ నిర్మించబోయే షిప్ బిల్డింగ్‌ యూనిట్‌కు రైల్వే రైన్ కోసం మళ్లీ సర్వే చేయనున్నారు. 

Frequently Asked Questions

విజయవాడ - విశాఖపట్నం మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ ఎంత దూరం ఉంటుంది?

ఈ కారిడార్ సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

విజయవాడ నుండి కర్నూలుకు సెమీ హైస్పీడ్ రైలుతో ఎంత సమయంలో చేరుకోవచ్చు?

సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి, భవిష్యత్తులో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.

శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రతిపాదించారు?

హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి అధికారులు ప్రతిపాదించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Karumuri Nageswara Rao: కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 60 దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 60 దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Embed widget