అన్వేషించండి

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు

Hyderabad Metro Rail: ముసారాంబాగ్ స్టేషన్‌లో ఒక్క రైలు ఆగిపోయిన కార‌ణంగా, మిగ‌తా రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది.

Hyderabad Metro: హైద‌రాబాద్ మ‌ల‌క్‌పేట సమీపంలోని ముసారాంబాగ్ మెట్రో స్టేష‌న్‌లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు నిలిచిపోయిందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆగిపోయినట్లుగా మెట్రో అధికారులు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేప‌ట్టిన‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయితే, ముసారాంబాగ్ స్టేషన్‌లో ఒక్క రైలు ఆగిపోయిన కార‌ణంగా, మిగ‌తా రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడ స్టేషన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.

నష్టాల్లోనే హైదరాబాద్ మెట్రో

మరోవైపు, మెట్రో సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. 2020-21లో రూ.1,766 కోట్ల మేర నష్టాలు మూటగట్టుకుంది. 2021 నుంచి క్రమంగా ప్రయాణీకుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రోజుకు 2.5 నుంచి 3 లక్షల మంది మెట్రోరైళ్లలో రాకపోకలు సాగిస్తున్నా ఆశించినంతగా నష్టాల నుంచి బయటపడలేకపోతున్నారు. 2021-22 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1745 కోట్ల నష్టాలు వచ్చాయి.

Also Read: Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. దీంతో సంస్థ లాభనష్టాలు లేని దశకు చేరుకుంది. వచ్చే ఏడేళ్లలో మొత్తం మెట్రోనే బ్రేక్‌ ఈవెన్‌కు వస్తుందని భావించగా కరోనాతో అంచనాలు రివర్స్ అయ్యాయి. 2020లో లాక్‌డౌన్‌ సమయంలో మెట్రోరైళ్లు 169 రోజులు డిపోలకే పరిమితం అయ్యాయి. పునః ప్రారంభం అయినా ఏ దశలోనూ ప్రయాణికులు సంఖ్య 2.20 లక్షలు దాటలేదు. మెట్రో మాల్స్ తెరిచినా కస్టమర్లు రాక ఆదాయం పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మెట్రో ఆదాయం రూ.386 కోట్లు మాత్రమే రాగా, ఖర్చు మాత్రం రూ.2,152 కోట్లు అయ్యింది. ఇందులో వడ్డీ చెల్లింపులకే రూ.1,412 కోట్లు ఉంటోంది.

ఈ ఏడాది జూన్ తర్వాత రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 5 లక్షలకు చేరుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. సెలవు రోజుల్లో ప్రవేశపెట్టిన రూ.59 టిక్కెట్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఐటీ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలుకుతుండటంతో క్రమంగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ ప్రాజెక్టు రోజుకు 15 లక్షల మంది రాకపోకలు సాగించగలిగే సామర్థ్యంతో నిర్మించారు.

Also Read: Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
BRS Leaders : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
Puri Sethupathi Latest Update: పూరి సేతుపతి మూవీపై క్రేజీ అప్డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
పూరి సేతుపతి మూవీపై క్రేజీ అప్డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Advertisement

వీడియోలు

TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
ఆ క్రెడిట్ ద్రవిడ్‌దే..! గంభీర్‌కి షాకిచ్చిన రోహిత్
గ్రౌండ్‌‌లోనే ప్లేయర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన పృథ్వి షా
ప్యానిక్ మోడ్‌లో పీసీబీ అడుక్కుంటున్నా నో అంటున్న ఫ్యాన్స్!
ముంబై ఇండియన్స్ లోకి ధోనీ? CSK ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
BRS Leaders : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
Puri Sethupathi Latest Update: పూరి సేతుపతి మూవీపై క్రేజీ అప్డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
పూరి సేతుపతి మూవీపై క్రేజీ అప్డేట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
YS Jagan Tour: నేడు అనకాపల్లి మెడికల్ కాలేజీకి జగన్- టూర్‌పై పోలీసులు ఆంక్షలు- అయినా భారీగా ప్లాన్ చేసిన వైసీపీ 
నేడు అనకాపల్లి మెడికల్ కాలేజీకి జగన్- టూర్‌పై పోలీసులు ఆంక్షలు- అయినా భారీగా ప్లాన్ చేసిన వైసీపీ 
Upendra Re Release: 'ఉపేంద్ర' మూవీ రీ రిలీజ్ - 26 ఏళ్ల తర్వాత మళ్లీ కల్ట్ క్లాసిక్ చూసేందుకు రెడీయేనా...
'ఉపేంద్ర' మూవీ రీ రిలీజ్ - 26 ఏళ్ల తర్వాత మళ్లీ కల్ట్ క్లాసిక్ చూసేందుకు రెడీయేనా...
BRS Chalo Bas Bhavan : బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌ పిలుపుతో నేతల హౌస్‌ అరెస్టు- మండిపడుతున్న గులాబీ నేతలు 
బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌ పిలుపుతో నేతల హౌస్‌ అరెస్టు- మండిపడుతున్న గులాబీ నేతలు 
Visakhapatnam data centre: విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర
విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర
Embed widget