అన్వేషించండి

TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు

TTD Goshala News Update | టీటీడీ నిర్వహించే గోశాలలో ఆవులను సరిగ్గా చూసుకోవడం లేదని, భారీగా గోవులు చనిపోతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించారు.

TTD EO shyamala rao | టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయని, అయినా చర్యలు లేవని బోర్డు పట్టించుకోవడం లేదని వైసీపీ నేత, టీడీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఇటీవల ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ ఈవో జే శ్యామలా రావు స్పందించారు. టీటీడీ గోశాలలో గోవులు మరణాలు నిజమే అన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చినెలలో 43 గోవులు చనిపోయాయని స్పష్టం చేశారు. గతంలో వైసిపి హయాంలో ఏడాదిలో 179 గోవులు చనిపోయాయని తెలిపారు.

ప్రస్తుతం టిటిడి గోశాలలో టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు. అనారోగ్యంతో, వృద్ధాప్యంతోనే గోవులు చనిపోతున్నాయి. మేం వాస్తవాలను ప్రస్తుతం చెబుతున్నాం. గతంలో లాగా గోశాలకు సంబంధించి వాస్తవాలను దాచిపెట్టాలని చూడటం లేదు. గత మూడు నెలల్లో 59 గోవులు పుట్టాయి. గోశాలలో మరణించిన ప్రతిగోవుకు పోస్టుమార్టం చేస్తున్నాం. ప్రస్తుతం గోశాలలో టిటిడి సిబ్బంది గోవులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.

వైసిపి హయాంలో గోశాలలో ఎన్నో అక్రమాలు జరిగాయని, 2021 నుంచి 2024 వరకు విజిలెన్స్ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వైసిపి హయాంలో మరణించిన గోవుల సంఖ్యను గోప్యంగా ఉంచారు. గతంలో గోవులకు పురుగులు ఉన్న దానాను పెట్టారు. కాలం చెల్లిన మెడిసిన్స్ ను గోవులకు వాడారు. వ్యాధి సోకిన గోవులకు సైతం సరైన వైద్యం చేయలేదు. వైసిపి హయాంలో గోశాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పురుగులతో నిండిపోయిన వాటిని మిశ్రమాలను తాగించారు. ఆ సమయంలో లేబుల్ లేని, నాణ్యత లేని మందులను గోవులను వాడారు. వ్యాధి సోకిన గోవులను సపరేట్ చేయకుండా మిగతా అన్ని గోవులతో కలిపేశారు. వైసిపి హయాంలో గోశాలలోకి విజిలెన్స్ వారిని అనుమతించలేదు. గతంలో ఉన్న గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి టిటిడి విజిలెన్స్ ను గోశాలలోకి రానివ్వలేదు. గోశాలలో వారి బాగోతం బయటపడుతుందని హరినాథరెడ్డి విజిలెన్స్ ను అడ్డుకున్నారు.

భూమన దానాలో 78 లక్షలు నొక్కేశారు..
భూమన కరుణాకర్ రెడ్డి గోవుల దానాలో 78లక్షల రూపాయల కమిషన్ నొక్కేశారు. గోశాలలో నిర్మాణాల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నారు. గత పాలకమండలి గోశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రెండుసార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయి. వైసిపి హయాంలోనే గోశాలను గోవధశాలగా మార్చారు. ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన ఫోటోలన్నీ ఫేక్. ఎక్కడో చనిపోయిన గోవుల ఫొటోలు తీసుకొచ్చి టిటిడి గోశాల గోవులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శ్రీవారి మనోభావాలు దెబ్బతినేలా మాజీ చైర్మన్ భూమన మాట్లాడారు.

గత టీటీడీ బోర్డుకు కమీషన్లు అందాయి.. త్వరలోనే చర్యలు
కల్తీ నెయ్యి కేసులో గత టిటిడి పాలకమండలి ఛైర్మన్లకు కమీషన్లు అందాయి. రూ.320కి నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుంది. వైష్ణవి డెయిరీ, ఎ.ఆర్.డెయిరీ నుంచి గత బోర్డుకు ముడుపులు అందాయి. కల్తీ నెయ్యితోనే ప్రసాదాలను తయారు చేశారు. ఈ విషయంలో ఇద్దరు టిటిడి ఉద్యోగులు గత పాలకమండలికి సహకరించారు. టిటిడి ఉద్యోగుల పాత్ర నిర్థారణ అయ్యింది. త్వరలోనే వారిపైన చర్యలు ఉంటాయని’ శ్యామలారావు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget