అన్వేషించండి

New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!

Toll Plazas: పదిహేను రోజుల తర్వాత ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పని లేదు. శాటిలైట్ బైస్డ్ టోల్ సిస్టమ్ అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

Satellite Based Toll System:   భారతదేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టం 15 రోజుల్లో అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు.  ఈ కొత్త విధానం రావడం వల్ల ఇకపై జాతీయ రహదారులపై టోల్ రేట్ల వద్ద ఆగాల్సిన పని ఉండదు.  భారతదేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టం  జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానాన్ని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ఆధునిక ప్రక్రియ.  ఈ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్  వంటి సాంప్రదాయ టోల్ కలెక్షన్ పద్ధతుల అవసరంఉండదు.   ఈ సిస్టం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం  సాంకేతికతను ఉపయోగించి, వాహనాలు రహదారిపై ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా వసూలు చేస్తుంది. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగవలసిన అవసరం తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.  
 
GNSS టెక్నాలజీ స్వదేశీ నావిగేషన్ సిస్టం అయిన నావిక్  తో పాటు GPS వంటి ఇతర గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది వాహనం  ఖచ్చితమైన స్థానాన్ని ట్రాక్ చేస్తుంది. వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించిన ఖచ్చితమైన దూరాన్ని లెక్కించి, ఆ దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 50 కి.మీ. ప్రయాణిస్తే, ఆ దూరానికి మాత్రమే టోల్ వసూలు చేస్తంది. వాహనంలో ఉండే ఆన్-బోర్డ్ యూనిట్   లేదా GNSS-సామర్థ్యం గల పరికరం ద్వారా టోల్ మొత్తం బ్యాంక్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతుంది.ఈ విధానం  అమలైన తర్వాత టోల్ బూత్‌ల వద్ద ఆగవలసిన అవసరం గణనీయంగా తగ్గుతుంది.చాలా ప్రాంతాల్లో టోల్ ప్లాజాలను తీసేస్తారు. 
 
ఈ నెలలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని ఎంచుకున్న జాతీయ రహదారులపై ప్రారంభం కానుంది. ఒక సంవత్సరంలో, అంటే 2026 నాటికి, దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను విస్తరించే ప్రణాళిక ఉంది.   NavIC సిస్టం యొక్క పూర్తిస్థాయి అందుబాటు మరియు సాంకేతిక సంసిద్ధత ఆధారంగా  గడువు నిర్ణయిస్తారు.  ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మీద ఈ విధానం అమలును పరీక్షించారు.   అయితే NavIC సిస్టం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు.  

ఈ విధానం వల్ల కొన్ని  ఆందోళనలు ఉన్నాయి. వాహనాల ట్రాకింగ్ వల్ల గోప్యత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం  అన్ని వాహనాలలో ఈ సిస్టం అమలు చేయడం సవాళ్లతో కూడుకున్నదిగా భావిస్తున్నారు.  శాటిలైట్ సిస్టం పూర్తిగా అమలులోకి వచ్చే వరకు ఫాస్టాగ్ విధానం కొనసాగుతుంది. కొన్ని రహదారులపై రెండు విధానాలు సమాంతరంగా నడుస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సిస్టం భవిష్యత్తులో స్మార్ట్ హైవేల అభివృద్ధికి దోహదం చేస్తుంది జర్మనీ వంటి దేశాల్లో ఈ సిస్టం విజయవంతంగా అమలవుతోంది, భారతదేశం కూడా ఆ స్థాయి అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget