అన్వేషించండి

Uttarakhand Avalanche: మంచు కప్పిన విషాదం, నలుగురు కార్మికులు మృతి - మంచు చరియల కింద మరో ఆరుగురు!

Uttarakhand News | ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు తెలిపారు.

Pushkar Singh Dhami | చమోలి: ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని మానా గ్రామంలో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మంచు కురుస్తుండటంతో దాన్ని తొలగించే క్రమంలో సిబ్బంది మీద మంచు చరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం సిబ్బంది కొందర్ని కాపాడగా, శనివారం ఉదయం మరో 14 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. వారిని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. మంచులో 55 మంది చిక్కుకోగా, వారిలో 49 మందిని కాపాడింది సిబ్బంది. మరో ఆరు మంది మంచు కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

అయితే జోషిమత్‌‌లో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న వారిలో నలుగురు కార్మికులు మృతిచెందారు. మంచులో చిక్కుకున్న ఆరుగురిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొదట పరిస్థితి విషమించి ఒకరు చనిపోయారని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు సైతం చనిపోవడంతో.. మృతుల సంఖ్య  నాలుగుకు చేరింది. 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం జోషిమత్‌లోని ఆర్మీ ఆసుపత్రిని సందర్శించారు. మానాలో మంచు చరియలు విరిగిపడి వాటి కింద చిక్కుకుని గాయపడిన వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భారత సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి శుక్రవారం 35 మందిని మంచు నుంచి రక్షించింది. శనివారం ఉదయం మరో 14 మంది పౌరులను రక్షించినట్లు భారత సైన్యం బ్రిగేడియర్ ఎంఎస్ ధిల్లాన్ తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.
చమోలిలోని మనాలో మంచు చరియలు విరిగి పడిన ప్రాంతాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. 
ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిన ఘటనపై పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి అన్నారు. వీలైనంత త్వరగా మంచు కింద చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.


బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలోని చమోలి జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. భారత్‌- టిబెట్‌ సరిహద్దులో ఉండి మన దేశంలో చివరి గ్రామాలలో ఒకటి అది. సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచును బీఆర్‌ఓ సిబ్బంది తొలగిస్తున్న క్రమంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. మరోవైపు వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఐదు నుంచి 7 అడుగుల మంచులో కూరుకుపోయిన వారిని ఆర్మీ రక్షించింది. మరో ఆరుగురు మంచు కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget