అన్వేషించండి

TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు

TTD Goshala News Update | టీటీడీ నిర్వహించే గోశాలలో ఆవులను సరిగ్గా చూసుకోవడం లేదని, భారీగా గోవులు చనిపోతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించారు.

TTD EO shyamala rao | టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయని, అయినా చర్యలు లేవని బోర్డు పట్టించుకోవడం లేదని వైసీపీ నేత, టీడీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఇటీవల ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ ఈవో జే శ్యామలా రావు స్పందించారు. టీటీడీ గోశాలలో గోవులు మరణాలు నిజమే అన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చినెలలో 43 గోవులు చనిపోయాయని స్పష్టం చేశారు. గతంలో వైసిపి హయాంలో ఏడాదిలో 179 గోవులు చనిపోయాయని తెలిపారు.

ప్రస్తుతం టిటిడి గోశాలలో టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు. అనారోగ్యంతో, వృద్ధాప్యంతోనే గోవులు చనిపోతున్నాయి. మేం వాస్తవాలను ప్రస్తుతం చెబుతున్నాం. గతంలో లాగా గోశాలకు సంబంధించి వాస్తవాలను దాచిపెట్టాలని చూడటం లేదు. గత మూడు నెలల్లో 59 గోవులు పుట్టాయి. గోశాలలో మరణించిన ప్రతిగోవుకు పోస్టుమార్టం చేస్తున్నాం. ప్రస్తుతం గోశాలలో టిటిడి సిబ్బంది గోవులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.

వైసిపి హయాంలో గోశాలలో ఎన్నో అక్రమాలు జరిగాయని, 2021 నుంచి 2024 వరకు విజిలెన్స్ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వైసిపి హయాంలో మరణించిన గోవుల సంఖ్యను గోప్యంగా ఉంచారు. గతంలో గోవులకు పురుగులు ఉన్న దానాను పెట్టారు. కాలం చెల్లిన మెడిసిన్స్ ను గోవులకు వాడారు. వ్యాధి సోకిన గోవులకు సైతం సరైన వైద్యం చేయలేదు. వైసిపి హయాంలో గోశాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పురుగులతో నిండిపోయిన వాటిని మిశ్రమాలను తాగించారు. ఆ సమయంలో లేబుల్ లేని, నాణ్యత లేని మందులను గోవులను వాడారు. వ్యాధి సోకిన గోవులను సపరేట్ చేయకుండా మిగతా అన్ని గోవులతో కలిపేశారు. వైసిపి హయాంలో గోశాలలోకి విజిలెన్స్ వారిని అనుమతించలేదు. గతంలో ఉన్న గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి టిటిడి విజిలెన్స్ ను గోశాలలోకి రానివ్వలేదు. గోశాలలో వారి బాగోతం బయటపడుతుందని హరినాథరెడ్డి విజిలెన్స్ ను అడ్డుకున్నారు.

భూమన దానాలో 78 లక్షలు నొక్కేశారు..
భూమన కరుణాకర్ రెడ్డి గోవుల దానాలో 78లక్షల రూపాయల కమిషన్ నొక్కేశారు. గోశాలలో నిర్మాణాల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నారు. గత పాలకమండలి గోశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రెండుసార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయి. వైసిపి హయాంలోనే గోశాలను గోవధశాలగా మార్చారు. ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన ఫోటోలన్నీ ఫేక్. ఎక్కడో చనిపోయిన గోవుల ఫొటోలు తీసుకొచ్చి టిటిడి గోశాల గోవులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శ్రీవారి మనోభావాలు దెబ్బతినేలా మాజీ చైర్మన్ భూమన మాట్లాడారు.

గత టీటీడీ బోర్డుకు కమీషన్లు అందాయి.. త్వరలోనే చర్యలు
కల్తీ నెయ్యి కేసులో గత టిటిడి పాలకమండలి ఛైర్మన్లకు కమీషన్లు అందాయి. రూ.320కి నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుంది. వైష్ణవి డెయిరీ, ఎ.ఆర్.డెయిరీ నుంచి గత బోర్డుకు ముడుపులు అందాయి. కల్తీ నెయ్యితోనే ప్రసాదాలను తయారు చేశారు. ఈ విషయంలో ఇద్దరు టిటిడి ఉద్యోగులు గత పాలకమండలికి సహకరించారు. టిటిడి ఉద్యోగుల పాత్ర నిర్థారణ అయ్యింది. త్వరలోనే వారిపైన చర్యలు ఉంటాయని’ శ్యామలారావు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget