అన్వేషించండి

YS Jagan Latest News: వైసీపీ కార్యకర్తలకు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్ చెప్పిన జగన్‌- ఇక ర్యాంపేజ్ తప్పదని ప్రత్యర్థులకు వార్నింగ్

YS Jagan News Update: వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపే స్పీచ్ ఇచ్చారు జగన్. జగన్ 2.0ను చూస్తారని ప్రజల కోసం పని చేసిన వ్యక్తినే చూశారని ఇకపై కార్యకర్తల కోసం పని చేసే వ్యక్తిని చూస్తారని అన్నారు.

YS Jagan Latest News: ప్రజల కోసం పని చేస్తే ఎలా ఉంటుందో చూపించామని, ఇప్పుడు కార్యకర్తల కోసం పని చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు వైసీపీ అధినేత జగన్ అన్నారు. బెజవాడ వైసీపీ కార్పోరేటర్లతో సమావేశమైన జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల సందర్భంగా చెప్పినట్టుగానే పథకాలు అమలు చేయలేక చంద్రబాబు చేతులు ఎత్తేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

లండన్ నుంచి వచ్చిన తర్వాత తొలిసారిగా తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సమావేశంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం ఇకపై గట్టిగా పని చేస్తాను అని చెబుతూనే తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఫోకస్ పెట్టి కార్యకర్తలను విస్మరించిన వాట వాస్తవమేనని ఇకపై అలా జరగదని హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు పెట్టిన కష్టాలు, బాధలు చూస్తున్నామని కచ్చితంగా అన్నింటికీ బదులు తీర్చుకుంటామని అన్నారు. 

Also Read: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !

అధికార పార్టీ నాయకులు దొంగ కేసులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని అయినా ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఏళ్లు పరిపాలిస్తామన్నారు. విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నామని వాటిని ప్రజలు గుర్తిస్తున్నారని 9 నెలలు అయిన చంద్రబాబు సూపర్ సిక్స్‌ పథకాలు అమలు చేయలేదని గుర్తు చేశారు.  ఇలా జరుగుతుందని ఎన్నికల ప్రచారంలోనే చెప్పానని గుర్తు చేసారు జగన్. ఇప్పుడు అన్నీ ప్రజలకు గుర్తుకు వస్తున్నాయని ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతోందని ఊరికో బెల్టుషాపు నడుస్తోందని వాటినే ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారని ఆరోపించారు జగన్. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు వరకు ముడుపు చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

Also Read: సినీ హీరో వేణుపై కేసు పెట్టిన సీఎం రమేష్ - కాంట్రాక్టుల్లో వచ్చిన తేడాలే కారణం !

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయని కేసులు పెడతారని వాటిని చూసి భయపడిపోవద్దని అన్నారు జగన్. అలాగని వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. అందుకు తానే ఉదాహరణ అని అన్నారు జగన్. టీడీపీ కాంగ్రెస్ కలిసి తనపై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో కూడా ఉంచారని తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసని అన్నారు. ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు.  

లోకల్‌ సంస్థల ఎన్నికల్లో ఎవరూ సాధించలేని  విజయాలను వైసీపీ సొంతు చేసుకుందని వారిలో కొందర్ని కూటమి ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి లాక్కుంటుందని అన్నారు జగన్. కొందరు మాత్రం వైసీపీకి మద్దతుగా నిలబడ్డారని గుర్తు చేశారు. అలా నిలబడిన వారిని చూసి గర్వపడుతున్నాను అన్నారు. ఇదంతా ప్రజల సహకారంతోనే సాధించామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారమన్నారు. ఎప్పుడు ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామన్నారు. 

కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా సాకులు చెప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు జగన్. అందుకే వైసీపీ నేతలు, కార్యకర్తలు సగర్వంగా ప్రజల మధ్యకు వెళ్లగలుగుతున్నారని జగన్ అన్నారు. అన్ని కష్టాల్లో ప్రజలకు అండగా ఉండటంతో కాలర్ ఎగరేసుకొని తిరగుతున్నామని చెప్పుకొచ్చారు.  గెలిచిన 9 నెలలే అవుతున్నా ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు గురించి అడుగుతున్నారని తెలిపారు. 

ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఆరోపించారు జగన్. చంద్రబాబు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఊహించని మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విశ్వసనీయతతో ప్రజల ముందుకు వెళ్దామన్నారు. ఈసారి జగనన్న 2.0 చూస్తారని అన్నారు. కార్యకర్తల కోసం జగన్ పని చేస్తే ఎలాఉంటుందో చూస్తారని అన్నారు. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తప్పుడు కేసులు పెట్టే వాళ్లపై ప్రైవేటు కేసులు పెడతామన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Embed widget