అన్వేషించండి

Nara Lokesh On Visakha Gas Leak: సీఎం జగన్ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేష్ ఫైర్

Nara Lokesh On Atchutapuram SEZ Gas Leak: 2 నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల జగన్ ప్రభుత్వానిది లెక్క లేనితనమని స్పష్టమవుతోందన్నారు నారా లోకేష్.

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌ (Atchutapuram SEZ)లో మరోసారి గ్యాస్ లీక్ కావడంతో దాదాపు యాభై మంది వరకు అనారోగ్యం పాలయ్యారు. 
కేవలం రెండు నెలల్లోనే ఇలాంటి ఘటన రెండోసారి జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని విమర్శించారు. రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది లెక్క లేనితనమని స్పష్టమవుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుంటున్న ప్రజలు..
విశాఖ‌ప‌ట్నంలో జే గ్యాంగ్‌ క‌బ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విష‌ర‌సాయ‌నాల లీకుల‌తో ప్రజ‌లు తమ ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని బ‌తుకుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎల్జీ పాలీమ‌ర్స్ మ‌ర‌ణ‌మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మ‌రువ‌క‌ముందే, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌ సీడ్స్ కంపెనీలో రెండోసారి విష‌వాయువులు లీకై వంద‌ల‌ మంది మ‌హిళ‌లు తీవ్ర అస్వస్థత‌కి గురి కావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగించిందన్నారు.

ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, కమీషన్లు అందితే చాలు !
ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వ‌చ్చిన మ‌హిళల‌ ప్రాణాలు పోయినా ఫ‌ర్వాలేదు... కానీ క‌మీష‌న్లు నెల‌నెలా అందితే చాల‌ు అన్నట్టుంది వైఎస్ జగన్ ప‌రిపాల‌న‌ అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చ‌నిపోయాక ప‌రిహారం ఇవ్వడం కాదని, వాళ్లు బ‌తికేలా ర‌క్షణ చ‌ర్యలు తీసుకోవడమే అసలైన ప్రభుత్వ బాధ్యత అని ఏపీ సీఎం జగన్‌కు లోకేష్ హితవు పలికారు. 

అసలేం జరిగిందంటే.. 
అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌లోని జూన్ మూడో తేదీన తొలిసారి విష వాయులు లీక్ కావడంతో మూడు వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. విషయవాయువు లీక్ కావడానికి కారణాలు తెలుసుకునే కంపెనీ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. నిపుణల కమిటీ వచ్చి పరిశ్రమను పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు కంపెనీ మూసివేయాలని అధికార పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండ్ చేశారు. సరిగ్గా 2 నెలలకు అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీక్‌ అయింది. మంగళవారం సాయంత్రం అందులో పనిచేసేవారు ఒక్కొక్కొరుగా వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
Also Read: Visakhapatnam Gas Leak: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువులు లీక్- యాభై మందికి అస్వస్థత

Also Read: రెండు నెలల్లోనే రెండో ప్రమాదం- అచ్యుతాపురం సెజ్‌లో ఏం జరుగుతోంది? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Kannappa Songs: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
Embed widget