అన్వేషించండి

Andhra Metro News: నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం

Metro : విజయవాడ, విశాఖ మెట్రో కోసం డీపీఆర్ తయారీకి అవసరమైన నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. మెట్రో మంజూరుకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు.

Vijayawada and Visakhapatnam Metro: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సమగ్ర మొబిలిటీ ప్లాన్  పథకంలో భాగంగా ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు   కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.   మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటడంతో.. మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు  నిధులు మంజూరు చేసింది.   కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

మెట్రో ప్రాజెక్టులకూ రూ.42 వేల కోట్లు కేంద్రమే భరించాలంటున్న ఏపీ 
 
విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.  ఏపీ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల రెండింటిలో ఒకటి రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూరుశాతం ఖర్చు భరించేలా, రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపరిచిన కీలకమైన ‘క్లాజ్‌’ను ప్రాతిపదికగా తీసుకుని పూర్తి ఖర్చు భరించాలని కోరుతోంది. ఇందులో భాగంగానే డీపీఆర్ కు నిధులు మంజూరు చేయడంతో కేంద్రమే పూర్తి ఖర్చుతో నిర్మిస్తుందని భరోసాతో ఉన్నారు.                

రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం  ఏపీ  ప్రభుత్వం భారీ ప్రయత్నాలు             

కేంద్రం ఇటీవల నూతన మెట్రో పాలసీ ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వంతో సంబంధం లేకుండా  కేంద్రం మెట్రో ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఉంది.  40 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరంలో మెట్రో నిర్మించే అవకాశం ఉంది. ఈ  రెండు మెట్రో ప్రాజెక్టులకు రూ. 42వేల కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనా ఉంది.                

కేంద్రం గ్రీన్ సిగ్నల్ రాగానే తొలి దశ పనులు             

కేంద్రం డీపీఆర్‌కు నిధులు మంజూరు చేసింది. డీపీఆర్ అధికారికంగా రెడీ కాగానే  తొలిదశ  పనులు ప్రారంభించటానికి ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. విజయవాడ మెట్రోల భాగంగా మొదట  పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌(పీఎన్‌బీఎస్‌) నుంచి గన్నవరం వరకు తొలి కారిడార్, పీఎన్‌‌బీఎస్‌ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు మొత్తంగా 38.40 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టాలని భావిస్తోంది.             

కేంద్రం నుంచి పూర్తి స్థాయి అనుమతి వస్తే చాలు           

విశాఖపట్నంలో కారిడార్‌-1లో భాగంగా స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు  , కారిడార్‌-2లో గురుద్వార్‌ నుంచి పాత పోస్టాఫీసు వరకు, కారిడార్‌-3లో తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు  మొత్తం 46.23 కిలోమీటర్ల మేర తొలిదశ పనులు చేపట్టాలని అనుకుంటోంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Navy Officer Vinay Narwal Pahalgam Terror Attack | హిమాన్షీ కన్నీటికి సమాధానం చెప్పేది ఎవరు.? | ABP DesamSRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
Sugar vs Honey : పంచదారకి బదులు తేనెని ఉపయోగిస్తున్నారా? మంచిదా? కాదా? మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
పంచదారకి బదులు తేనెని ఉపయోగిస్తున్నారా? మంచిదా? కాదా? మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
Pahalgam Terror Attack : ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
Pahalgam Attack: వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
Embed widget