Andhra Pradesh Latest News: వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Pradesh News:వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాల అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురి సభ్యుల సిట్కు విజయవాడ కమిషనర్ లీడ్ చేయనున్నారు.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తునకు ఆదేశించింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ లీడ్ చేయనున్నారు. ఆయనతోపాటు మరో ఏడుగురిని ఈ టీంలో ఉంచారు. మద్యం అక్రమాలపై విచారణ చేస్తూ ప్రతి పదిహేను రోజులకోసారి నివేదికను ప్రభుత్వానికి అందివ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం అమ్మకాలపై వేసిన సిట్లో ఉన్న సభ్యులు వీళ్లే
సుబ్బరాయుడు(ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ )
కొల్లి శ్రీనివాస్(అడిషినల్ ఎస్పీ )
శ్రీహరిబాబు(సీఐడీ ఏఎస్పీ )
శ్రీనివాస్(డోన్ డీఎస్పీ )
శివాజీ(డోన్ సీఐ )
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేస్తుందని పేర్కొంది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు ఆఫ్లైన్లో జరిపింది. దీనిపైనే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన తీవ్రంగా తప్పుపట్టింది. అక్రమ సంపాదన కోసమే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ పేమెంట్లు జరుపుతున్నారని ఆరోపించింది.
మద్యం క్రయవిక్రయాల్లో 90వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనా వేస్తోంది. ఈ అక్రమాలు నిగ్గు తేల్చేందుకే ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసింది. దీంతోపాటు హోలోగ్రామ్ ఏర్పాటు విషయంలో కూడా అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తుంది. వీటన్నింటీని ఈ విచారణలో తేల్చేయాలని భావిస్తోంది.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నేతలు- కూటమికి మేలు చేయడానికా? కీడు చేయడానికా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

