Chandrababu Visits Tirumala: దేవాన్ష్ బర్త్డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Andhra Pradesh News | తన మనవడు నారా దేవాన్ష్ బర్త్డే సందర్భంగా సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ సత్రంలో అన్నదానం చేయనున్నారు.

తిరుమల: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రమే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, దేవాన్ష్లు తిరుమలకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్లో బస చేశారు.
నేటి ఉదయం సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్లతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు చంద్రబాబు కుటుంబానికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.
శ్రీవారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో తన మనవడు, బర్త్ డే బాయ్ నారా దేవాన్ష్ పేరుతో అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాలు భక్తులకు వడ్డించనున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

