అన్వేషించండి

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు

Hyderabad Metro Rail: ముసారాంబాగ్ స్టేషన్‌లో ఒక్క రైలు ఆగిపోయిన కార‌ణంగా, మిగ‌తా రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది.

Hyderabad Metro: హైద‌రాబాద్ మ‌ల‌క్‌పేట సమీపంలోని ముసారాంబాగ్ మెట్రో స్టేష‌న్‌లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు నిలిచిపోయిందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆగిపోయినట్లుగా మెట్రో అధికారులు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేప‌ట్టిన‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయితే, ముసారాంబాగ్ స్టేషన్‌లో ఒక్క రైలు ఆగిపోయిన కార‌ణంగా, మిగ‌తా రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడ స్టేషన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.

నష్టాల్లోనే హైదరాబాద్ మెట్రో

మరోవైపు, మెట్రో సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. 2020-21లో రూ.1,766 కోట్ల మేర నష్టాలు మూటగట్టుకుంది. 2021 నుంచి క్రమంగా ప్రయాణీకుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రోజుకు 2.5 నుంచి 3 లక్షల మంది మెట్రోరైళ్లలో రాకపోకలు సాగిస్తున్నా ఆశించినంతగా నష్టాల నుంచి బయటపడలేకపోతున్నారు. 2021-22 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1745 కోట్ల నష్టాలు వచ్చాయి.

Also Read: Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. దీంతో సంస్థ లాభనష్టాలు లేని దశకు చేరుకుంది. వచ్చే ఏడేళ్లలో మొత్తం మెట్రోనే బ్రేక్‌ ఈవెన్‌కు వస్తుందని భావించగా కరోనాతో అంచనాలు రివర్స్ అయ్యాయి. 2020లో లాక్‌డౌన్‌ సమయంలో మెట్రోరైళ్లు 169 రోజులు డిపోలకే పరిమితం అయ్యాయి. పునః ప్రారంభం అయినా ఏ దశలోనూ ప్రయాణికులు సంఖ్య 2.20 లక్షలు దాటలేదు. మెట్రో మాల్స్ తెరిచినా కస్టమర్లు రాక ఆదాయం పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మెట్రో ఆదాయం రూ.386 కోట్లు మాత్రమే రాగా, ఖర్చు మాత్రం రూ.2,152 కోట్లు అయ్యింది. ఇందులో వడ్డీ చెల్లింపులకే రూ.1,412 కోట్లు ఉంటోంది.

ఈ ఏడాది జూన్ తర్వాత రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 5 లక్షలకు చేరుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. సెలవు రోజుల్లో ప్రవేశపెట్టిన రూ.59 టిక్కెట్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఐటీ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలుకుతుండటంతో క్రమంగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ ప్రాజెక్టు రోజుకు 15 లక్షల మంది రాకపోకలు సాగించగలిగే సామర్థ్యంతో నిర్మించారు.

Also Read: Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Rambha Re Entry: రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Rambha Re Entry: రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
పోసాని కృష్ణమురళికి అస్వస్థత - సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు!
SBI PO: ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Crime News: తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
Skype: చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
Uttarakhand Avalanche: మంచు కప్పిన విషాదం, నలుగురు కార్మికులు మృతి - మంచు చరియల కింద మరో ఆరుగురు!
మంచు కప్పిన విషాదం, నలుగురు కార్మికులు మృతి - మంచు చరియల కింద మరో ఆరుగురు!
Embed widget